Bangladesh: బంగ్లాదేశ్కు షాక్.. కేంద్రం కీలక నిర్ణయం..!
- భారత చర్యలకు బంగ్లాదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపాటు
- యూట్యూబ్లో బ్లాక్ చేసిన జమునా, యాక్టర్ టీవీ, బంగ్లావిజన్, మొహనా
- భద్రత పెంచిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: పాకిస్తాన్తో ప్రతిస్పందనల మధ్య భారత్ మరోవైపు బంగ్లాదేశ్పై కూడా దృష్టి సారించింది. భారత్కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న 4 బంగ్లాదేశీ మీడియా సంస్థలపై చర్యలు తీసుకుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశీ మీడియానే స్వయంగా వెల్లడించింది. భారత్ తీసుకున్న ఈ చర్యతో బంగ్లాదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢాకా ట్రిబ్యూన్ కథనం ప్రకారం, బంగ్లాదేశ్కు చెందిన 4 వార్తా ఛానెళ్లను భారతదేశంలో బ్లాక్ చేయాలని నిర్ణయించారు. బ్లాక్ చేయాలని నిర్ణయించిన ఛానెళ్లలో జమునా టీవీ, యాక్టర్ టీవీ, బంగ్లావిజన్ , మొహనా టీవీ ఉన్నాయి.
Sreenidhi Shetty- Sesh: శ్రీనిధి శెట్టిని మళ్లీ ఆడుకున్న అడివి శేష్.. పంచాయతీ సెటిల్ చేసిన నాని!
Also Read
ఈ వారంలోనే భారత్ బంగ్లాదేశ్కు మరో షాక్ ఇచ్చింది. రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్కు చెందిన 123 మంది చొరబాటుదారులను తిరిగి సరిహద్దు దాటించింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఛానెళ్లు భారత్కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో భారత్ యూట్యూబ్ను ఈ ఛానెళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. భారత్ నుంచి ఆదేశాలు రాగానే యూట్యూబ్ ఈ ఛానెళ్లపై విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఈ ఛానెళ్లు భారత్కు వ్యతిరేకంగా పూర్తిగా అవాస్తవమైన వార్తలను ప్రచారం చేస్తున్నట్లు తేలింది.
యూట్యూబ్ ఈ ఛానెళ్లకు నోటీసులు కూడా పంపింది. సరైన సమాధానం రాకపోతే ఈ ఛానెళ్లను బంగ్లాదేశ్ నుండి కూడా తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ 4 ఛానెళ్లతో పాటు బంగ్లాదేశ్కు చెందిన మరో 34 మీడియా సంస్థలను కూడా విచారిస్తున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్లోని ఈ ఛానెళ్లపై నిషేధం విధించే ముందు భారత్ పాకిస్తాన్కు చెందిన 16 వార్తా ఛానెళ్లను యూట్యూబ్లో బ్లాక్ చేయించింది.
బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలపై ఎలాంటి స్పష్టమైన వైఖరిని ప్రకటించలేదు. ఇప్పటివరకు బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనుస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. యూనుస్ ఈ మొత్తం విషయంలో వేచి చూసే ధోరణితో ఉన్నారు. అయితే యూనుస్ ప్రభుత్వం భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య కొన్ని చర్యలు తీసుకుంది. అవి వారి భయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. యూనుస్ ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల్లో తమ సైనిక భద్రతను పెంచింది. అలాగే హిందువులపై ఎలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. బంగ్లాదేశ్లో హిందువుల భద్రత చాలా కాలంగా ఒక పెద్ద సమస్యగా ఉంది.
OperationSindhoor: జైశంకర్కు అమెరికా విదేశాంగ కార్యదర్శి రుబియో ఫోన్..
తాజావార్తలు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
-
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
-
1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
-
Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!