Virat Kohli Century: ఒక్క సెంచరీ.. సచిన్, బ్రాడ్మన్ రికార్డులు బద్దలు!
- ఫామ్లోకి వచ్చిన విరాట్
- పలు రికార్డులపై కన్నేసిన కింగ్
- మరొక్క సెంచరీ చేస్తే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నిరాశపర్చిన విషయం తెలిసిందే. మూడు టెస్టుల్లో 93 పరుగులే చేసి విమర్శల పాలయ్యాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో విరాట్ ఫామ్లోకి వస్తాడని మాజీలు ధీమా వ్యక్తం చేశారు. అన్నట్టుగానే పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీ బాదేశాడు. కోహ్లీ శతకం బాధగానే ఫాన్స్ ఆనందంలో మునిగిపోయారు. విరాట్ కూడా స్టేడియంలో అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఫామ్లోకి వచ్చిన విరాట్ పలు రికార్డులపై కన్నేశాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో విరాట్ కోహ్లీ మరో సెంచరీ చేస్తే.. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, డాన్ బ్రాడ్మన్ రికార్డులను బ్రేక్ చేస్తాడు. మరో సెంచరీ సాధిస్తే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా విరాట్ రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం సచిన్తో కలిసి విరాట్ సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నాడు. సచిన్ 65 ఇన్నింగ్స్ల్లో తొమ్మిది సెంచరీలు చేయగా.. 44 ఇన్నింగ్స్లోనే విరాట్ 9 శతకాలు బాదాడు. మరొక్క సెంచరీ చేస్తే సచిన్ను అధిగమించి కింగ్ అవుతాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్ (8 సెంచరీలు, 51 ఇన్నింగ్స్లు), స్టీవ్ స్మిత్ (8 సెంచరీలు, 37 ఇన్నింగ్స్లు), మైకేల్ క్లార్క్ (7 సెంచరీలు, 40 ఇన్నింగ్స్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
Also Read: Champions Trophy 2025: భారత్కు రావొద్దు.. పాక్కు హర్భజన్ కౌంటర్!
విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే.. సర్ డాన్ బ్రాడ్మన్ పేరిట ఉన్న రికార్డు కూడా బ్రేక్ అవుతుంది. ఓ జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన పర్యాటక బ్యాటర్గా రికార్డు నెలకొల్పుతాడు. ఇంగ్లండ్పై బ్రాడ్మన్ 11 సెంచరీలు చేశాడు. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న విరాట్ ఆస్ట్రేలియాపై 10 శతకాలు చేశాడు. ఈ జాబితాలో జేబీ హాబ్స్ (9 సెంచరీలు-ఆస్ట్రేలియాపై), సచిన్ టెండూల్కర్ (9 సెంచరీలు-శ్రీలంక) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక రెండో టెస్టులో మరో 23 పరుగులు సాధిస్తే.. డే/నైట్ టెస్టుల్లో 300 పరుగుల మార్క్ను అందుకున్న తొలి భారత ఆటగాడిగా కింగ్ కోహ్లీ మరో ఘనత అందుకుంటాడు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?