Leopard: చిరుతను చంపి.. వండుకుని తిన్నారు.. ఎక్కడంటే?
- ఒడిశాలో దారుణ ఘటన
- చిరుతపులిని వేటాడిన షాకింగ్ కేసు
- అడవి పందుల వలలో చిక్కిన చిరుత
- దాన్ని చంపి వండుకుని తిన్న వేటగాళ్లు
- ఇద్దరిని అరెస్ట్ చేసిన అటవీ శాఖ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాలోని నువాపాడా జిల్లాలో చిరుతపులిని వేటాడిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ వేటగాళ్ళు చిరుతపులిని చంపి, దాని చర్మం తీసి, దాని మాంసాన్ని వండుకుని తిన్నారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన నువాపా జిల్లా దేవ్ధార గ్రామ సమీపంలో జరిగింది.
READ MORE: Side Effects of Over Sitting: ఎక్కువ సేపు కూర్చుంటున్నారా? .. ఎంత ప్రమాదమంటే?
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
అటవీశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. పుస్తం చిందా(58), హృషికేష్ చిందా(40)లు ఈనెల 16న అడవి పందులను పట్టుకునేందుకు అడవిలో ఉచ్చు వేశారు. దురదృష్టవశాత్తు, ఒక చిరుతపులి ఆ వలలో చిక్కుకుంది. చిరుతపులిని చంపి చర్మం ఒలిచి మాంసాన్ని వండుకుని తిన్నారనేది ఆరోపణ. రహస్య సమాచారం ఆధారంగా.. అటవీ శాఖ బృందం వారి ఇళ్లపై దాడి చేసి చిరుతపులి చర్మం, తల, కొంత వండిన మాంసాన్ని సంఘటన స్థలం నుంచి స్వాధీనం చేసుకుంది. ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేశారు. అయితే మరో ఇద్దరు సహచరులు పరారీ అయ్యారు.
READ MORE: Koti Deepotsavam 2024 Day 12: ఘనంగా వరంగల్ శ్రీ భద్రకాళి భద్రేశ్వర ఆది దంపతుల కల్యాణోత్సవం
ఈ ఘటనపై ఖరియార్ టెరిటోరియల్ డివిజన్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ACF), MD ముస్తఫా సలేహా మాట్లాడుతూ.. “ఈ కేసు వన్యప్రాణుల సంరక్షణకు వ్యతిరేకంగా జరిగిన తీవ్రమైన నేరాన్ని సూచిస్తుంది. క్రూర జంతువుల జాబితాలో ఉన్న చిరుతను చంపి తినడం గతంలో ఎన్నడూ చూడలేదు. అటవీ జంతువుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశాం. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. విచారణ పూర్తయిన తర్వాత నిందితులను కోర్టులో హాజరు పరుస్తాం.” అని తెలిపారు. కాగా.. వన్యప్రాణుల నేరాలపై ఎలాంటి ఉపశమనమూ ఉండదని అటవీశాఖ హెచ్చరించింది. అలాగే, ఇలాంటి నేరాల గురించి వెంటనే డిపార్ట్మెంట్కు తెలియజేయాలని సాధారణ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ సంఘటన వన్యప్రాణుల సంరక్షణ పట్ల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేయడమే కాకుండా, పరిరక్షణ కోసం పరిపాలన, సమాజం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపింది.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!