IND vs PAK: క్రికెట్ అభిమానులకి బ్యాడ్ న్యూస్.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కష్టమే! కారణం ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain may disrupt India vs Pakistan Asia Cup 2023 match on Sep 2: ఆసియా కప్ 2023 ఆరంభం అయింది. బుధవారం ముల్తాన్ వేదికగా నేపాల్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. నేడు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మెగా మ్యాచ్ శనివారం (సెప్టెంబర్ 2) జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ జరగడం కష్టమే అని సమాచారం తెలుస్తోంది.
సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందని సమచారం. శనివారం కాండీలో వర్షం పడేందుకు 90 శాతం అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో తేమ 84 శాతం ఉంటుందని పేర్కొంది. దీంతో ఆసియా కప్ 2023లో అత్యంత ఆసక్తికర పోరు వరుణుడి ఖాతాలోకి చేరుతుందా? అనే అనుమానం అభిమానుల్లో నెలకొంది. చూడాలి మరి వరుణుడు ఏం చేస్తాడో.
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
సెప్టెంబర్ 2న జరిగే భారత్, పాకిస్తాన్ మ్యాచ్కి మాత్రమే కాదు.. దాదాపుగా క్యాండీలో జరిగే అన్ని మ్యాచ్లకి వర్షం ముప్పు ఉందట. ఈ రోజు బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్కి 86 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయట. సెప్టెంబర్ 4న భారత్, నేపాల్ మధ్య జరిగే మ్యాచ్కి వర్షం ముప్పు 76 శాతం ఉందని తెలుస్తోంది. వర్షం కారణంగా ఫలితాలు కూడా తారుమారయ్యే అవకాశం ఉంది. దాంతో ఆసియా కప్ 2023లో ఆడే ప్రతి మ్యాచ్ కీలకం కానుంది.
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు! ఏకంగా 60 వేలు
ఆసియా కప్ 2023లో పాల్గొనేందుకు భారత జట్టు బుధవారం శ్రీలంకలో అడుగుపెట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా.. పేసర్ మహ్మద్ షమీ, కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా జట్టంతా ప్రత్యేక బస్సులో విమానాశ్రయం నుంచి హోటల్కు చేరుకుంది. సెప్టెంబరు 2న పాకిస్థాన్ మ్యాచ్తో భారత్ తన ఆసియా కప్ 2023 పోరాటాన్ని ఆరంభిస్తుంది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!