IND vs PAK Final: విజేతకు ట్రోఫీ అందిస్తా.. పీసీబీ చీఫ్ అత్యుత్సాహంపై బీసీసీఐ రియాక్షన్ ఏంటో?
- ఆసియా కప్ 2025 ఫైనల్లో తలపడనున్న భారత్, పాకిస్థాన్
- ఫైనల్కు పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ
- ఏసీసీ అధ్యక్షుడి హోదాలో ఫైనల్కు మొహ్సిన్ నఖ్వీ
- నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు బీసీసీఐ ఒప్పుకుంటుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్, పాకిస్థాన్ టీమ్స్ తలపడనున్నాయి. ఆదివారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఫైనల్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ హాజరు కానున్నాడు. ఏసీసీ అధ్యక్షుడి హోదాలో ఆసియా కప్ 2025 ఫైనల్కు రానున్నాడు. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ పట్ల ఆయన తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. విజేతకు తన చేతుల మీదుగా ట్రోఫీ అందిస్తా అని చెప్పాడు.
‘ఈ సంవత్సరం క్రికెట్ నైపుణ్యం, ప్రతిభకు అద్భుతమైన ప్రదర్శనగా ఆసియా కప్ నిలిచింది. అభిమానుల అభిరుచి, ఆసియా జట్ల పోటీ స్ఫూర్తి, మైదానంలో అద్భుతమైన ప్రదర్శనలు చిరస్మరణీయంగా మార్చాయి. ఆసియా ఖండం అంతటా క్రికెట్కు పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శననే రికార్డు స్థాయి వ్యూస్. ఫైనల్ను చూడటానికి నేను ఉత్సాహంగా ఉన్నాను. గెలిచిన జట్టుకు ట్రోఫీని అందించడానికి ఎదురు చూస్తున్నాను’ అని మోహ్సిన్ నఖ్వీ ఒక ప్రకటనలో తెలిపాడు. మ్యాచ్ తర్వాత జరిగే ట్రోఫీ వేడుకలో మోహ్సిన్ నఖ్వీ హాజరు కావడం పట్ల బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
- Putin-Ajit Doval: పుతిన్కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
Also Read: IND vs PAK Final: పాకిస్థాన్తో ఫైనల్ మ్యాచ్.. అభిషేక్ శర్మ సెంచరీ పక్కా!
బోర్డు అధిపతులు క్రికెట్ మ్యాచ్కు హాజరుకావడం సర్వసాధారణమే. ఏసీసీ చీఫ్గా ఉన్న మొహ్సిన్ నఖ్వీ ఫైనల్ తర్వాత విజేతకు ట్రోఫీ అందిస్తాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధిపతిగా ఆయనకు ట్రోఫీని ప్రదానం చేయడానికి, సాంప్రదాయకంగా రెండు జట్లతో కరచాలనం చేయడానికి పూర్తి అధికారం ఉంటుంది. పాకిస్తాన్తో ‘నో హ్యాండ్షేక్’ విధానాన్ని అనుసరిస్తున్న బీసీసీఐ.. భారత ఆటగాళ్లకు మొహ్సిన్ నఖ్వీతో మాట్లాడటానికి అనుమతించే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ భారత్ విజేతగా నిలిస్తే.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు బీసీసీఐ ఒప్పుకుంటుందా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. చూడాలి మరి పీసీబీ చీఫ్ అత్యుత్సాహంపై బీసీసీఐ రియాక్షన్ ఎలా ఉంటుందో. ఆసియా కప్ చరిత్రలో పాకిస్తాన్, భారత్ టీమ్స్ ఫైనల్లో తలపడటం ఇదే మొదటిసారి.
తాజావార్తలు
-
19th BRICS Summit in China: 19వ BRICS సమ్మిట్ చైనాలో.. అధ్యక్షుడు జిన్పింగ్ ప్రకటన
-
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!