Rajayasabha: తొలిసారిగా రాజ్యసభలో ఎన్డీఏకు మెజారిటీ స్థానాలు..
- నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అభిమానులకు గుడ్ న్యూస్.
- ఉప ఎన్నికల నేపథ్యంలో రాజ్యసభలో ఎన్డీయే కూటమికి మెజారిటీ మార్క్
- ఎగువ సభలో ఏవైనా బిల్లులను ఆమోదం పొందేందుకు ఎన్డీయే ప్రభుత్వానికి మార్గం మరింత సుగమం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajayasabha: నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అభిమానులకు గుడ్ న్యూస్. తాజాగా జరిగిన ఉప ఎన్నికల నేపథ్యంలో రాజ్యసభలో ఎన్డీయే కూటమికి మెజారిటీ మార్క్ లభించింది. ఈ మెజారితో పార్లమెంటు ఎగువ సభలో ఏవైనా బిల్లులను ఆమోదం పొందేందుకు ఎన్డీయే ప్రభుత్వానికి మార్గం మరింత సుగమం కానుంది. ఇకపోతే, ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో 12 రాజ్యసభ స్థానాలకు జరిగిన పోటీలో అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక ఈ 12 స్థానాలకు గాను కేవలం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అభ్యర్థులే 11 స్థానాల్లో విజయం సాధించారు. ఒక్క స్థానంలో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ లెక్కలతో ఎగువసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మెజారిటీ స్థానాల మార్కును అధిగమించింది. ఇకపోతే ఎన్డీయేకు రాజ్యసభలో మెజారిటీ రావడం చరిత్రలో ఇదే మొదటిసారి.
ఇకపోతే రాజ్యసభలో కొత్తగా చేరిన 12 మంది సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి..
Also Read
బీజేపీ అభ్యర్థులు:
* అస్సాం నుంచి మిషన్ రంజన్ దాస్, రామేశ్వర్ తేలీ.
* బీహార్ నుంచి మనన్ కుమార్ మిశ్రా.
* హర్యానా నుంచి కిరణ్ చౌదరి.
* మధ్యప్రదేశ్ నుంచి జార్జ్ కురియన్.
* మహారాష్ట్ర నుంచి ధైర్యషీల్ పాటిల్.
* ఒడిశా నుంచి మమతా మొహంతా.
* రాజస్థాన్ నుంచి రవ్నీత్ సింగ్ బిట్టు.
* త్రిపుర నుంచి రాజీవ్ భట్టాచార్జీ.
* మహారాష్ట్ర నుంచి బీజేపీ మిత్రపక్షాల నితిన్ పాటిల్,
* బీహార్ నుంచి ఉపేంద్ర కుష్వాహ విజయం సాధించారు.
* తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ విజయం సాధించారు.
తాజావార్తలు
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!