MadhyaPradesh : పెళ్లాం కాపురానికి రావట్లేదని బావను చంపిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MadhyaPradesh : మధ్యప్రదేశ్లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో బావను చంపిన ఘటన బద్వానీలో చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన భార్య కోపంతో పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను ఒప్పించి ఇంటికి తీసుకురావాలని భర్త చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ భార్య వినడానికి సిద్ధంగా లేదు. గత రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటోంది. తన బావే భార్యను రెచ్చగొడుతున్నాడని భర్త అనుమానించాడు. ఈ కారణంగా అతను మొదట తన బావతో గొడవపడి, తర్వాత చంపాడు. హత్యకు గురైన యువకుడి పేరు నీలేష్. నిందితుడైన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితుడి పేరు జగన్.
Read Also:Tamilnadu: బీర్ ట్రక్కు బోల్తా.. మందుకోసం మనిషిని వదిలేశారు
Also Read
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
బద్వానీ జిల్లా పతి గ్రామంలో యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో చనిపోయిన వ్యక్తి నీలేష్ అని తెలిసింది. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు తదుపరి విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే బావ, బామ్మర్ధులు ఇద్దరూ ఫాలియా గ్రామంలో ఓ పెళ్లికి వెళ్లారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో బావ నీలేష్ మద్యం మత్తులో ఉన్నాడు. దీంతో నిందితుడు జగన్ వాగు దగ్గరకు తీసుకెళ్లి హత్య చేశాడు. పోలీసుల విచారణలో జగన్ పై పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు జగన్ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు.
Read Also:DC vs GT: పోరాడి ఓడిన గుజరాత్.. ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం
డబ్బు విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో గత రెండు నెలలుగా జగన్ భార్య ఇంట్లోనే ఉంటోంది. పెళ్లి సమయంలో అబ్బాయి అమ్మాయి కుటుంబానికి డబ్బు ఇస్తాడు. నిందితుడి కుటుంబీకులు ఈ డబ్బును మహిళ కుటుంబానికి ఇవ్వలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతుండేవి. ఈ కోపంతో భార్య ఇంటికి వెళ్లిపోయింది. భార్యను తీసుకురావడానికి జగన్ చాలాసార్లు ప్రయత్నించినా ఆమె రాలేదు. దీంతో బావ నీలేష్ తన భార్యను రెచ్చగొడుతున్నాడని, అందుకే ఆమె రావడం లేదని జగన్ అనుమానించాడు.
తాజావార్తలు
-
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
-
Kitchen Hacks: ఫ్రిజ్లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్గా ఉంటుంది!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!