Virat Kohli: విరాట్ కోహ్లీ గురించి సెలక్టర్లు పట్టించుకోవడం లేదు.. జట్టును ప్రకటించకపోవడానికి కారణం ఆ ముగ్గురే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delay in BCCI announcing India Squad not because of Virat Kohli: ఇంగ్లండ్తో జరిగిన మొదటి రెండు టెస్టులకు మాత్రమే భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. మిగిలిన మూడు టెస్టుల కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. సెలక్షన్ కమిటీ గురువారం వర్చువల్గా సమావేశం అయినా.. జట్టును ప్రకటించలేదు. నేడు మూడు టెస్టుల కోసం జట్టును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. జట్టును ప్రకటించడంలో ఆలస్యానికి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అని వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ భారత జట్టును ప్రకటించకపోవడానికి కారణం విరాట్ కాదట.
ఇంగ్లండ్తో చివరి మూడు టెస్టులకు తాను అందుబాటులో ఉండేది లేనిది బీసీసీఐకి విరాట్ కోహ్లీ ఇప్పటివరకు చెప్పలేదట. విరాట్ సమాధానం కోసం బీసీసీఐ ఎదురుచూస్తోందని, అందుకే జట్టును ప్రకటించడంలో ఆలస్యం అవుతోందని వార్తలు వచ్చాయి. ఇందులో ఎలాంటి నిజం లేదని ఓ బీసీసీఐ అధికారి చెప్పినట్లు ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. ‘విరాట్ కోహ్లీ గురించి సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేదు. జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా కారణంగానే ఇంకా జట్టును ప్రకటించలేదు. మూడో టెస్టుకు ఇంకా వారం రోజుల సమయం ఉంది. అందుకే జట్టును ప్రకటించేందుకు సెలక్టర్లు హడావుడి చేయడం లేదు. మూడో టెస్టులో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ ఇండియా మేనేజ్మెంట్ భావించింది. అయితే రాజ్కోట్లో ఆడాలని సెలక్టర్లు చెబుతున్నారు’ అని సదరు బీసీసీఐ అధికారి తెలిపారు.
Also Read
Also Read: Mohammed Siraj: సోషల్ మీడియా సెన్సేషన్ ఓరీతో మహ్మద్ సిరాజ్.. ఐకానిక్ పోజ్ అదుర్స్!
లోకేష్ రాహుల్, రవీంద్ర జడేజాల ఫిట్నెస్ నివేదిక కోసం బీసీసీఐ ఎదురుచూస్తోందట. మొదటి టెస్టులో ఆడిన ఈ ఇద్దరు.. గాయాలతో రెండో టెస్టుకు దూరమయ్యారు. బెంగళూరులోని ఎన్సీఏలో రాహుల్, జడేజాలకు ఫిట్నెస్ పరీక్ష నిర్వహించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ రాహుల్, జడేజా, కోహ్లీ అందుబాటులో ఉంటే.. రజత్ పటిదార్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తుది జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Pawan Kalyan : పొదుపు చర్యలపై ప్రజలకు ఇబ్బంది కలగొద్దు..!
-
NTR Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డేకి ప్రశాంత్ నీల్ గిఫ్ట్ రెడీ.. ఇక రచ్చ రచ్చే!
-
West Bengal: కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీకి ఘోర అవమానం..
-
RCB: పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్నా.. ఆర్సీబీ కంటే ఆ జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు..
-
White House: చైనాలో ట్రంప్ టూర్.. హార్ముజ్ జలసంధిపై వైట్హౌస్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?