Virat Kohli: విరాట్ కోహ్లీ గురించి సెలక్టర్లు పట్టించుకోవడం లేదు.. జట్టును ప్రకటించకపోవడానికి కారణం ఆ ముగ్గురే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delay in BCCI announcing India Squad not because of Virat Kohli: ఇంగ్లండ్తో జరిగిన మొదటి రెండు టెస్టులకు మాత్రమే భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. మిగిలిన మూడు టెస్టుల కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. సెలక్షన్ కమిటీ గురువారం వర్చువల్గా సమావేశం అయినా.. జట్టును ప్రకటించలేదు. నేడు మూడు టెస్టుల కోసం జట్టును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. జట్టును ప్రకటించడంలో ఆలస్యానికి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అని వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ భారత జట్టును ప్రకటించకపోవడానికి కారణం విరాట్ కాదట.
ఇంగ్లండ్తో చివరి మూడు టెస్టులకు తాను అందుబాటులో ఉండేది లేనిది బీసీసీఐకి విరాట్ కోహ్లీ ఇప్పటివరకు చెప్పలేదట. విరాట్ సమాధానం కోసం బీసీసీఐ ఎదురుచూస్తోందని, అందుకే జట్టును ప్రకటించడంలో ఆలస్యం అవుతోందని వార్తలు వచ్చాయి. ఇందులో ఎలాంటి నిజం లేదని ఓ బీసీసీఐ అధికారి చెప్పినట్లు ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. ‘విరాట్ కోహ్లీ గురించి సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేదు. జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా కారణంగానే ఇంకా జట్టును ప్రకటించలేదు. మూడో టెస్టుకు ఇంకా వారం రోజుల సమయం ఉంది. అందుకే జట్టును ప్రకటించేందుకు సెలక్టర్లు హడావుడి చేయడం లేదు. మూడో టెస్టులో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ ఇండియా మేనేజ్మెంట్ భావించింది. అయితే రాజ్కోట్లో ఆడాలని సెలక్టర్లు చెబుతున్నారు’ అని సదరు బీసీసీఐ అధికారి తెలిపారు.
Also Read
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
- India-Iran Trade: ఇరాన్తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
- Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
Also Read: Mohammed Siraj: సోషల్ మీడియా సెన్సేషన్ ఓరీతో మహ్మద్ సిరాజ్.. ఐకానిక్ పోజ్ అదుర్స్!
లోకేష్ రాహుల్, రవీంద్ర జడేజాల ఫిట్నెస్ నివేదిక కోసం బీసీసీఐ ఎదురుచూస్తోందట. మొదటి టెస్టులో ఆడిన ఈ ఇద్దరు.. గాయాలతో రెండో టెస్టుకు దూరమయ్యారు. బెంగళూరులోని ఎన్సీఏలో రాహుల్, జడేజాలకు ఫిట్నెస్ పరీక్ష నిర్వహించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ రాహుల్, జడేజా, కోహ్లీ అందుబాటులో ఉంటే.. రజత్ పటిదార్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తుది జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
-
Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
-
India-Iran Trade: ఇరాన్తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
-
Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
-
Explainer: టార్గెట్ ఇండియా? పాక్కు బాంబులు పంపుతున్న టర్కీ!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!