INDA Vs SLA: టీమిండియా ఘన విజయం.. ట్రోఫీ కైవసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక వేదికగా జరిగిన ట్రై-నేషన్ ఎ సిరీస్ ఫైనల్ సమరంలో భారత్ ఎ జట్టు ఘనవిజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. దంబుల్లాలోని రంగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో శ్రీలంక ఎ జట్టుపై భారత్ ఎ జట్టు 66 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
సూర్యవంశీ ప్రపంచ రికార్డు విధ్వంసం..
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఎ జట్టుకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా 15 ఏళ్ల బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతను కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదు చేశాడు. కేవలం 29 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య 39 పరుగులు చేయగా, మొదటి వికెట్కు వీరిద్దరూ కేవలం 9 ఓవర్లలోనే 132 పరుగులు జోడించారు.
Also Read
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
భారత్ భారీ స్కోరు..
ఓపెనర్లు అవుటైన తర్వాత కెప్టెన్ తిలక్ వర్మ (67 పరుగులు), రుతురాజ్ గైక్వాడ్ (40 పరుగులు) బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వికెట్ కీపర్ కుమార్ కుశాగ్రా 36 పరుగులు చేయగా, ఆఖర్లో అనుకుల్ రాయ్ కేవలం 15 బంతుల్లో 4 సిక్సర్లతో 39 పరుగులు, విప్రాజ్ నిగమ్ 27 పరుగులు చేసి మెరుపులు మెరిపించారు. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ ఎ జట్టు 9 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది.
శ్రీలంక పోరాటం వృథా..
378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఎ జట్టును భారత బౌలర్లు క్రమశిక్షణతో కట్టడి చేశారు. లంక జట్టులో వనుజ సహన్ (62 పరుగులు), సదీర సమరవిక్రమ (52 పరుగులు) అర్ధశతకాలతో ఒంటరి పోరాటం చేశారు. విజయకాంత్ వియాస్కాంత్ 39 పరుగులు, కెప్టెన్ సహన్ అరాచ్చిగే 38 పరుగులు చేసినప్పటికీ లాభం లేకపోయింది. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక ఎ జట్టు 47.1 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ తరఫున విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్, అనుకుల్ రాయ్ కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించారు.
తాజావార్తలు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!