IND vs ENG 1st ODI: తొలి వన్డేలో భారత్ ఘన విజయం..
- తొలి వన్డేలో భారత్ ఘన విజయం..
- 4 వికెట్ల తేడాతో గెలుపు
- హాఫ్ సెంచరీలతో రాణించిన గిల్ (87), శ్రేయాస్ అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52)
- 1-0 ఆధిక్యంలో భారత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగ్పూర్లో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో టీమిండియా ఇంగ్లాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత జట్టు 248 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బౌలింగ్లో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా అదరగొట్టారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు.
Read Also: Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల్లో ముస్లింలు బీజేపీకి ఓటు వేశారా?
Also Read
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- Kerala CM: కేరళ కాంగ్రెస్లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..
- Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
- PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..
249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్కు మంచి ఆరంభం లభించలేదు. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ వరుసగా 19 పరుగుల వద్ద పెవిలియన్కు వెళ్లిపోయారు. అయితే.. శ్రేయాస్ అయ్యర్ (36 బంతుల్లో 59), శుభ్మన్ గిల్ (87) మధ్య 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇండియా జట్టుకు విజయపు దిశగా తీసుకెళ్లారు. మిడిలార్డర్లో అక్షర్ పటేల్ 52 పరుగులు చేశాడు. దీంతో.. 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో చేధించి టీమిండియా విజయం సాధించింది.
Read Also: Delhi Elections: కల్కాజీలో ముఖ్యమంత్రి అతిషి గెలుస్తారా? లేదా? అంచనాలు ఇవే!
అంతకుముందు ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రారంభంలో మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఓపెనర్లు 70కి పైగా పరుగులు సాధించినప్పటికీ, తొలి వికెట్ పడగానే వికెట్ల పతనం ప్రారంభమైంది. మొదటి వికెట్ 75 పరుగుల వద్ద పడింది. ఆ తరువాత 77 వద్ద మూడు వికెట్లు పడిపోయాయి. దీంతో ఇంగ్లాండ్ 248 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (52), జాకబ్ బెథెల్ (51), ఫిల్ సాల్ట్ (43), బెన్ డకెట్ (32) పరుగులు చేశారు. భారత్ బౌలింగ్లో హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా తలో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ తలో ఒక్కొక్క వికెట్ సంపాదించారు. కాగా.. ఈ విజయంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. రెండవ వన్డే ఫిబ్రవరి 9న కటక్లో జరగనుంది.
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
-
Kerala CM: కేరళ కాంగ్రెస్లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..
-
Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్లో ఉగ్రదాడి!
-
CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
-
Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?