Bangladesh: బంగ్లాదేశ్కు షాక్.. కేంద్రం కీలక నిర్ణయం..!
- భారత చర్యలకు బంగ్లాదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపాటు
- యూట్యూబ్లో బ్లాక్ చేసిన జమునా, యాక్టర్ టీవీ, బంగ్లావిజన్, మొహనా
- భద్రత పెంచిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం
Bangladesh: పాకిస్తాన్తో ప్రతిస్పందనల మధ్య భారత్ మరోవైపు బంగ్లాదేశ్పై కూడా దృష్టి సారించింది. భారత్కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న 4 బంగ్లాదేశీ మీడియా సంస్థలపై చర్యలు తీసుకుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశీ మీడియానే స్వయంగా వెల్లడించింది. భారత్ తీసుకున్న ఈ చర్యతో బంగ్లాదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢాకా ట్రిబ్యూన్ కథనం ప్రకారం, బంగ్లాదేశ్కు చెందిన 4 వార్తా ఛానెళ్లను భారతదేశంలో బ్లాక్ చేయాలని నిర్ణయించారు. బ్లాక్ చేయాలని నిర్ణయించిన ఛానెళ్లలో జమునా టీవీ, యాక్టర్ టీవీ, బంగ్లావిజన్ , మొహనా టీవీ ఉన్నాయి.
Sreenidhi Shetty- Sesh: శ్రీనిధి శెట్టిని మళ్లీ ఆడుకున్న అడివి శేష్.. పంచాయతీ సెటిల్ చేసిన నాని!
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఈ వారంలోనే భారత్ బంగ్లాదేశ్కు మరో షాక్ ఇచ్చింది. రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్కు చెందిన 123 మంది చొరబాటుదారులను తిరిగి సరిహద్దు దాటించింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఛానెళ్లు భారత్కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో భారత్ యూట్యూబ్ను ఈ ఛానెళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. భారత్ నుంచి ఆదేశాలు రాగానే యూట్యూబ్ ఈ ఛానెళ్లపై విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఈ ఛానెళ్లు భారత్కు వ్యతిరేకంగా పూర్తిగా అవాస్తవమైన వార్తలను ప్రచారం చేస్తున్నట్లు తేలింది.
యూట్యూబ్ ఈ ఛానెళ్లకు నోటీసులు కూడా పంపింది. సరైన సమాధానం రాకపోతే ఈ ఛానెళ్లను బంగ్లాదేశ్ నుండి కూడా తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ 4 ఛానెళ్లతో పాటు బంగ్లాదేశ్కు చెందిన మరో 34 మీడియా సంస్థలను కూడా విచారిస్తున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్లోని ఈ ఛానెళ్లపై నిషేధం విధించే ముందు భారత్ పాకిస్తాన్కు చెందిన 16 వార్తా ఛానెళ్లను యూట్యూబ్లో బ్లాక్ చేయించింది.
బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలపై ఎలాంటి స్పష్టమైన వైఖరిని ప్రకటించలేదు. ఇప్పటివరకు బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనుస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. యూనుస్ ఈ మొత్తం విషయంలో వేచి చూసే ధోరణితో ఉన్నారు. అయితే యూనుస్ ప్రభుత్వం భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య కొన్ని చర్యలు తీసుకుంది. అవి వారి భయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. యూనుస్ ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల్లో తమ సైనిక భద్రతను పెంచింది. అలాగే హిందువులపై ఎలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. బంగ్లాదేశ్లో హిందువుల భద్రత చాలా కాలంగా ఒక పెద్ద సమస్యగా ఉంది.
OperationSindhoor: జైశంకర్కు అమెరికా విదేశాంగ కార్యదర్శి రుబియో ఫోన్..
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!