Rents : ఆకాశాన్ని అంటిన ఇంటి అద్దెలు.. అవస్థలు పడుతున్న జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని ప్రధాన నగరాల్లో జనవరి-మార్చ్ త్రైమాసికంలో అద్దెలు భారీగానే పెరిగాయి. ఇండియా నంబర్-1 ప్రాపర్టీ సైట్ మ్యాజిక్ బ్రిక్స్ తాజా రిపోర్ట్ ప్రకారం.. హైదరాబాద్, నోయిడా, గురుగ్రామ్, ముంబై, బెంగళూరుల్లో అద్దెలు రికార్డు స్థాయిలో పెరిగాయని తెలిపింది. మార్కెట్లో నెలకొన్న డిమాండ్-సప్లై అంతరాల కారణంగా అద్దెల్లో స్థిరమైన పెరుగుదల ఇటీవల నెలల్లో నమోదైంది. ఐటీ హబ్ లు చెన్నై ( 14.3 శాతం ), బెంగళూరు ( 12.2శాతం ), హైదరాబాద్ ( 10.8 శాతం), పుణె ( 7.8 శాతం ) అద్దె డిమాండ్ లో అత్యధిక వృద్దిని నమోదు చేశాయి. ప్రస్తుతం ఇండియన్ రెంటల్ హౌసింగ్ మార్కెట్ మంచి పునరుద్దరణను ప్రదర్శిస్తోంది.
Also Read : Superstar Rajinikanth: బెజవాడకు సూపర్ స్టార్.. వేదిక పంచుకోనున్న చంద్రబాబు, రజనీ, బాలయ్య..
Also Read
హైదరాబాద్ లో చిన్న చిన్న కాలనీలుగా ఉన్న వాటి పేరు కూడా ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. నగరంలో ఐటీ కంపెనీలు కూడా బాగానే ఉన్నాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, వంటి ప్రాంతాల్లో బోలెడన్నీ ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇక ఉద్యోగ నిమిత్తం అక్కడ ఉండేవారు వేలల్లో ఉంటారు. దీంతో అక్కడ సాధారణంగానే.. రియల్ ఎస్టేట్ ఒక రేంజ్ లో ఉంటుందని ఊహించుకోవచ్చు. ఐటీ ఉద్యోగుల వేతతనాల ఆరంకెల్లో ఉంటుండటం..జీవన వ్యయాలు పెరిగిన నేపథ్యంలో.. ఇంటి అద్దెల కోసం కూడా ఎంతైన ఖర్చు పెడతారు. ఇక ఉద్యోగ అవకాశాలు వ్యాపారాలు బాగా నడుస్తున్న నగరాల్లో.. ఇళ్ల అద్దెలు భారీగా పెరుగుతున్నాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ అనరాక్ వెల్లడించింది.
Also Read : Akhil Akkineni : అక్కినేని ఇంటి పేరు నాకు వద్దు.. ఆ బరువు మోయాలేకపోతున్నా
అయితే హైదరాబాద్ లోని కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి సహా.. బెంగళూరులోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఏడాది వ్యవధిలోనే రెంట్లు భారీగా పెరిగాయని చెప్పుకొచ్చింది. హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగాలకు నెలవైన హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో చూస్తే గనుక.. కొండాపూర్ లో సంవత్సరం కాలంలో 12శాతం, గచ్చిబౌలిలో 11 శాతం చొప్పున ఇంటి అద్దెలు పెరిగినట్లు తెలిపింది. మరోవైపు బెంగళూరు ఉత్తర, తూర్పు ప్రాంతా్లో చూస్తే ఏడాది కాలవ్యవధిలోనే 1000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న డబుల్ బెడ్ రూం ఫ్లాట్ అద్దే ఏకంగా 24శాతం వరకు పెరిగిందని తాజా నివేదికలో వెల్లడైంది.
Also Read : Tulip Garden : తులిప్ గార్డెన్కు పర్యాటకుల తాకిడి
2022 మొదటి క్వార్టర్ లో ఇక్కడ అద్దె రూ. 21 వేలుగా ఉండగా.. తాజాగా అది రూ. 26 వేలకు పెరిగింది. ఇంకా మన దేశంలోని పలు మహా నగరాల్లో చూస్తే గనుక.. అద్దె భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. అందులో తొలి స్థానంలో బెంగళూరు నిలిచిందని చెప్పుకొవచ్చు. ఇక నివాస స్థిరాస్తులపై ప్రతిఫలం చూస్తే మాత్రం బెంగళూరులో 4.1 శాతం, ముంబయిలో 3.9 శాతం ఉన్నట్లు అనరాక్ సంస్థ వెల్లడించింది. అదే విధంగా చెన్నైలో ప్రాంతాన్న బట్టి అద్దె రేట్లలో పెద్దగా వ్యత్యాసం ఉంది. 10-16 శాతం వరకు పెరిగినట్లు ఉంది. ఇక ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో చూస్తే.. NCR ఏరియాలో 10-15 శాతం వరకు.. ముంబయిలో 14-17 శాతం వరకు, కోల్ కతాలో మాత్రం 10-13 శాతం వరకు అద్దెలు పెరిగాయి.
తాజావార్తలు
-
NTR Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డేకి ప్రశాంత్ నీల్ గిఫ్ట్ రెడీ.. ఇక రచ్చ రచ్చే!
-
West Bengal: కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీకి ఘోర అవమానం..
-
RCB: పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్నా.. ఆర్సీబీ కంటే ఆ జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు..
-
White House: చైనాలో ట్రంప్ టూర్.. హార్ముజ్ జలసంధిపై వైట్హౌస్ కీలక ప్రకటన
-
Health Tips : పార్టీ చేసుకున్న మరుసటి రోజే జిమ్కు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?