ITR Logins: ఐటీఆర్ ఫైలర్ల సంఖ్యను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్న ఆర్థిక మంత్రి.. కారణం తెలిస్తే షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ITR Logins: 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయడానికి ఈసారి జూలై 31 చివరి తేదీ. చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఈ తేదీని పొడిగించాలని డిమాండ్ చేశారు. కానీ దానిని ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించింది. ప్రస్తుతం జూలై 31, 2023 వరకు.. మార్చి 31తో ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి సంబంధించి 6.50 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్లు (ITR) దాఖలు చేయబడ్డాయి. చివరి రోజైన జూలై 31న 40 లక్షలకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయి. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయడానికి జూలై 31 చివరి తేదీ.
నిన్న సాయంత్రం ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన సమాచారంలో.. సాయంత్రం 6 గంటల వరకు 1.78 కోట్ల ‘లాగిన్స్’ సక్సెస్ అయినట్లు సమాచారం. ఇప్పటి వరకు 6.50 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలయ్యాయని ఆ శాఖ ట్విట్టర్లో రాసింది. వీటిలో నేటి సాయంత్రం వరకు 36.91 లక్షల ఐటీఆర్లు దాఖలు కాగా.. గతేడాది జూలై 31 వరకు దాదాపు 5.83 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. ఐటీఆర్ ఫైల్ చేసిన వారి సంఖ్యను చూసి ఆర్థిక శాఖ సంతోషం వ్యక్తం చేసింది. ITR ఫైల్ చేయడంలో సహాయం చేయడానికి ఆదాయపు పన్ను శాఖ, హెల్ప్డెస్క్, వెబ్సైట్లో 24-గంటల సేవ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయకపోతే ఏం చేయాలన్న ప్రశ్న తలెత్తింది.
Also Read
Read Also:Esha Gupta : ఘాటైనా అందాలతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..
పన్ను చెల్లింపుదారుడు ఇప్పటికీ రిటర్న్ను ఫైల్ చేయడంలో విఫలమైతే.. అతను పెనాల్టీ కాకుండా ఇతర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. పన్ను చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయడానికి పన్ను చెల్లింపుదారులకు ఇప్పటికీ అవకాశం ఉంది. కానీ రూ.5,000 ఆలస్య రుసుముతో అలాంటి అన్ని ఐటీఆర్లు 31 డిసెంబర్ 2023లోపు ఫైల్ చేయాలి. పన్ను చెల్లింపుదారుల మొత్తం ఆదాయం రూ. 5,00,000 మించకపోతే, జరిమానా రూ. 1,000కి తగ్గించబడుతుంది. ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే మొత్తం ఆదాయం తక్కువగా ఉన్న పన్ను చెల్లింపుదారుల కోసం.. వారు ఎలాంటి ఆలస్య రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు.
రిటర్న్ దాఖలు చేయడంలో ఆలస్యం జరిగితే.. ఆదాయపు పన్ను శాఖ పన్ను మొత్తంపై నెలకు 1 శాతం చొప్పున వడ్డీని వసూలు చేస్తుంది. ఒక రోజు ఆలస్యం అయితే ఒక నెల వడ్డీ వసూలు చేయబడుతుంది. నిబంధనలను మెరుగ్గా పాటించి పన్ను ఎగవేతలను అరికట్టేందుకు రెవెన్యూ శాఖ చేస్తున్న ప్రయత్నాల విజయానికి ఐటీఆర్ ఫైలర్ల సంఖ్య పెరగడం అద్దం పడుతుందని పన్ను నిపుణులు పేర్కొన్నారు.
Read Also:Malavika Mohnan: 500 కోట్లు అయినా సరే.. అందుకు మాత్రం చచ్చినా ఒప్పుకోను
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!