India Strongly Condemns: అణు బెదిరింపులపై భారత్ ఫైర్.. భయపడేది లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Strongly Condemns: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికా పర్యటనలో భాగంగా భారత్పై చేసిన అణుబాంబు బెదరింపు వ్యాఖ్యలను ఇండియా తీవ్రంగా ఖండించింది. అణ్వాయుధాలతో బెదిరించడం పాకిస్థాన్కు పాత అలవాటని, ఇలాంటి ప్రకటనలు ఎంత బాధ్యతారహితంగా ఉన్నాయో అంతర్జాతీయ సమాజం స్వయంగా చూస్తుందని అన్నారు. ఉగ్రవాద సంస్థలతో కుమ్మక్కైన దేశాన్ని.. అణ్వాయుధాల నియంత్రణ, బాధ్యతలో విశ్వసించలేమనే అనుమానాన్ని వ్యక్తం చేసింది.
READ MORE: Yellamma: ‘ఎల్లమ్మ’ ఉన్నట్టా? లేనట్టా?
Also Read
- Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
- LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
బెదిరింపులకు తలవంచేది లేదు..
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అణుబాంబు బెదరింపులపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. ఆయన తన ప్రకటనలో అమెరికాను ప్రస్తావిస్తూ.. ఇండియాతో మంచి సంబంధాలు కలిగి ఉన్న దేశం నుంచి ఇటువంటి ప్రకటనలు చేయడం విచారకరమని చెప్పారు. అణుబెదిరింపులకు
తలొగ్గబోమని ఇండియా ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. జాతీయ భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. పాక్ మిలిటరీకి అమెరికా మద్దతిచ్చినప్పుడల్లా.. వారు తమ నిజస్వరూపాన్ని బయటపెడుతూనే ఉంటారు. పాక్ను ఆ దేశాన్ని సైన్యమే నియంత్రిస్తోంది. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఈ ప్రాంతంతో పాటు ప్రపంచం మొత్తానికి ముప్పు ఎదురైనట్లే అని కేంద్రంలోని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి.
అసిమ్ మునీర్ వ్యాఖ్యలు..
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఫ్లోరిడాలో ప్రవాస పాకిస్థానీయులతో మాట్లాడుతూ.. పాకిస్థాన్ అణ్వస్త్ర సంపన్న దేశం అని చెప్పాడు. ఒకవేళ భవిష్యత్తులో న్యూఢీల్లీ నుంచి తమ అస్థిత్వానికి ముప్పు ఎదురైతే.. తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ పేర్కొన్నాడు. దీనితో పాటు, సింధు నది గురించి కూడా ప్రస్తావిస్తూ.. భారతదేశం సింధు నదిపై ఆనకట్ట నిర్మించబోతోందని, ముందుగా ఆనకట్ట నిర్మించనిచ్చి, తర్వాత క్షిపణి దాడితో దానిని నాశనం చేస్తామని అన్నారు.
READ MORE: Adaso Kapessa: 1985 నుంచి ఇదే ఫస్ట్.. ఎస్పీజీలో తొలి మహిళా ఆఫీసర్..!
తాజావార్తలు
-
Boycott Peddi: మెగా పవర్ స్టార్కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
-
Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?