IND vs PAK Match Refund: భారత్తో పాక్ మ్యాచ్ ఆడకపోతే.. ఫ్యాన్స్కు రీఫండ్ వస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK Match Refund: T20 ప్రపంచ కప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ ఫిబ్రవరి 15న భారత్తో మ్యాచ్ ఆడకూడదని ప్రకటించి, T20 ప్రపంచ కప్లో కలకలం రేపింది. పాక్ తీసుకున్న ఈ నిర్ణయంతో టోర్నమెంట్ భాగస్వాములందరికీ (ICC, BCCI, స్పాన్సర్లు) పెద్ద మొత్తంలో నష్టాలు రావడమే కాకుండా, ఈ ‘మెగా మ్యాచ్’ చూడటానికి ముందుగానే టిక్కెట్లు కొనుగోలు చేసిన వేలాది మంది అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. పాకిస్థాన్ ప్రకటన తర్వాత, భారత్- పాక్ మ్యాచ్ను చూడటానికి ముందు గానే టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులు ఇప్పుడు తమ డబ్బులు తిరిగి వస్తాయో లేదో అని ఆందోళన పడుతున్నారు. ఇంతకీ ఈ విషయంలో ICC నియమాలు ఏమి చెబుతున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: T20 World Cup 2026: భారత్ మ్యాచ్ బాయ్కాట్ తర్వాత, పాకిస్తాన్ ‘ఈమెయిల్’ డ్రామా..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ICC టికెట్ రీఫండ్ పాలసీ..
ICC టికెట్ రీఫండ్ పాలసీ ప్రకారం.. కొన్ని పరిస్థితులలో మాత్రమే మీ టికెట్కు పూర్తి వాపసు లభిస్తుంది.
1. టాస్ లేకుండా మ్యాచ్ రద్దు చేస్తే, టిక్కెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు వారి పూర్తి డబ్బు తిరిగి ఇస్తారు.
2. గ్రూప్ దశ లేదా సూపర్ 8 రౌండ్ ముగిసేలోపు ఐదు ఓవర్ల ముందు మ్యాచ్ రద్దు అయితే, ప్రేక్షకులకు వారి టిక్కెట్ల డబ్బులను పూర్తిగా వాపసు ఇస్తారు.
3. సెమీ-ఫైనల్ లేదా ఫైనల్ మ్యాచ్ 10 ఓవర్లకు ముందే రద్దు చేస్తే, మ్యాచ్ ఫలితం రాకపోతే, మీ టికెట్ డబ్బులు పూర్తిగా తిరిగి చెల్లిస్తారు.
ఈ పరిస్థితులలో నో వాపసు..
1. గ్రూప్ దశలో లేదా సూపర్ 8 రౌండ్లో ఐదు ఓవర్ల కంటే ఎక్కువ ఆడి మ్యాచ్ నిర్ణయం కాకపోతే, డబ్బు తిరిగి ఇవ్వరు.
2. సెమీ-ఫైనల్ లేదా ఫైనల్ 10 లేదా అంతకంటే ఎక్కువ ఓవర్లు ఉండి ఫలితం రాకపోతే, టికెట్ డబ్బులు తిరిగి చెల్లించరు.
3. ఏదైనా మ్యాచ్ ఫలితం అధికారికంగా ప్రకటించకపోయినా, ప్రేక్షకులకు డబ్బులు రిటన్ చేయరు.
4. మ్యాచ్ను తిరిగి షెడ్యూల్ చేస్తే, ముందుగా తీసుకున్న టికెట్ మళ్లీ మ్యాచ్ జరిగే తేదీ వరకు చెల్లుతుంది.
మీకు ఎన్ని డబ్బులు వస్తాయి..
టికెట్ ధరను తిరిగి చెల్లించేటప్పుడు, కొనుగోలుదారుకు కన్వీనియన్స్ ఫీజు చెల్లించరు. ఇది టికెట్ ధరలో 10-15 శాతం ఉంటుంది. ఇంకా బుకింగ్ ఛార్జీ (50-200 రూపాయలు), ప్లాట్ఫామ్ ఫీజులు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు మీ టికెట్ ధర ఐదు వేల రూపాయలు అయితే, మీరు రూ.750 కన్వీనియన్స్ ఫీజు, రూ.100 బుకింగ్ ఛార్జీతో సహా రూ.5,850 చెల్లించాలి, కానీ ఆ మ్యాచ్ జరగకపోతే మీకు రూ.5 వేలు మాత్రమే తిరిగి పొందుతారు.
READ ALSO: The Paradise: ‘ది ప్యారడైజ్’ లో కొత్త ట్విస్ట్ .. మోహన్ బాబు విలన్ కాదా!
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!