Central Cabinet: గుడ్ న్యూస్.. మరో 3 పథకాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం..
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర క్యాబినెట్..
- మూడు పథకాలకు గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశ విమానయాన రంగం , అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 2027 మార్చి 25న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సుమారు రూ. 30,640 కోట్ల భారీ ప్యాకేజీతో మూడు ముఖ్యమైన పథకాలకు ఆమోదముద్ర వేశారు. దేశాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే ఈ నిర్ణయాల్లో విమానయాన విస్తరణ, విదేశీయుల రాకపోకల పర్యవేక్షణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలు ప్రధానంగా ఉన్నాయి.
ముఖ్యంగా సామాన్యులకు విమాన ప్రయాణాన్ని చేరువ చేసే ‘ఉడాన్’ (UDAN) పథకంలో భారీ మార్పులు చేస్తూ.. దానిని పదేళ్ల పాటు పొడిగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం రూ. 28,480 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో దేశవ్యాప్తంగా దాదాపు 100 విమానాశ్రయాలను ఆధునీకరించనున్నారు. ఫలితంగా టైర్-2, టైర్-3 నగరాల మధ్య విమాన రాకపోకలు మెరుగుపడటమే కాకుండా.. ప్రాంతీయ అనుసంధానత పెరిగి ఆయా ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి.
Also Read
- Sonia Gandhi: సోనియా గాంధీ ఆత్మకథ పబ్లిష్ నుంచి వైదొలిగిన పెంగ్విన్.. కొత్త పబ్లిషర్ ఎవరంటే..!
- కొండా సురేఖను బీఆర్ఎస్లోకి రానివ్వం.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం: జగదీష్ రెడ్డి
- Sheikh Hasina: డిసెంబర్లో బంగ్లాదేశ్కు వెళ్తా.. మరణశిక్షపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు
- Krishna Janmashtami 2026: జన్మాష్టమి పూజలో ఈ 5 వస్తువులను సమర్పించండి.. అన్నీ శుభ ఫలితాలే..
Also Read:TGPSC: శుభవార్త చెప్పిన టీజీపీఎస్సీ(TGPSC).. ఏప్రిల్ 10 చివరి తేదీ..
మరోవైపు.. దేశంలోకి వచ్చే విదేశీయుల రాకపోకలను పర్యవేక్షించే ‘IVFRT’ (Immigration, Visa, Foreigners Registration Tracking) ప్రాజెక్టును మరో ఐదేళ్ల పాటు కొనసాగించనున్నారు. 2026 ఏప్రిల్ 1 నుంmr 2031 వరకు అమల్లో ఉండే ఈ పథకం కోసం రూ. 1800 కోట్లు కేటాయించారు. దీనివల్ల వీసా ప్రక్రియ వేగవంతం అవ్వడమే కాకుండా.. భద్రతా పరంగా విదేశీయుల ట్రాకింగ్ మరింత పటిష్టంగా మారుతుంది.
వీటితో పాటు.. పర్యావరణ పరిరక్షణపై భారత్ తన నిబద్ధతను చాటుకుంది. నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ (NDC) కింద 2025 నుంచి 2035 వరకు చేరుకోవాల్సిన పర్యావరణ లక్ష్యాలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. కాలుష్య నివారణ, పునరుత్పాదక ఇంధన వినియోగం వంటి అంశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ అడుగులు వేయనుంది. ఈ మూడు నిర్ణయాలు దేశాన్ని ఆధునిక , సుస్థిర అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తాజావార్తలు
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఆత్మకథ పబ్లిష్ నుంచి వైదొలిగిన పెంగ్విన్.. కొత్త పబ్లిషర్ ఎవరంటే..!
-
కొండా సురేఖను బీఆర్ఎస్లోకి రానివ్వం.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం: జగదీష్ రెడ్డి
-
Sheikh Hasina: డిసెంబర్లో బంగ్లాదేశ్కు వెళ్తా.. మరణశిక్షపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు
-
Krishna Janmashtami 2026: జన్మాష్టమి పూజలో ఈ 5 వస్తువులను సమర్పించండి.. అన్నీ శుభ ఫలితాలే..
-
Belgium: భారత్ ఎప్పుడో హెచ్చరించింది, మేము వినలేదు.. చైనాకు బెల్జియం ప్రధాని షాక్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!