IND vs PAK: పాకిస్థాన్తో మ్యాచ్లు అంటే భారత్కు భయం: అబ్దుల్ రజాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Did Not Play With Pakistan In 1997-98 says Abdul Razzaq: భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు బాగాలేకపోవడంతో ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్లు ఎక్కువగా జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఇండో-పాక్ జట్లు తలపడుతున్నాయి. చివరిసారిగా టీ20 ప్రపంచకప్ 2022లో దాయాది దేశాలు ఢీ కొన్నాయి. ఇక వన్డే ప్రపంచకప్ 2023లో మరోసారి భారత్-పాకిస్తాన్ తలపడనున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా పేరొందిన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే మెగా టోర్నీ భారత గడ్డపై జరుగుతుంది కాబట్టి పాక్ వస్తుందో లేదో ఇంకా తెలియరాలేదు. పాక్ ప్రభుత్వ అనుమతి ఇస్తేనే పాకిస్తాన్ జట్టు ప్రపంచకప్ 2023లో ఆడుతుందని పీసీబీ చెబుతోంది. దీనిపై త్వరలో స్పష్టత రానుంది.
వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో పాక్ మాజీ ప్లేయర్ అబ్దుల్ రజాక్ స్పందించాడు. 1997-98 సమయంలో పాకిస్థాన్తో మ్యాచ్లు అంటే భారత్కు భయం ఉండేదన్నాడు. ఓ ఇంటర్వ్యూలో అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ… ‘ఇరు జట్ల ఆటగాళ్లకు పరస్పర గౌరవం మరియు స్నేహం ఉంది. కానీ పాకిస్థాన్తో పోటీపడని ఏకైక జట్టు భారత్ మాత్రమే. 1997-98లో పాకిస్తాన్ బలంగా ఉండేది. భారత్ ఎప్పుడూ ఓడిపోతూనే ఉండేది. ఓటములను నివారించుకునేందుకు మాతో ఎక్కువగా మ్యాచ్లు ఆడలేదు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇది 2023 కాబట్టి మన ఆలోచనా విధానం మార్చుకోవాలి. ఇప్పుడు ఏ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. , మ్యాచ్ రోజున ఎవరు మంచి ప్రదర్శన చేస్తారనేదే ముఖ్యం’ అని అన్నాడు.
Also Read
- Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
- Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
Also Read: Higher Pension: హయ్యర్ పింఛన్ దరఖాస్తుకు రేపటితో గడువు ముగింపు
‘ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ జట్లూ బలంగా ఉన్నాయి. పాక్ జట్టు బలహీనంగా ఉందని అనలేం. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ 2023 సిరీస్ను చూస్తే.. ఏ జట్టు బెటర్ అని మీరు ఖచ్చితంగా చెప్పగలరా?. మంచి ప్రదర్శన చేసే జట్టు విజయం సాధిస్తుంది. అన్ని వదిలేసి ఇరు జట్లు ఎప్పటిలా మ్యాచ్లు, ద్వైపాక్షిక సిరీస్లు ఆడటం కొనసాగించాలి’ అని అబ్దుల్ రజాక్ పేర్కొన్నాడు. 2016లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ చివరిసారిగా భారత్కు వచ్చింది. భారత్ చివరిసారిగా 2008లో ఆసియా కప్ కోసం పాకిస్థాన్కు వెళ్ళింది. రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచ్లు జరగడం లేదు.
Also Read: OPPO Reno 10 Series Launch: నేడే ఒప్పో రెనో 10 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ డీటెయిల్స్ ఇవే!
తాజావార్తలు
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
-
Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
-
Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
-
FILM FOCUS : బాలీవుడ్ కు మంచి రోజులొచ్చాయా ?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!