India Pak War: మనం ఉగ్రవాదులతో యుద్ధం చేస్తున్నాం.. భారత రాయబారి వినయ్ క్వాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pak War: పహల్గాం ఉగ్రదాడికి అనంతరంగా భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్ర కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఉగ్రవాదంతో యుద్ధంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. పాక్ ప్రోత్సాహంతో జరగుతున్న ఉగ్రవాదానికి ఇదే సముచిత ప్రతిస్పందన అని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 22న పహల్గాం వద్ద నలుగురు పాక్కు చెందిన ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 నిరాయుధ పౌరులు వారి భార్యలు, పిల్లల ఎదుటనే మతం పేరుతో హత్య చేయబడ్డారు. ఇదే ఉద్రిక్తతల బీజం అని క్వాత్ర వ్యాఖ్యానించారు. ఇది మామూలు ఘటన కాదు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన దారుణం అని ఆయన అన్నారు.
Read Also: Flights Fly Over Tirumala Temple: తిరుమలలో కలకలం.. శ్రీవారి ఆలయం మీదుగా ఐదు విమానాలు..!
Also Read
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
పహల్గాం దాడికి ప్రతిగా భారత్ గత బుధవారం “ఆపరేషన్ సిందూర్”ను ప్రారంభించి, తొమ్మిది ఉగ్ర శిక్షణా కేంద్రాలపై సునిశిత దాడులు నిర్వహించింది. భారత వైమానిక దళాలు ఉగ్ర స్థావరాలను అంచనాపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నాయని క్వాత్ర వివరించారు. దాడులు ఎవరిపై జరిగాయంటే, ప్రజలను హత్య చేసిన ఉగ్రవాదులపై మాత్రమే. వారి మద్దతుదారులపై మాత్రమే అని ఆయన తెలిపారు.
గత గురువారం రాత్రి పాకిస్తాన్ పంజాబ్, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాల్లోని భారత సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్లు, మిసైళ్లతో దాడి ప్రయత్నం చేసింది. భారత్ ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టి, మూడు పాక్ జెట్లను కూల్చివేసింది. దానికి ప్రతిగా భారత దళాలు పాక్ లోని ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, మిసైల్ వ్యవస్థలపై కౌంటర్ దాడులు జరిపాయి.
Read Also: Rajnath Singh : రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్తో సమావేశమైన త్రివిధ దళాధిపతులు
పాకిస్తాన్ ఎప్పుడూ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ వచ్చింది. 9/11, 26/11 ముంబయి దాడుల నుంచే ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు కూడా అదే చేస్తోందని వినయ్ క్వాత్ర విమర్శించారు. అంతేకాదు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్దే అని స్పష్టం చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం భారత్లో భాగమే. ఇప్పుడు పాక్ ఆక్రమించిన ప్రాంతాన్ని తిరిగి పొందడమే ఏకైక సమస్య అని తెలిపారు. పాకిస్తాన్ గత 30 సంవత్సరాలుగా ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోంది. ఇది ప్రపంచానికి ఆందోళన కలిగించే విషయం అని క్వాత్ర అన్నారు. పాక్ తన పాత్రను వ్యూహంగా ఉపయోగించుకుంటోందని విమర్శించారు. ఈ పరిణామాలు భారత్ ఉగ్రవాదంపై తేలికపాటి వైఖరి లేదని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. దేశ భద్రత కోసం భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై దేశీయంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా మద్దతు పెరుగుతున్నది.
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: మోహన్లాల్ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
-
NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
-
NP50 : నివిన్ పౌలి 50 ‘విజయం’.. ప్రేమమ్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో
-
ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
-
Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..