ఇండియా కరోనా కేసులు రోజు రోజుకు తగ్గు ముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 13,058 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 164 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో 19,470 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,40,94,373 కు పైగా పెరగగా.. రికవరీ కేసులు 3,40,94,373 కు పెరిగాయి. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,83,118 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది కేంద్రం. ఇక మరోవైపు.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 98,67,69,411 మందికి టీకా వేసినట్లు బులెటిన్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ.