IND vs ENG: బుమ్రాకు కాస్త మద్దతు ఇయ్యండయ్యా!
- మొదటి టెస్టులో భారత్ ఓటమి
- బయటపడిన భారత బౌలింగ్ బలహీనత
- పరుగులు ఇవ్వడం భారత్ ఓటమికి కారణం
- బుమ్రాకు మద్దతు అవసరం
లీడ్స్ ఇంగ్లండ్తో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. మరోసారి భారత బౌలింగ్ బలహీనత బయటపడింది. తొలి ఇన్నింగ్స్లో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్స్ తీసినా.. రెండో ఇన్నింగ్స్లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. మొహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు పరుగులు ఇవ్వడం భారత్ ఓటమికి కారణమైంది. టీమిండియా బౌలర్ల వైఫల్యంతో 370కి పైగా టార్గెట్ను ఛేదించింది. ఈ నేపథ్యంలో భారత్ బౌలింగ్ యూనిట్పై సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అసహనం వ్యక్తం చేశాడు. బుమ్రాకు మిగతా బౌలర్లు కాస్త మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
Also Read: Prashant Kishor: హీటెక్కుతున్న బీహార్ పాలిటిక్స్.. రాహుల్గాంధీకి సవాల్ విసిరిన ప్రశాంత్ కిషోర్
Also Read
‘మొదటి టెస్టులో భారత్ ఓటమిని ఎదుర్కోవాల్సింది కాదు. టీమిండియా బౌలర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. బుమ్రా నుంచి మిగతా బౌలర్లు నేర్చుకోవాలి. అతడితో మాట్లాడి.. ఎలా బౌలింగ్ చేయాలనేది ప్రణాళిక వేసుకోవాలి. బుమ్రాకు మద్దతుగా నిలిస్తేనే.. మనం సులువుగా విజయం సాధించగలం. నేను మొదటి టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నా. బౌలింగ్ విభాగం సత్తా చాటాలి. శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ రెండో ఇన్నింగ్స్లో వికెట్లు తీశారు. శార్దూల్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు తీసినా.. అప్పటికే భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్ వెళ్ళిపోయింది. కొత్త బంతితో వికెట్లు తీయడం ఎప్పుడూ ముఖ్యం. తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించడానికి కారణం భారత బౌలర్లు పరుగులు ఇవ్వడమే. మన బౌలింగ్ విభాగం బలంగా మారడానికి ఏం చేయాలనే మార్గాలను వెతకాలి’ అని మహ్మద్ షమీ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో