New Delhi: 2047 వరకు అభివృద్ది చెందిన దేశంగా భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2047 నాటికి భారత దేశం అభివృద్ధి చెందినదిగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ప్రధానంగా మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఇన్నోవేషన్, సమ్మిళిత వృద్ధిపై దృష్టి సారించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఇందుకు అనుగుణంగానే అవసరమైన లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా ఇప్పటికే ప్రభుత్వం పెట్టుబడులకు సంబంధించి పలు కీలక సంస్కరణలను తీసుకువచ్చిందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి వెల్లడించారు.
Read Also: Madhya Pradesh: మైనర్ బాలికపై ముగ్గురు అత్యాచారం.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
భారత్లో యువతకు కొదవలేదని, వారి నైపుణ్యాలను మరింత పదును పెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థను ఇంకా వృద్ధిలోకి తీసుకువెళ్లే ఛాన్స్ ఉందని ఆమె అన్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయటమే ప్రభుత్వ లక్ష్యమని అందుకు తగ్గట్టుగానే వచ్చే మూడు నుంచి ఐదేళ్ల కాలంలో మౌలిక సదుపాయాల కల్పనపై రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతోందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ మౌలిక సదుపాయాల కల్పనతో దేశంలోకి పెట్టుబడులు వస్తాయన్నారు. పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు.
Read Also: Sunday Stotram: స్తోత్ర పారాయణం చేస్తే యశస్వి, నిరోగి, దీర్ఘాయుష్మంతులు అవుతారు
మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రహదారులు, పోర్టులు, ఎయిర్పోర్టుల అభివృద్ధి కాకుండా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వీటితో పాటు ఇన్నోవేషన్కు పెద్ద పీట వేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా అంతరిక్షం, న్యూక్లియర్ ఎనర్జీ తదితర రంగాలపై కూడా నజర్ పెట్టినట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న.. చేపట్టబోయే పనులతో వచ్చే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుందని ఆమె వెల్లడించారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!