IND vs ENG 4th Test: విజయానికి 152 పరుగులే.. భారత్కు అంత ఈజీ కాదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranchi Test Pitch Report Today: రాంచీలోని జేఎస్సీఏ అంతర్జాతీయ స్టేడియంలో ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకెళుతోంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో మూడో రోజు ఆట ముగిసేసమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజ్లో రోహిత్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (16) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 152 పరుగులు మాత్రమే అవసరం. అయితే అది భారత్కు అంత ఈజీ కాకపోవచ్చు.
రాంచీ పిచ్ నాలుగో రోజు మరింతగా స్పిన్కు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. స్పిన్నర్లకు తగినట్లుగా ఈ పిచ్ మారుతుంది. కాబట్టి ఇంగ్లండ్ స్పిన్నర్లు టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జో రూట్ చెలరేగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తేనే విజయం సాధ్యమవుతుంది. భారత్ మొదటి ఇన్నింగ్స్లో బషీర్ 5, హార్ట్లీ 3 వికెట్స్ పడగొట్టారు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో ఆర్ అశ్విన్ 5, కుల్దీప్ యాదవ్ 4 వికెట్స్ పడగొట్టిన విషయం తెలిసిందే.
Also Read
- WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
- SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
Also Read: R Ashwin: అనిల్ కుంబ్లే రికార్డును సమం చేసిన ఆర్ అశ్విన్!
మూడో రోజు భారత్ను 307 పరుగులకు ఆలౌట్ చేసిన ఇంగ్లండ్.. 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. భారత స్పిన్నర్ల ధాటికి 145 పరుగులకే ఆలౌట్ అయింది. అశ్విన్, కుల్దీప్ స్పిన్ మాయాజాలంతో ఇంగ్లీష్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. బెన్ డకెట్ (15), ఓలీ పోప్ (0), జో రూట్ (11), బెన్ స్టోక్స్ (4) మళ్లీ నిరాశపరిచారు. జాక్ క్రాలే (60), జానీ బెయిర్స్టో (30)లు టాప్ స్కోరర్లు. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ మూడో రోజు ఆట ముగిసేసరికి 40/0తో ఉంది.
తాజావార్తలు
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
ట్రెండింగ్
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!