Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకతో ఆగస్టు 15వ తేదీ నుంచి జరిగే తొలి టెస్టులో భారత జట్టు ముగ్గురు ఎడమచేతి వాటం స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉందని బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ సంకేతాలు ఇచ్చారు. కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, రవీంద్ర జడేజాల వద్ద ఉన్న విభిన్నమైన బౌలింగ్ శైలులు, వికెట్లు తీసే నైపుణ్యాలే దీనికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. కుల్దీప్ తన లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్ తో బ్యాటర్లను అయోమయానికి గురిచేయగలడు, జడేజా తన కచ్చితత్వంతో దిగ్గజ బ్యాటర్లను సైతం ఒత్తిడిలోకి నెట్టగలడు, అలాగే సుతార్ ఎడమచేతి వాటం స్పిన్ తో ఆకట్టుకుంటాడని మోర్కెల్ వివరించారు.
జట్టులోని ముగ్గురు స్పిన్నర్లు ఎడమచేతి వాటం వారే అయినప్పటికీ, అది తమకు ఎంతమాత్రం ఆందోళన కలిగించే అంశం కాదని మోర్కెల్ స్పష్టం చేశారు. సుతార్ బంతిని ఎక్కువగా టర్న్ చేయగలడని, జడేజా లైన్ అండ్ లెంగ్త్ తో కచ్చితంగా బౌలింగ్ చేస్తాడని, కుల్దీప్ తన అనుభవంతో మంచి ప్రదర్శన ఇస్తాడన్నాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ వీరిని సరైన సమయంలో ఎలా ఉపయోగిస్తాడనే దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని, అయితే ప్రత్యర్థి జట్టును రెండు ఇన్నింగ్స్ లలో ఆలౌట్ చేసి 20 వికెట్లు తీసే సామర్థ్యం ఈ ముగ్గురికీ ఉందన్నారు. గాల్ మైదానంలో మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుంది కాబట్టి, ముగ్గురు స్పిన్నర్లతో ఆడటమే సరైన వ్యూహమని ఆయన తెలిపారు.
Also Read
- NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులకు బార్ కౌన్సిల్ షాక్..!
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- Kolkata: కోల్కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
- Rahul Gandhi: అమెరికా-ఇరాన్లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో సీనియర్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కు తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ లేదా గుర్నూర్ బ్రార్ లలో ఒకరికి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. డొమెస్టిక్ క్రికెట్ లో ఆడిన అనుభవం ఉన్న వీరిద్దరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మోర్కెల్ ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇక్కడి తీవ్రమైన వేడి, తేమ వాతావరణాన్ని తట్టుకోవడమే బౌలర్లకు పెద్ద సవాలు అని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కూకబుర్రా బంతి 20 నుంచి 35 ఓవర్ల తర్వాత మెత్తబడినప్పుడు, సరైన ప్రణాళికలతో షార్ట్ బంతులను, క్రీజ్ ను చాకచక్యంగా ఉపయోగిస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడం చాలా ముఖ్యమని మోర్కెల్ వివరించారు.
తాజావార్తలు
-
NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులకు బార్ కౌన్సిల్ షాక్..!
-
Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!