WI vs IND: ఐదేసిన అశ్విన్.. తొలిరోజు భారత్దే ఆధిపత్యం! ఐపీఎల్ ఫామ్ కంటిన్యూ చేసిన యశస్వి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Indies vs India 1st Test Day 1 Highlights:వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్కు మంచి ఆరంభం దక్కింది. ముందుగా విండీస్ను 150 పరుగులకే ఆలౌట్ చేసిన రోహిత్ సేన.. బ్యాటింగ్లోనూ అదరగొట్టింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (30), యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (40) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఇంకా 70 పరుగుల వెనుకంజలో ఉంది. మొదటి రోజు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలం చూపిస్తే.. ఆరంగేట్ర ఆటగాడు జైస్వాల్ ఐపీఎల్ ఫామ్ కంటిన్యూ చేశాడు.
ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 10 ఓవర్లకు 29/0తో నిలిచింది. నిలకడగా ఆడుతున్న త్యాగ్నారాయణ్ చందర్పాల్ (12)ను ఆర్ అశ్విన్ క్లీన్బౌల్డ్ చేయడంతో విండీస్ వికెట్ల పతనం మొదలైంది. బ్రాత్వైట్ (20)ను అశ్విన్.. రీఫర్ (2)ను శార్దూల్ ఠాకూర్.. బ్లాక్వుడ్ (14)ను జడేజా ఔట్ చేశారు. తొలి సెషన్లో 68/4తో నిలిచిన విండీస్.. రెండో సెషన్లోనూ వరుస విరామాల్లో వికెట్స్ కోల్పోయింది.
Also Read
- Ship sink: ఒమన్ తీరంలో మునిగిన షిప్.. 14 మంది భారతీయులకు తప్పిన ప్రమాదం..
- Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
- Women's T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా జట్టులో కీలక మార్పులు..
- PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
Also Read: Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
జోష్వా ద సిల్వా (2)ను జడేజా పెవిలియన్ చేర్చాడు. ఈ క్రమంలో అథనేజ్ (47), జేసన్ హోల్డర్ (18) నిలకడగా ఆడటంతో వెస్టిండీస్ స్కోరు 100 దాటింది. అయితే ఈ భాగస్వామ్యం బలపడుతున్న దశలో హోల్డర్ను సిరాజ్ ఔట్ చేశాడు. కాసేపటికే అల్జారి జోసెఫ్ (4)తో పాటు అథనేజ్లను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. దీంతో టీ విరామ సమయానికి విండీస్ 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. చివరి సెషన్లో కీమర్ రోచ్ (1) జడేజా బౌలింగ్లో వెనుదిరగ్గా.. వారికన్ (0)ను అశ్విన్ ఔట్ చేయడంతో విండీస్ ఆలౌటైంది.
వెస్టిండీస్ ఆలౌట్ అనంతరం భారత్ మొదటి ఇన్నింగ్స్ మొదలెట్టింది. భారత్ తరఫున యశస్వి జైస్వాల్ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ 2023 ప్రదర్శనతో జట్టులోకి వచ్చిన యశస్వి.. అదే ఫామ్ కంటిన్యూ చేశాడు. నిలకడగా ఆడుతూ కెప్టెన్ రోహిత్ శర్మకు అండగా నిలబడ్డాడు. ఈ ఇద్దరు 23 ఓవర్లు ఆడి 80 పరుగులు చేశారు. నేడు కూడా భారత పెనర్లు చెలరేగితే.. విండీస్ ముందు భారీ స్కోర్ ఉంచే అవకాశం ఉంటుంది.
Also Read: Militaries: ప్రపంచవ్యాప్తంగా పవర్ఫుల్ మిలిటరీస్ కలిగిన టాప్-10 దేశాలు
తాజావార్తలు
-
Ship sink: ఒమన్ తీరంలో మునిగిన షిప్.. 14 మంది భారతీయులకు తప్పిన ప్రమాదం..
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
-
Women’s T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా జట్టులో కీలక మార్పులు..
-
PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
ట్రెండింగ్
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!