IND vs BAN U19 Final: ఫైనల్లో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. ఆసియాకప్ విజేతగా బంగ్లాదేశ్
- ఫైనల్లో బొక్కబోర్లా పడ్డ టీమిండియా..
- ఆసియాకప్ విజేతగా బంగ్లాదేశ్
- పూర్తి వివరాలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs BAN: ఆదివారం నాడు జరిగిన అండర్-19 ఆసియా కప్ 2024 టైటిల్ను బంగ్లాదేశ్ గెలుచుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో భారత్ను ఓడించి టైటిల్ను కాపాడుకుంది. 9వ ట్రోఫీని గెలుచుకోవాలన్న భారత్ కల నెరవేరలేకపోయింది. ఈ టోర్నీలో భారత్ అత్యంత విజయవంతమైన జట్టు. ఇప్పటికి ఎనిమిది సార్లు ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్లో భారత్ టాస్ గెలిచి బంగ్లాదేశ్ను ముందుగా బ్యాటింగ్కు పంపింది. బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 198 పరుగులు జోడించింది. బంగ్లాదేశ్ తరఫున మహ్మద్ రిజాన్ అత్యధికంగా 47 పరుగులు చేశాడు. మహ్మద్ శిబాబ్ 40 పరుగులు, మహ్మద్ ఫరీద్ 39 పరుగులు చేశారు. జవాద్ అబ్రార్ 20 పరుగులు, అజీజుల్ హకీమ్ తమీమ్ 16 పరుగులు చేశారు. హార్దిక్ రాజ్, చేతన్ శర్మ, యుధాజిత్ గుహా చెరో రెండు వికెట్లు తీశారు.
Also Read: ABC Juice: ABC జ్యూస్ గురించి తెలుసా మీకు? ఈ తాగితే ఎన్ని లాభాలో
Also Read
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
అయితే లక్ష్య ఛేదనలో మహ్మద్ అమన్ నేతృత్వంలోని భారత జట్టు 35.2 ఓవర్లలో కేవలం 139 పరుగులకు ఆలౌటైంది. భారత్ తరఫున కెప్టెన్ అమన్ అత్యధిక పరుగులు చేశాడు. 65 బంతుల్లో ఒక ఫోర్తో 26 పరుగులు చేసాడు. 199 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభం సరిగా లభించలేదు. ఓపెనర్లు ఆయుష్ మ్హత్రే (1), వైభవ్ సూర్యవంశీ (9) చౌకగా పెవిలియన్కు చేరుకున్నారు. దీని తర్వాత భారత్ వికెట్ల పతనం ఆగలేదు. దాంతో 73 పరుగుల వద్ద భారత జట్టులో సగం బ్యాట్స్మెన్స్ పెవిలియన్కు చేరుకున్నారు. లోయర్ ఆర్డర్లో హార్దిక్ రాజ్ (24) రాణించిన అప్పటికి చాలా ఆలస్యం అయింది. ఐదుగురు భారత ఆటగాళ్లు రెండంకెల స్కోర్ ను చేరుకోలేకపోయారు. ఇక బంగ్లాదేశ్ బౌలింగ్ లో కెప్టెన్ మహ్మద్ అజీజుల్ హకీమ్ తమీమ్, మహ్మద్ ఇక్బాల్ హసన్ ఎమోన్ చెరో మూడు వికెట్లు తీశారు. 11వ ఎడిషన్ టోర్నీలో మహ్మద్ అమన్ నేతృత్వంలోని భారత జట్టు శ్రీలంకను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. కాగా, సెమీఫైనల్లో బంగ్లాదేశ్ పాకిస్థాన్ను ఓడించింది.
తాజావార్తలు
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
-
Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
-
PoK Unrest 2026: పతనం అంచున పీఓకే.. పాలకులపై తిరగబడ్డ జనం! భారత్లో కలవడానికి పీఓకే మొగ్గు చూపుతోందా?
-
Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
-
Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!