Income Tax Notice: లక్ష మందికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు.. కారణం ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Income Tax Notice: లక్ష మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం తెలియజేశారు. ఐటీఆర్ దాఖలు చేయకపోవడం, తప్పుడు ఆదాయ సమాచారం ఇవ్వడం వల్ల ఈ నోటీసు జారీ చేయబడింది. 50 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులకు ఈ నోటీసులు పంపినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బకాయి ఉన్న పన్నులన్నీ క్లియర్ అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నోటీసుల పరిష్కారానికి ఐటీ శాఖ శరవేగంగా కసరత్తు చేస్తోందని ఆమె తెలిపారు. గత కొన్నేళ్లుగా ఆదాయపు పన్ను రేట్లు పెరగనప్పటికీ, ఆదాయపు పన్ను వసూళ్లను మాత్రం కచ్చితంగా పెంచామని చెప్పారు. దేశ ఆదాయపు పన్ను దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ మొత్తం రెండు కేటగిరీల నోటీసులు పంపడం గమనార్హం. మొదటిది దాచిన ఆదాయం, తక్కువ పన్ను చెల్లించిన వ్యక్తులు…. రెండవది పన్ను పరిధిలోకి వచ్చినా బాధ్యతగా ITR దాఖలు చేయని వ్యక్తులు. ఏటా 50 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారివే ఎక్కువ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులన్నీ 4 నుండి 6 సంవత్సరాల వరకు ఉండవచ్చు.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
Read Also:Malakpet MMTS: రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఎదురెదురు.. తరువాత ఏం జరిగిందంటే..!
ఆదాయపు పన్ను దినోత్సవం సందర్భంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) చైర్మన్ మాట్లాడుతూ.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, ఇప్పటివరకు మొత్తం 4 కోట్ల మందికి పైగా పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేశారని చెప్పారు. ఇందులో సగం ప్రాసెస్ కూడా అయింది. 2022-23 ఆర్థిక సంవత్సరం, 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేసే తేదీ దగ్గర పడుతుండటం గమనించదగ్గ విషయం. సమయానికి ITR ఫైల్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ పదేపదే ప్రజలకు సలహా ఇస్తోంది. అలా చేయని పక్షంలో రూ.5 లక్షలకు పైబడి ఆదాయం ఉన్నవారు రూ.5వేలు, రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారు రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జరిమానా లేకుండా పన్ను డిపాజిట్ చేయడానికి జూలై 31 ఆఖరు తేది.
Read Also:Fracture Fixation: ఫ్రాక్చర్ ఫిక్సేషన్లో నూతన పద్ధతులు.. హైదరాబాద్లో వర్క్షాప్
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!