DA Increase: ఆ రాష్ట్ర ఉద్యోగులకు పెరిగిన డీఏ.. 4 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం
DA Increase: ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్ (డిఎ)ని 5 శాతం పెంచింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఊరట లభించినట్లైంది. ఈ పెంపుతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ఇప్పుడు 33 నుంచి 38 శాతానికి పెరిగింది. అయితే ఇది ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డీఏ కంటే తక్కువగానే ఉంది. అంతకుముందు మార్చిలో కేంద్ర ప్రభుత్వం డీఏను 4 శాతం పెంచింది. ఇది జనవరి 2023 నుండి 42 శాతానికి చేరుకుంటుంది. 7వ వేతన సంఘం కింద సంవత్సరానికి రెండుసార్లు DA సవరించబడుతుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణం రేటును పరిగణనలోకి తీసుకుంటే కేంద్ర ఉద్యోగులకు మరో పెంపు జరుగుతుంది. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు త్వరలో సమావేశం కానున్నారు.
60 Snakes: అమ్మ బాబోయ్.. ఏందయ్యా ఇది.. ఆ ఇంట్లో అన్ని పాములు..
Also Read
- RCB Vs GT: ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లీ.. మరో రికార్డు బద్దలు కొట్టిన విరాట్..
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Jasprit Bumrah: బుమ్రా బౌలింగ్లో పస తగ్గిందా..? ఈ IPL లో విఫలం అవ్వడానికి కారణం ఇదే..
- Mojtaba Khamenei: "సముద్ర గర్భంలో పాతిపెడతాం".. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్..
అయితే ఛత్తీస్గఢ్లో డీఏ పెంపు నిర్ణయం పట్ల ఉద్యోగులు ఓ పక్క హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. మరోపక్క విమర్శలు చేస్తున్నారు. పెంపు నిర్ణయంపై పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి కాబట్టే డీఏ పెంచినట్లు చెబుతున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా డీఏ పెంపు జరిగింది. మధ్యప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ ఇప్పుడు 42 శాతానికి చేరుకుంది. అయితే ఛత్తీస్గఢ్లో డీఏ పెంపు నిర్ణయంతో దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. ఈ డీఏ పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై రూ.1000 కోట్ల అదనపు భారం పడనుంది.
తాజావార్తలు
-
TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
-
Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
-
Telangana Fuel Supply : తెలంగాణలో ఇంధన సంక్షోభానికి సర్కార్ చెక్
-
RCB Vs GT: ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లీ.. మరో రికార్డు బద్దలు కొట్టిన విరాట్..
-
Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!