IND vs NED: నెదర్లాండ్స్తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముందుగా పరుగుల వరద పారించి, డచ్ జట్టును ఒత్తిడిలోకి నెట్టాలనే వ్యూహంతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. లీగ్ దశలో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న భారత్, ఈ మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్లో భారత్ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూనే, రిజర్వ్ బెంచ్ను పరీక్షించే పనిలో పడినట్లు కనిపించింది.
ఈ మ్యాచ్కు ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు విశ్రాంతినిచ్చారు. అక్షర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి తీసుకొచ్చారు. అలాగే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కి రెస్ట్ ఇచ్చి, తన స్థానంలో పేసర్ అర్ష్దీప్ సింగ్ను తుది జట్టులోకి తీసుకున్నారు.
తుది జట్లు ఇవే:
భారత్: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.
నెదర్లాండ్స్: మైకెల్ లెవిట్, మాక్స్ ఓడౌడ్, బాస్ డి లీడె, కొలిన్ అకెర్మన్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), జాక్ లైయన్ కాచెట్, నోవ్ క్రోయిస్, రోలెఫ్ వాన్ డిర్ మెర్వ్, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, కైల్ క్లీన్.
పిచ్ అంచనాలు..
బ్యాటింగ్కు అనుకూలించే ఈ వికెట్పై తొలుత బ్యాటింగ్ చేయడం భారత్కు కలిసివచ్చే అంశంగా క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లు మరోసారి భారీ ఇన్నింగ్స్లు ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. డచ్ జట్టులో లోగాన్ వాన్ బీక్, వాన్ డిర్ మెర్వ్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు ఉన్నప్పటికీ.. భారత బ్యాటింగ్ లైనప్ను అడ్డుకోవడం వారికి సవాలే అని చెబుతున్నారు.
READ ALSO: Mammootty: అనారోగ్యంపై ఫస్ట్ టైం రియాక్ట్ అయిన అగ్రహీరో.. అసలు ఏమైందో తెలుసా!
