IND W vs WI W: రెండో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
- సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు జైత్రయాత్ర
- వెస్టిండీస్ తో జరిగిన టీ20 సిరీస్ ను సొంతం చేసుకోగా..
- తాజాగా వన్డే సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం
- మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఇండియా 115 పరుగుల భారీ తేడాతో విజయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు చెలరేగారు. ఇంతకుముందు వెస్టిండీస్ తో జరిగిన టీ20 సిరీస్ ను సొంతం చేసుకోగా.. తాజాగా వన్డే సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఇండియా 115 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈవిజయంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0తో సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా ఉమెన్స్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. యువ బ్యాటర్ హర్లీన్ డియోల్ సెంచరీతో అదరగొట్టింది. 103 బంతుల్లో 16 ఫోర్లతో 115 పరుగులు చేసింది. వన్డే క్రికెట్ లో హర్లీన్ కు మొదటి సెంచరీ.
Read Also: Minister Nadendla Manohar: ఫుడ్ కల్తీ అనేది సీరియస్ విషయంగా గుర్తించాం..
Also Read
- Harry Brook: "టీమిండియాను వెనక్కి నెట్టేస్తాం.. నా టార్గెట్ ఇదే".. కెప్టెన్ హ్యారీ బ్రూక్ బిగ్ స్టేట్మెంట్..
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
- Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
- Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
ప్రతీకా రావల్ (76), స్మృతి మంధాన (53), జెమీయా రోడ్రిగ్స్ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు. రిచా ఘోష్ (13*), దీప్తి శర్మ (4*) పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో డియాండ్ర డాటిన్, జైదా జేమ్స్, అఫీ ఫ్లెచర్, కియాన జోసెఫ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన వెస్టిండీస్ 46.2 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. హీలీ మాథ్యూస్ (106) సెంచరీతో ఒంటరి పోరాటం చేసింది. 109 బంతుల్లో 13 ఫోర్లతో 106 పరుగులు చేసింది. షమీన్ క్యాంప్బెల్ (38), కియానా జోసెఫ్ (15), నెరిస్సా క్రాఫ్టన్ (13), డియాండ్రా డాటిన్ (10), జాడా జేమ్స్ (25), అఫీ ఫ్లెచర్ (22) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో ప్రియా మిశ్రా 3 వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ 2, టిటాస్ సధు రెండు వికెట్లు తీశారు. రేణుకా సింగ్ ఒక వికెట్ సాధించింది. కాగా.. తొలి వన్డేలో భారత్ 211 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక చివరి వన్డే డిసెంబర్ 27న జరగనుంది.
Read Also: Ramtek bungalow: ‘‘రామ్టెక్ బంగ్లా’’ పేరు వింటేనే ‘మహా’ మంత్రులకు భయం.. కారణాలేంటి..?
తాజావార్తలు
-
Harry Brook: “టీమిండియాను వెనక్కి నెట్టేస్తాం.. నా టార్గెట్ ఇదే”.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ బిగ్ స్టేట్మెంట్..
-
INS Mahendragiri: సాహో భారత్.. సముద్రాన్ని శాసించేందుకు వచ్చిన ‘INS మహేంద్రగిరి’! శత్రుదేశాల గుండెల్లో వణుకే..
-
Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
-
Bhagyasri Borse : ఏడ్చేసిన ‘లెనిన్’ హీరోయిన్.. అండగా నిలబడ్డారంటూ భాగ్యశ్రీ కన్నీళ్లు!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!