IND W vs WI W: రెండో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
- సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు జైత్రయాత్ర
- వెస్టిండీస్ తో జరిగిన టీ20 సిరీస్ ను సొంతం చేసుకోగా..
- తాజాగా వన్డే సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం
- మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఇండియా 115 పరుగుల భారీ తేడాతో విజయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు చెలరేగారు. ఇంతకుముందు వెస్టిండీస్ తో జరిగిన టీ20 సిరీస్ ను సొంతం చేసుకోగా.. తాజాగా వన్డే సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఇండియా 115 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈవిజయంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0తో సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా ఉమెన్స్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. యువ బ్యాటర్ హర్లీన్ డియోల్ సెంచరీతో అదరగొట్టింది. 103 బంతుల్లో 16 ఫోర్లతో 115 పరుగులు చేసింది. వన్డే క్రికెట్ లో హర్లీన్ కు మొదటి సెంచరీ.
Read Also: Minister Nadendla Manohar: ఫుడ్ కల్తీ అనేది సీరియస్ విషయంగా గుర్తించాం..
Also Read
- రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
- Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
- Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
- Vaibhav Sooryavanshi: వీలైనంత త్వరగా బుడ్డోడిని టీమిండియా జట్టులోకి తీసుకరండి.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
ప్రతీకా రావల్ (76), స్మృతి మంధాన (53), జెమీయా రోడ్రిగ్స్ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు. రిచా ఘోష్ (13*), దీప్తి శర్మ (4*) పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో డియాండ్ర డాటిన్, జైదా జేమ్స్, అఫీ ఫ్లెచర్, కియాన జోసెఫ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన వెస్టిండీస్ 46.2 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. హీలీ మాథ్యూస్ (106) సెంచరీతో ఒంటరి పోరాటం చేసింది. 109 బంతుల్లో 13 ఫోర్లతో 106 పరుగులు చేసింది. షమీన్ క్యాంప్బెల్ (38), కియానా జోసెఫ్ (15), నెరిస్సా క్రాఫ్టన్ (13), డియాండ్రా డాటిన్ (10), జాడా జేమ్స్ (25), అఫీ ఫ్లెచర్ (22) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో ప్రియా మిశ్రా 3 వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ 2, టిటాస్ సధు రెండు వికెట్లు తీశారు. రేణుకా సింగ్ ఒక వికెట్ సాధించింది. కాగా.. తొలి వన్డేలో భారత్ 211 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక చివరి వన్డే డిసెంబర్ 27న జరగనుంది.
Read Also: Ramtek bungalow: ‘‘రామ్టెక్ బంగ్లా’’ పేరు వింటేనే ‘మహా’ మంత్రులకు భయం.. కారణాలేంటి..?
తాజావార్తలు
-
Job News: ఏడాదికి రూ.55 లక్షల భారీ ప్యాకేజీ.. నోటిఫికేషన్ ఔట్.. ఇలా అప్లై చేసుకోండి!
-
Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
Blast Zone : అంచనాలు లేకుండా వచ్చి అదరగొట్టిన యాక్షన్ కింగ్ అర్జున్ ‘బ్లాస్ట్’
-
Huawei Nova 16 Series: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో.. హువావే నోవా 16 సిరీస్ రిలీజ్
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!