Tamilnadu: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు.. బీజేపీతో ఏఏంఏంకే పార్టీ దోస్తీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కూటమికి ఎలాంటి నిబంధనలు లేకుండా తాము బేషరతుగా మద్దతు ఇవ్వనున్నట్లు అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తెలియచేసారు. ఇందుకు సంబంధించి అర్ధరాత్రి వేళ తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించి తిరుచ్చిలో మంగళవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాము బీజేపీ కూటమిలో చేరే విషయమై గడిచిన రెండు, మూడు నెలలుగా చర్చలు జరుగుతున్నాయని టీటీవీ దినకరన్ తెలిపారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయానికి తమ పార్టీ కార్యకర్తలు అవిశ్రాంతంగా శ్రమిస్తారని దినకరన్ చెప్పుకొచ్చారు.
Read Also: Ram Charan: రామ్ చరణ్ సరసన మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్!
Also Read
ఇందులో భాగంగా బీజేపీ పార్టీతో పొత్తుకు ఏఏంఏంకే పార్టీ అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన తెలిపారు. తాజాగా టిటివీ దినకరన్ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతో భేటి అయ్యారు. ఇందులో భాగంగా వచ్చే లోక్ సభ ఎన్నికలలో కలసి పోటి చేయడానికి రెండు పార్టీ పరస్పర అంగీకారం తెలిపాయి. ఈ సందర్బంగా చిన్నమ్మ శశికళ సూచనతో బీజేపీ పార్టీతో కలసి నడవడానికి అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఒకవైపు పరిస్థితి ఇలా ఉండగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సేల్వంతో బీజేపీ పార్టీ చర్చలు జరుపుతుంది. దింతో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అర్ధం అవ్వడం లేదు.
తాజావార్తలు
-
TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
-
Sunil Narang: ‘ఏకాభిప్రాయం లేదు.. ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి’ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ గుడ్ బై!
-
Likhitha Reddy: ప్రశాంత్ నీల్ భార్య కూడా ఎన్టీఆర్ ఫ్యానేనా? థియేటర్ లో ఆ రచ్చ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!