IND vs NZ: నేడు తేలనున్న మూడో టెస్ట్ ఫలితం.. టీమిండియా విజయం బాట పడుతుందా?
- రెండో ఇన్నింగ్స్ చివర్లో ఉన్న న్యూజిలాండ్.
- నేడు తేలనున్న మూడో టెస్ట్ ఫలితం..
- టీమిండియా విజయం బాట పడుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs NZ 3rd Test: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ముంబై టెస్టు మ్యాచ్ ఫలితం మూడో రోజే తేలే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం 2 రోజుల ఆట మాత్రమే పూర్తి అవ్వగా, న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ముగింపు దశకు చేరుకుంది. దింతో మూడో రోజు ఆట ఇరు జట్లకు అత్యంత కీలకం కానుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 9 వికెట్లకు 171 పరుగులు చేసి 143 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతానికి ఆధిక్యం తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, ముంబైలోని వాంఖడే స్టేడియంలో నాల్గవ ఇన్నింగ్స్ గణాంకాలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఇది ఇప్పుడు టీమ్ ఇండియా అభిమానులకు పెద్ద టెన్షన్గా నిలుస్తోంది.
Read Also: Kedarnath Dham: నేటి నుంచి ఆరు నెలల పాటు కేదార్నాథ్ ఆలయం మూసివేత
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
మూడో రోజు ఆటలో, న్యూజిలాండ్ తన రెండో ఇన్నింగ్స్లో ఒక్కవికెట్ మాత్రమే ఉన్న గరిష్టంగా పరుగులు చేయాలనీ చూస్తోంది. అదే సమయంలో, న్యూజిలాండ్ ఇన్నింగ్స్ను వీలైనంత త్వరగా ముగించడానికి టీమిండియా ప్రయత్నం చేస్తుంది. రెండో రోజు ఆటలో పిచ్పై చాలా మలుపులతో కూడిన పరిస్థితి కనపడింది. కాబట్టి మూడో రోజు కూడా స్పిన్నర్లు మ్యాచ్పై ఆధిపత్యం చెలాయిస్తారు. కానీ, టీమిండియా టెన్షన్ విషయమేంటంటే.. ఇప్పటివరకు ఈ గడ్డపై నాలుగో ఇన్నింగ్స్లో 150కి పైగా పరుగుల లక్ష్యాన్ని ఒక్కసారి మాత్రమే ఛేదించడం విశేషం.
దక్షిణాఫ్రికా జట్టు వాంఖడే స్టేడియంలో అతిపెద్ద ఛేజింగ్ రికార్డు సృష్టించింది. 2000లో టీమిండియాపై దక్షిణాఫ్రికా ఈ ఘనత సాధించింది. అప్పుడు టీమిండియా కెప్టెన్ సచిన్ టెండూల్కర్. హాన్సీ క్రోంజే నాయకత్వంలో దక్షిణాఫ్రికా 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. అలాగే 1980లో ఇక్కడ టీమిండియాపై ఇంగ్లండ్ 98 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దింతో వాంఖడే స్టేడియంలో నాలుగో ఇన్నింగ్స్ టీమిండియాకు చాలా భారం కానుందని. మ్యాచ్ గెలవాలంటే భారత్ ఈ చరిత్రను ఎలాగైనా మార్చాల్సిందేనని స్పష్టం అవుతోంది. ఇకపోతే, ముంబైలోని వాంఖడే స్టేడియంలో గత 12 ఏళ్లలో భారత జట్టు ఏ టెస్టులోనూ ఓడిపోలేదు. ఈ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత టీమిండియాపై ఉంది. టీమిండియా చివరిసారిగా నవంబర్ 2012లో వాంఖడేలో ఇంగ్లండ్ చేతిలో ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లను ఈ గడ్డపై టెస్టుల్లో భారత్ ఓడించింది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!