ITR Logins: ఐటీఆర్ ఫైలర్ల సంఖ్యను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్న ఆర్థిక మంత్రి.. కారణం తెలిస్తే షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ITR Logins: 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయడానికి ఈసారి జూలై 31 చివరి తేదీ. చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఈ తేదీని పొడిగించాలని డిమాండ్ చేశారు. కానీ దానిని ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించింది. ప్రస్తుతం జూలై 31, 2023 వరకు.. మార్చి 31తో ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి సంబంధించి 6.50 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్లు (ITR) దాఖలు చేయబడ్డాయి. చివరి రోజైన జూలై 31న 40 లక్షలకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయి. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయడానికి జూలై 31 చివరి తేదీ.
నిన్న సాయంత్రం ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన సమాచారంలో.. సాయంత్రం 6 గంటల వరకు 1.78 కోట్ల ‘లాగిన్స్’ సక్సెస్ అయినట్లు సమాచారం. ఇప్పటి వరకు 6.50 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలయ్యాయని ఆ శాఖ ట్విట్టర్లో రాసింది. వీటిలో నేటి సాయంత్రం వరకు 36.91 లక్షల ఐటీఆర్లు దాఖలు కాగా.. గతేడాది జూలై 31 వరకు దాదాపు 5.83 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. ఐటీఆర్ ఫైల్ చేసిన వారి సంఖ్యను చూసి ఆర్థిక శాఖ సంతోషం వ్యక్తం చేసింది. ITR ఫైల్ చేయడంలో సహాయం చేయడానికి ఆదాయపు పన్ను శాఖ, హెల్ప్డెస్క్, వెబ్సైట్లో 24-గంటల సేవ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయకపోతే ఏం చేయాలన్న ప్రశ్న తలెత్తింది.
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
Read Also:Esha Gupta : ఘాటైనా అందాలతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..
పన్ను చెల్లింపుదారుడు ఇప్పటికీ రిటర్న్ను ఫైల్ చేయడంలో విఫలమైతే.. అతను పెనాల్టీ కాకుండా ఇతర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. పన్ను చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయడానికి పన్ను చెల్లింపుదారులకు ఇప్పటికీ అవకాశం ఉంది. కానీ రూ.5,000 ఆలస్య రుసుముతో అలాంటి అన్ని ఐటీఆర్లు 31 డిసెంబర్ 2023లోపు ఫైల్ చేయాలి. పన్ను చెల్లింపుదారుల మొత్తం ఆదాయం రూ. 5,00,000 మించకపోతే, జరిమానా రూ. 1,000కి తగ్గించబడుతుంది. ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే మొత్తం ఆదాయం తక్కువగా ఉన్న పన్ను చెల్లింపుదారుల కోసం.. వారు ఎలాంటి ఆలస్య రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు.
రిటర్న్ దాఖలు చేయడంలో ఆలస్యం జరిగితే.. ఆదాయపు పన్ను శాఖ పన్ను మొత్తంపై నెలకు 1 శాతం చొప్పున వడ్డీని వసూలు చేస్తుంది. ఒక రోజు ఆలస్యం అయితే ఒక నెల వడ్డీ వసూలు చేయబడుతుంది. నిబంధనలను మెరుగ్గా పాటించి పన్ను ఎగవేతలను అరికట్టేందుకు రెవెన్యూ శాఖ చేస్తున్న ప్రయత్నాల విజయానికి ఐటీఆర్ ఫైలర్ల సంఖ్య పెరగడం అద్దం పడుతుందని పన్ను నిపుణులు పేర్కొన్నారు.
Read Also:Malavika Mohnan: 500 కోట్లు అయినా సరే.. అందుకు మాత్రం చచ్చినా ఒప్పుకోను
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!