ఇండియాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 18,166 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ప్రస్తుతం దేశంలో 2,30,971 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 214 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,50,589 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో 23,624 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 94,70,10,175 మందికి కరోనా టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.