INDA Vs SLA: టీమిండియా ఘన విజయం.. ట్రోఫీ కైవసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక వేదికగా జరిగిన ట్రై-నేషన్ ఎ సిరీస్ ఫైనల్ సమరంలో భారత్ ఎ జట్టు ఘనవిజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. దంబుల్లాలోని రంగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో శ్రీలంక ఎ జట్టుపై భారత్ ఎ జట్టు 66 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
సూర్యవంశీ ప్రపంచ రికార్డు విధ్వంసం..
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఎ జట్టుకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా 15 ఏళ్ల బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతను కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదు చేశాడు. కేవలం 29 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య 39 పరుగులు చేయగా, మొదటి వికెట్కు వీరిద్దరూ కేవలం 9 ఓవర్లలోనే 132 పరుగులు జోడించారు.
Also Read
- US-Iran peace deal: మేము అణు బాంబు తయారు చేయం.. ఇరాన్ సంచలన ప్రకటన..
- Rahul Gandhi: అయ్యా రాహుల్ గాంధీ.. ఇటలీని చూసి నేర్చుకోండి
- Vaibhav: అది సార్ ‘వైభవ్ సూర్యవంశీ’ అంటే.. తిట్టిన నోళ్లే జైజైలు కొట్టాయి.. ఫిదా అయిన లంక ఆటగాళ్లు..
- Harmanpreet Kaur: ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలి ప్లేయర్గా రికార్డు.. హర్మన్ప్రీత్ కౌర్ అరుదైన ఘటన..
భారత్ భారీ స్కోరు..
ఓపెనర్లు అవుటైన తర్వాత కెప్టెన్ తిలక్ వర్మ (67 పరుగులు), రుతురాజ్ గైక్వాడ్ (40 పరుగులు) బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వికెట్ కీపర్ కుమార్ కుశాగ్రా 36 పరుగులు చేయగా, ఆఖర్లో అనుకుల్ రాయ్ కేవలం 15 బంతుల్లో 4 సిక్సర్లతో 39 పరుగులు, విప్రాజ్ నిగమ్ 27 పరుగులు చేసి మెరుపులు మెరిపించారు. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ ఎ జట్టు 9 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది.
శ్రీలంక పోరాటం వృథా..
378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఎ జట్టును భారత బౌలర్లు క్రమశిక్షణతో కట్టడి చేశారు. లంక జట్టులో వనుజ సహన్ (62 పరుగులు), సదీర సమరవిక్రమ (52 పరుగులు) అర్ధశతకాలతో ఒంటరి పోరాటం చేశారు. విజయకాంత్ వియాస్కాంత్ 39 పరుగులు, కెప్టెన్ సహన్ అరాచ్చిగే 38 పరుగులు చేసినప్పటికీ లాభం లేకపోయింది. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక ఎ జట్టు 47.1 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ తరఫున విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్, అనుకుల్ రాయ్ కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించారు.
తాజావార్తలు
-
INDA Vs SLA: టీమిండియా ఘన విజయం.. ట్రోఫీ కైవసం..
-
US-Iran peace deal: మేము అణు బాంబు తయారు చేయం.. ఇరాన్ సంచలన ప్రకటన..
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Upcoming IPOs: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్.. వచ్చే 7 రోజుల్లో లక్షల కోట్ల గోల్డెన్ ఛాన్స్! ఎలాగో తెలుసా..
-
Rahul Gandhi: అయ్యా రాహుల్ గాంధీ.. ఇటలీని చూసి నేర్చుకోండి
ట్రెండింగ్
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!