MadhyaPradesh : పెళ్లాం కాపురానికి రావట్లేదని బావను చంపిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MadhyaPradesh : మధ్యప్రదేశ్లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో బావను చంపిన ఘటన బద్వానీలో చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన భార్య కోపంతో పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను ఒప్పించి ఇంటికి తీసుకురావాలని భర్త చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ భార్య వినడానికి సిద్ధంగా లేదు. గత రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటోంది. తన బావే భార్యను రెచ్చగొడుతున్నాడని భర్త అనుమానించాడు. ఈ కారణంగా అతను మొదట తన బావతో గొడవపడి, తర్వాత చంపాడు. హత్యకు గురైన యువకుడి పేరు నీలేష్. నిందితుడైన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితుడి పేరు జగన్.
Read Also:Tamilnadu: బీర్ ట్రక్కు బోల్తా.. మందుకోసం మనిషిని వదిలేశారు
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
బద్వానీ జిల్లా పతి గ్రామంలో యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో చనిపోయిన వ్యక్తి నీలేష్ అని తెలిసింది. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు తదుపరి విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే బావ, బామ్మర్ధులు ఇద్దరూ ఫాలియా గ్రామంలో ఓ పెళ్లికి వెళ్లారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో బావ నీలేష్ మద్యం మత్తులో ఉన్నాడు. దీంతో నిందితుడు జగన్ వాగు దగ్గరకు తీసుకెళ్లి హత్య చేశాడు. పోలీసుల విచారణలో జగన్ పై పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు జగన్ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు.
Read Also:DC vs GT: పోరాడి ఓడిన గుజరాత్.. ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం
డబ్బు విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో గత రెండు నెలలుగా జగన్ భార్య ఇంట్లోనే ఉంటోంది. పెళ్లి సమయంలో అబ్బాయి అమ్మాయి కుటుంబానికి డబ్బు ఇస్తాడు. నిందితుడి కుటుంబీకులు ఈ డబ్బును మహిళ కుటుంబానికి ఇవ్వలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతుండేవి. ఈ కోపంతో భార్య ఇంటికి వెళ్లిపోయింది. భార్యను తీసుకురావడానికి జగన్ చాలాసార్లు ప్రయత్నించినా ఆమె రాలేదు. దీంతో బావ నీలేష్ తన భార్యను రెచ్చగొడుతున్నాడని, అందుకే ఆమె రావడం లేదని జగన్ అనుమానించాడు.
తాజావార్తలు
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్బ్యాగ్లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!