WI vs IND: ఐదేసిన అశ్విన్.. తొలిరోజు భారత్దే ఆధిపత్యం! ఐపీఎల్ ఫామ్ కంటిన్యూ చేసిన యశస్వి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Indies vs India 1st Test Day 1 Highlights:వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్కు మంచి ఆరంభం దక్కింది. ముందుగా విండీస్ను 150 పరుగులకే ఆలౌట్ చేసిన రోహిత్ సేన.. బ్యాటింగ్లోనూ అదరగొట్టింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (30), యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (40) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఇంకా 70 పరుగుల వెనుకంజలో ఉంది. మొదటి రోజు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలం చూపిస్తే.. ఆరంగేట్ర ఆటగాడు జైస్వాల్ ఐపీఎల్ ఫామ్ కంటిన్యూ చేశాడు.
ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 10 ఓవర్లకు 29/0తో నిలిచింది. నిలకడగా ఆడుతున్న త్యాగ్నారాయణ్ చందర్పాల్ (12)ను ఆర్ అశ్విన్ క్లీన్బౌల్డ్ చేయడంతో విండీస్ వికెట్ల పతనం మొదలైంది. బ్రాత్వైట్ (20)ను అశ్విన్.. రీఫర్ (2)ను శార్దూల్ ఠాకూర్.. బ్లాక్వుడ్ (14)ను జడేజా ఔట్ చేశారు. తొలి సెషన్లో 68/4తో నిలిచిన విండీస్.. రెండో సెషన్లోనూ వరుస విరామాల్లో వికెట్స్ కోల్పోయింది.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
Also Read: Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
జోష్వా ద సిల్వా (2)ను జడేజా పెవిలియన్ చేర్చాడు. ఈ క్రమంలో అథనేజ్ (47), జేసన్ హోల్డర్ (18) నిలకడగా ఆడటంతో వెస్టిండీస్ స్కోరు 100 దాటింది. అయితే ఈ భాగస్వామ్యం బలపడుతున్న దశలో హోల్డర్ను సిరాజ్ ఔట్ చేశాడు. కాసేపటికే అల్జారి జోసెఫ్ (4)తో పాటు అథనేజ్లను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. దీంతో టీ విరామ సమయానికి విండీస్ 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. చివరి సెషన్లో కీమర్ రోచ్ (1) జడేజా బౌలింగ్లో వెనుదిరగ్గా.. వారికన్ (0)ను అశ్విన్ ఔట్ చేయడంతో విండీస్ ఆలౌటైంది.
వెస్టిండీస్ ఆలౌట్ అనంతరం భారత్ మొదటి ఇన్నింగ్స్ మొదలెట్టింది. భారత్ తరఫున యశస్వి జైస్వాల్ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ 2023 ప్రదర్శనతో జట్టులోకి వచ్చిన యశస్వి.. అదే ఫామ్ కంటిన్యూ చేశాడు. నిలకడగా ఆడుతూ కెప్టెన్ రోహిత్ శర్మకు అండగా నిలబడ్డాడు. ఈ ఇద్దరు 23 ఓవర్లు ఆడి 80 పరుగులు చేశారు. నేడు కూడా భారత పెనర్లు చెలరేగితే.. విండీస్ ముందు భారీ స్కోర్ ఉంచే అవకాశం ఉంటుంది.
Also Read: Militaries: ప్రపంచవ్యాప్తంగా పవర్ఫుల్ మిలిటరీస్ కలిగిన టాప్-10 దేశాలు
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!