IND W vs WI W: రెండో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
- సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు జైత్రయాత్ర
- వెస్టిండీస్ తో జరిగిన టీ20 సిరీస్ ను సొంతం చేసుకోగా..
- తాజాగా వన్డే సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం
- మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఇండియా 115 పరుగుల భారీ తేడాతో విజయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు చెలరేగారు. ఇంతకుముందు వెస్టిండీస్ తో జరిగిన టీ20 సిరీస్ ను సొంతం చేసుకోగా.. తాజాగా వన్డే సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఇండియా 115 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈవిజయంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0తో సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా ఉమెన్స్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. యువ బ్యాటర్ హర్లీన్ డియోల్ సెంచరీతో అదరగొట్టింది. 103 బంతుల్లో 16 ఫోర్లతో 115 పరుగులు చేసింది. వన్డే క్రికెట్ లో హర్లీన్ కు మొదటి సెంచరీ.
Read Also: Minister Nadendla Manohar: ఫుడ్ కల్తీ అనేది సీరియస్ విషయంగా గుర్తించాం..
Also Read
- Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
- Red Fort Blast: ఎర్రకోట ఉగ్రదాడి కేసు.. హిందూ ఆలయమే తొలి టార్గెట్..?
- PM Modi: 2035లో భారత్ కల నెరవేరుతుంది.. 2040లో మాత్రం చంద్రుడిపై జరిగేది ఇదే!
- Russia Aircraft Deal: భారత్కు రష్యా బిగ్ ఆఫర్.. 105 విమానాలు, దేశంలోనే SJ-100 తయారీ!
ప్రతీకా రావల్ (76), స్మృతి మంధాన (53), జెమీయా రోడ్రిగ్స్ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు. రిచా ఘోష్ (13*), దీప్తి శర్మ (4*) పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో డియాండ్ర డాటిన్, జైదా జేమ్స్, అఫీ ఫ్లెచర్, కియాన జోసెఫ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన వెస్టిండీస్ 46.2 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. హీలీ మాథ్యూస్ (106) సెంచరీతో ఒంటరి పోరాటం చేసింది. 109 బంతుల్లో 13 ఫోర్లతో 106 పరుగులు చేసింది. షమీన్ క్యాంప్బెల్ (38), కియానా జోసెఫ్ (15), నెరిస్సా క్రాఫ్టన్ (13), డియాండ్రా డాటిన్ (10), జాడా జేమ్స్ (25), అఫీ ఫ్లెచర్ (22) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో ప్రియా మిశ్రా 3 వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ 2, టిటాస్ సధు రెండు వికెట్లు తీశారు. రేణుకా సింగ్ ఒక వికెట్ సాధించింది. కాగా.. తొలి వన్డేలో భారత్ 211 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక చివరి వన్డే డిసెంబర్ 27న జరగనుంది.
Read Also: Ramtek bungalow: ‘‘రామ్టెక్ బంగ్లా’’ పేరు వింటేనే ‘మహా’ మంత్రులకు భయం.. కారణాలేంటి..?
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
-
Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
-
Red Fort Blast: ఎర్రకోట ఉగ్రదాడి కేసు.. హిందూ ఆలయమే తొలి టార్గెట్..?
-
Telangana : పంచాయతీలకు నిధుల బిగ్ రిలీఫ్.. ట్రెజరీ జాప్యానికి చెక్..!
-
PM Modi: 2035లో భారత్ కల నెరవేరుతుంది.. 2040లో మాత్రం చంద్రుడిపై జరిగేది ఇదే!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?