Virat Kohli-KL Rahul: జనాలు తిడుతారని విరాట్ కోహ్లీ అన్నాడు.. నేనే పట్టుబట్టా: కేఎల్ రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KL Rahul Says I encouraged Virat Kohli to hit Century in IND vs BAN Match: ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం పూణేలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత్ విజయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ (103 నాటౌట్; 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కీలక పాత్ర పోషించాడు. భారత్ విజయానికి రెండు పరుగులు అవసరం అయిన సమయంలో కోహ్లీ సిక్స్ బాది టీమిండియాకు విజయాన్ని అందించడంతో పాటు సెంచరీ మార్క్ కూడా అందుకున్నాడు. అయితే కోహ్లీ తాను సెంచరీ చేస్తానని ఊహించలేదు. శతకం చేసే అవకాశం ఉన్నా కోహ్లీ వద్దనుకున్నాడు. అయితే మరో బ్యాటర్ కేఎల్ రాహుల్ పట్టుబట్టడంతో చివరకు శతకాన్ని అందుకున్నాడు.
సింగిల్స్ తీయకుంటే వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడుతున్నానని జనాలు నన్ను తిడుతారని విరాట్ కోహ్లీ తనతో అన్నాడని మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ తెలిపాడు. ‘విరాట్ కోహ్లీ సింగిల్ తీసేందుకు ప్రయత్నిస్తే.. నేను వద్దని చెప్పా. సెంచరీ చెయ్ అని చెప్పా. అప్పుడు సింగిల్స్ తీయకుంటే బాగుండదని విరాట్ నాతో అన్నాడు. ఇది ప్రపంచకప్ అని గుర్తుచేశాడు. జట్టు కోసం కాకుండా.. వ్యక్తిగత మైలురాళ్ల కోసం కోహ్లీ ఆడుతున్నానని జనాలు భావిస్తారన్నాడు. మన విజయం ఖాయం అయింది, నువ్ సెంచరీ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదని కోహ్లీతో అన్నాను. ఎలాంటి ఆలోచనలు చేయకుండా సెంచరీ పూర్తి చేయమని చెప్పా. చివరకు సిక్స్ బాది శతకం చేశాడు’ అని తెలిపాడు.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
Also Read: Tiger Nageswara Rao Twitter Review:రఫ్ ఆడించిన మాస్ మహారాజ..టైగర్ నాగేశ్వరరావు టాక్ ఎలా ఉందంటే?
విరాట్ కోహ్లీ 74 పరుగులతో ఉన్నప్పుడు భారత జట్టు విజయానికి 27 పరుగులు అవసరం. ఆ తర్వాత లోకేష్ రాహుల్ ఒక్క బంతి మాత్రమే ఆడాడు. కోహ్లీకే సెంచరీ చేసే అవకాశం ఇచ్చాడు. సింగిల్స్ కోసం కోహ్లీ ప్రయత్నించినా.. రాహుల్ పరుగు కోసం వెళ్లలేదు. 41 ఓవర్లు ముగిసే సరికి విరాట్ 97 పరుగులతో ఉన్నాడు. జట్టు విజయానికి ఇంకా రెండు పరుగులు మాత్రమే కావాలి. 42వ ఓవర్ తొలి బంతి లెగ్సైడ్ వెళ్లడంతో.. అంపైర్ వైడ్ ఇస్తాడా? అని కోహ్లీ చూశాడు. కానీ అంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో కోహ్లీతో పాటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మూడో బంతికి సిక్సర్ బాది విరాట్ శతకం అందుకున్నాడు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!