Navy Chief: 2047 నాటికి ఆత్మనిర్భర్గా భారత నావికాదళం.. తొలిసారిగా నేవీలో మహిళా నావికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Navy Chief: భారత నావికాదళం 2047 నాటికి ఆత్మనిర్భర్గా మారుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చిందని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి కుమార్ నేవీ డే సందర్భంగా శనివారం మీడియాతో వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి ఇటీవలి సంఘటనలు మన భద్రతా అవసరాల కోసం ఇతరులపై ఆధారపడలేమని నిరూపించాయని.. ఆత్మనిర్భర్గా ఉండటానికి ప్రభుత్వం చాలా స్పష్టమైన మార్గదర్శకాలను అందించిందని నేవీ చీఫ్ చెప్పారు. తమ దృష్టి అంతా 2047 నాటికి భారత నావికాదళాన్ని పూర్తిగా ఆత్మనిర్భర్గా మార్చడంపైనే ఉందని.. భారత నావికాదళంలో స్వదేశీకరణను సాధించే ప్రయత్నాలను వివరిస్తూ ఆయన అన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా నౌకల కదలికలు పెరగడంపై నేవీ చీఫ్ స్పందిస్తూ, భారతీయ ప్రయోజనాలను కాపాడేందుకు ఈ ప్రాంతంలో జరిగే అన్ని పరిణామాలను గమనిస్తున్నామని చెప్పారు.
త్రివిధ దళాల్లో నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం కింద భారత నౌకాదళంలోకి అగ్నివీరులను నియమించారు. వీరిలో మహిళలు ఉన్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ తెలిపారు. తొలిసారిగా మహిళలను నావికులుగా విధుల్లోకి తీసుకున్నట్లు తెలిపారు. డిసెంబరు 4న నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఆయన ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు. అగ్నిపథ్ కింద దాదాపు 3000 మంది అగ్నివీరులను నేవీలోకి తీసుకున్నామని.. ఇందులో 341 మంది మహిళలు ఉన్నారన్నారు. తొలిసారిగా నేవీలో మహిళా నావికులను నియమించామని ఆయన చెప్పారు. మహిళా నావికులకు కూడా పురుషుల తరహాలోనే శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. శారీరక దారుఢ్యం మొదలైనవాటితో సహా అన్నింటిలో శిక్షణ ఇస్తామన్నారు.
Also Read
- Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
ఖతార్లో నిర్బంధంలో ఉన్న ఎనిమిది మంది నౌకాదళ అనుభవజ్ఞుల స్థితికి సంబంధించిన ప్రశ్నకు నేవీ చీఫ్ స్పందిస్తూ, ఈ సమస్యను అత్యున్నత స్థాయిలో కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది రక్షణ బడ్జెట్లో నేవీ వాటా 17.8 శాతంగా ఉందని, ఇది చాలా సరిపోతుందని నేవీ చీఫ్ చెప్పారు. క్యాపిటల్ టు రెవిన్యూ నిష్పత్తి 32:68గా ఉంది, ఇది చాలా మంచిదని ఆయన తెలిపారు. గత ఏడాది కాలంలో నౌకాదళం అనేక కీలక కార్యక్రమాలు చేపట్టిందని అడ్మిరల్ కుమార్ అన్నారు. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక విక్రాంత్ను ప్రారంభించడం నావికాదళానికి, దేశానికి మైలురాయి అని ఆయన అన్నారు.
Gujarat Assembly Polls: గుజరాత్ ఎన్నికలు.. ముగిసిన రెండో దశ ప్రచారం
1971 ఇండో-పాక్ యుద్ధంలో ‘ఆపరేషన్ ట్రైడెంట్’లో భారత నావికాదళం పాత్రను గుర్తించి, సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడానికి డిసెంబర్ 4ని ప్రతి సంవత్సరం నేవీ డేగా జరుపుకుంటారు.ఈ ఏడాది తొలిసారిగా దేశ రాజధాని వెలుపల విశాఖపట్నంలో నేవీ డే వేడుకలు నిర్వహిస్తున్నారు. భారత నౌకాదళ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, తూర్పు, పశ్చిమ, దక్షిణ నౌకాదళ కమాండ్కు చెందిన ప్రత్యేక దళాలు ఈ సందర్భంగా భారత నావికాదళ సామర్థ్యాన్ని, బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తాయి.
తాజావార్తలు
-
Mega 158: ‘మెగా’ డాటర్ ఫిక్స్.. సినిమాకే హైలైట్ అవ్వనుందా!
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పైపైకి.. ఈరోజు తులం ఎంతంటే?
-
Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్టైమ్ రికార్డ్!
-
IPL 2026 Playoffs Race: ముంబైపై కేకేఆర్ విజయం.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ గల్లంతే, దేవుడు దిగొస్తే తప్ప!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!