Virat Kohli Century: ఒక్క సెంచరీ.. సచిన్, బ్రాడ్మన్ రికార్డులు బద్దలు!
- ఫామ్లోకి వచ్చిన విరాట్
- పలు రికార్డులపై కన్నేసిన కింగ్
- మరొక్క సెంచరీ చేస్తే
స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నిరాశపర్చిన విషయం తెలిసిందే. మూడు టెస్టుల్లో 93 పరుగులే చేసి విమర్శల పాలయ్యాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో విరాట్ ఫామ్లోకి వస్తాడని మాజీలు ధీమా వ్యక్తం చేశారు. అన్నట్టుగానే పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీ బాదేశాడు. కోహ్లీ శతకం బాధగానే ఫాన్స్ ఆనందంలో మునిగిపోయారు. విరాట్ కూడా స్టేడియంలో అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఫామ్లోకి వచ్చిన విరాట్ పలు రికార్డులపై కన్నేశాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో విరాట్ కోహ్లీ మరో సెంచరీ చేస్తే.. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, డాన్ బ్రాడ్మన్ రికార్డులను బ్రేక్ చేస్తాడు. మరో సెంచరీ సాధిస్తే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా విరాట్ రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం సచిన్తో కలిసి విరాట్ సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నాడు. సచిన్ 65 ఇన్నింగ్స్ల్లో తొమ్మిది సెంచరీలు చేయగా.. 44 ఇన్నింగ్స్లోనే విరాట్ 9 శతకాలు బాదాడు. మరొక్క సెంచరీ చేస్తే సచిన్ను అధిగమించి కింగ్ అవుతాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్ (8 సెంచరీలు, 51 ఇన్నింగ్స్లు), స్టీవ్ స్మిత్ (8 సెంచరీలు, 37 ఇన్నింగ్స్లు), మైకేల్ క్లార్క్ (7 సెంచరీలు, 40 ఇన్నింగ్స్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
Also Read: Champions Trophy 2025: భారత్కు రావొద్దు.. పాక్కు హర్భజన్ కౌంటర్!
విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే.. సర్ డాన్ బ్రాడ్మన్ పేరిట ఉన్న రికార్డు కూడా బ్రేక్ అవుతుంది. ఓ జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన పర్యాటక బ్యాటర్గా రికార్డు నెలకొల్పుతాడు. ఇంగ్లండ్పై బ్రాడ్మన్ 11 సెంచరీలు చేశాడు. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న విరాట్ ఆస్ట్రేలియాపై 10 శతకాలు చేశాడు. ఈ జాబితాలో జేబీ హాబ్స్ (9 సెంచరీలు-ఆస్ట్రేలియాపై), సచిన్ టెండూల్కర్ (9 సెంచరీలు-శ్రీలంక) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక రెండో టెస్టులో మరో 23 పరుగులు సాధిస్తే.. డే/నైట్ టెస్టుల్లో 300 పరుగుల మార్క్ను అందుకున్న తొలి భారత ఆటగాడిగా కింగ్ కోహ్లీ మరో ఘనత అందుకుంటాడు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!