Adaso Kapessa: 1985 నుంచి ఇదే ఫస్ట్.. ఎస్పీజీలో తొలి మహిళా ఆఫీసర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adaso Kapessa: మణిపూర్లోని ఒక మారుమూల గ్రామం నుండి జాతీయ భద్రతలో ముందంజలో ఉన్న ఆమె ప్రయాణం కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, భారతదేశం అంతటా మహిళలకు, ముఖ్యంగా సాంప్రదాయకంగా పురుషాధిక్య రంగాలలో అడ్డంకులను ఛేదించాలనుకునే వారికి స్ఫూర్తిదాయకమైనది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో ప్రధాని వెనుక నిలబడిన ఒకరు యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. నల్లటి సూట్, ఇయర్పీస్లో ఉన్న ఆ మహిళా ఆఫీసర్ ఫోటో వైరల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 1985లో ఎస్పీజీ ఏర్పాటైనప్పటి నుంచి ఓ మహిళా అధికారిణి ఎస్పీజీలో డ్యూటీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. అసలు ఆ లేడీ ఆఫీసర్ ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ MORE: వీడియో : నిండు కుండలా హుస్సేన్ సాగర్
Also Read
- 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
మణిపూర్ నుంచి ఎస్పీజీలో ఫస్ట్ లేడీ ఆఫీసర్ వరకు..
అదాసో కపేసా… యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెనుక నిలబడిన లేడీ ఆఫీసర్. ఈమె స్వస్థలం మణిపూర్లోని సేనాపతి జిల్లాలోని కైబి గ్రామం. అక్కడ పుట్టిపెరిగిన కపేసా తర్వాత హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర సాయుధ పోలీసు దళం సశస్త్ర సీమా బల్ (SSB)తో తన కెరీర్ను ప్రారంభించింది. తన కెరీర్ స్టార్టింగ్లో ఆమె ఉత్తరాఖండ్లోని పిథోరగఢ్లో ఉన్న 55వ బెటాలియన్లో సేవలందించారు. ఆమె పనితీరు, అంకితభావం ఉన్నత అధికారుల దృష్టిని ఆకర్షించడంతో ఆమె అడుగులు ఎస్జీపీ వైపుకుమళ్లాయి. ఈ క్రమంలో ఆమెకు ఉన్నతాధికారలు నిర్వహించిన పలు కఠినమైన పరీక్షల్లో విజయవంతం అయ్యి, కమాండో శిక్షణ పొందిన తర్వాత ఎస్జీపీకి ఎంపికైంది. ఎస్జీపీలో కపేసా చేరే వరకు ఈ విభాగం పూర్తిగా పురుషులతో కూడి ఉండేది.
ఈక్రమంలోనే ఆమె నియామకం ఒక చారిత్రాత్మక మైలురాయిగా మారింది. యుద్ధ మెలకువలు, వ్యూహాత్మక నిఘా, హై సెక్యూరిటీ ప్రొటోకాల్ నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే తీరు అంశాల్లో కచ్చితత్వం కనబర్చిన కపేసా ఎస్పీజీలో అడుగుపెట్టారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన భద్రతాదళాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఎస్పీజీ బృందంలో కపేసా ప్రవేశించడం వ్యూహాత్మకం, చరిత్రాత్మక నిర్ణయమని అంటున్నారు. ముఖ్యంగా భద్రతా బలగాల్లో స్త్రీ, పురుష భేదం లేదని నిరూపించే ప్రయత్నంగా దీనిని పేర్కొంటున్నారు. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిణి అయిన ఆమె ప్రస్తుతం ఎస్పీజీలో డిప్యుటేషన్పై విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇన్స్పెక్టర్ అదాసో కపేసాను ఎస్జీపీలోకి చేర్చుకోవడం దేశ భద్రతా దళాల దృశ్యంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది. ఆమె ఎంతో మంది మహిళలకు దేశ భద్రత, రక్షణలో కెరీర్లను ఎంచుకోడానికి ఆదర్శంగా నిలుస్తుంది. మణిపూర్లోని ఒక మారుమూల గ్రామం నుంచి ప్రధానమంత్రిని రక్షించేందుకు పక్కన నిలబడటం వరకు ఆమె ప్రయాణం నిజంగా ఎంతో మంది మహిళకు ప్రేరణగా నిలుస్తుంది. కృషి, దృఢ సంకల్పం, నైపుణ్యంతో వ్యవస్థాగత అడ్డంకులను అధిగమించి అసాధ్యం అనిపించే వాటిని సాధించవచ్చని ఆమె కథ నిరూపిస్తుంది సోషల్ మీడియాలో నెటీజన్లు పోస్టులు పెడుతున్నారు. ఎస్జీపీలో ఆమె నియామకం భవిష్యత్తులో మహిళలు భద్రతా రంగం వైపు రావడానికి మార్గం సుగమం చేస్తోందని నెటీజన్లు అభిప్రాయపడుతున్నారు.
READ MORE: War 2: ఎర్లీ మార్నింగ్ షోస్.. YRF ‘OK’ కోసం వెయిటింగ్?
తాజావార్తలు
-
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
-
Chiru – Bobby : చిరంజీవి – బాబీ సినిమా మాస్ సాంగ్’కి పూనకాలే!
-
Pakistani Cinema: నెట్ఫ్లిక్స్తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
ట్రెండింగ్
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!