Mohammed Siraj: సోషల్ మీడియా సెన్సేషన్ ఓరీతో మహ్మద్ సిరాజ్.. ఐకానిక్ పోజ్ అదుర్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Siraj photo with Orry Shakes Internet: ఇటీవలి రోజుల్లో బాలీవుడ్ సెలెబ్రిటీలతో ఓ వ్యక్తి ఎక్కువగా కనిపిస్తున్నాడు. స్టార్ హీరో, హీరోయిన్లను పట్టుకుని ఫొటోలకు పోజులిస్తున్నాడు. అతడితో ఫొటోలు దిగేందుకు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అతడే ‘ఓర్హాన్ అవత్రమణి అకా ఓరీ’. ఇన్స్టాగ్రామ్లో ఓరీకి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా సంచలనం ఓరీ షేర్ చేసిన ఫొటోస్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఆ ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. తాజాగా టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్తో ఓరీ ఫొటోలు దిగాడు.
ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగుతోన్న విషయం తెలిసిందే. విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు ఫిబ్రవరి 5న ముగియగా.. 15 నుంచి రాజ్కోట్లో మూడో టెస్టు ఆరంభం కానుంది. మూడో టెస్టుకు 10 రోజుల సమయం దొరకడంతో భారత ఆటగాళ్లు సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ముంబైలో కనిపించాడు. బుధవారం రాత్రి ముంబైలోని బాంద్రాలో సిరాజ్ కనిపించాడు. సిరాజ్ ఓ ఈవెంట్కు వెళ్లగా.. అక్కడ సోషల్ మీడియా సంచలనం ఓరీని కలిశాడు. సిరాజ్తో ఓరీ తన ఐకానిక్ పోజ్ పెట్టి ఫొటోలు దిగాడు. ఈ ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. ఇవి చాలా మంది అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.
Also Read
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
Also Read: Virat Kohli: నేను చెప్పిందంతా అబద్ధం.. విరాట్ విషయంలో డివిలియర్స్ యూటర్న్!
ఇంగ్లండ్తో జరిగిన మొదటి టెస్టులో హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ పెద్దగా ఆకట్టుకోలేదు. సొంత మైదానం అయిన ఉప్పల్ స్టేడియంలో సిరాజ్ బంతితో ఆకట్టుకోలేదు. అందులోనూ టీమిండియా ఓడిపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టు తుది జట్టులో అతడు చోటు దక్కించుకోలేకపోయాడు. విశ్రాంతి ఇచ్చామని కెప్టెన్ రోహిత్ చెప్పాడు. ఇక మూడో టెస్టులో జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్న నేపథ్యంలో సిరాజ్ ఆడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 11న మూడో టెస్టు కోసం భారత ప్లేయర్స్ రాజ్కోట్లో కలవనున్నారు.
Mohammed Siraj with Orry. pic.twitter.com/141Yxt7Z3L
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 8, 2024
తాజావార్తలు
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
-
StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!