Navy Chief: 2047 నాటికి ఆత్మనిర్భర్గా భారత నావికాదళం.. తొలిసారిగా నేవీలో మహిళా నావికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Navy Chief: భారత నావికాదళం 2047 నాటికి ఆత్మనిర్భర్గా మారుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చిందని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి కుమార్ నేవీ డే సందర్భంగా శనివారం మీడియాతో వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి ఇటీవలి సంఘటనలు మన భద్రతా అవసరాల కోసం ఇతరులపై ఆధారపడలేమని నిరూపించాయని.. ఆత్మనిర్భర్గా ఉండటానికి ప్రభుత్వం చాలా స్పష్టమైన మార్గదర్శకాలను అందించిందని నేవీ చీఫ్ చెప్పారు. తమ దృష్టి అంతా 2047 నాటికి భారత నావికాదళాన్ని పూర్తిగా ఆత్మనిర్భర్గా మార్చడంపైనే ఉందని.. భారత నావికాదళంలో స్వదేశీకరణను సాధించే ప్రయత్నాలను వివరిస్తూ ఆయన అన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా నౌకల కదలికలు పెరగడంపై నేవీ చీఫ్ స్పందిస్తూ, భారతీయ ప్రయోజనాలను కాపాడేందుకు ఈ ప్రాంతంలో జరిగే అన్ని పరిణామాలను గమనిస్తున్నామని చెప్పారు.
త్రివిధ దళాల్లో నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం కింద భారత నౌకాదళంలోకి అగ్నివీరులను నియమించారు. వీరిలో మహిళలు ఉన్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ తెలిపారు. తొలిసారిగా మహిళలను నావికులుగా విధుల్లోకి తీసుకున్నట్లు తెలిపారు. డిసెంబరు 4న నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఆయన ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు. అగ్నిపథ్ కింద దాదాపు 3000 మంది అగ్నివీరులను నేవీలోకి తీసుకున్నామని.. ఇందులో 341 మంది మహిళలు ఉన్నారన్నారు. తొలిసారిగా నేవీలో మహిళా నావికులను నియమించామని ఆయన చెప్పారు. మహిళా నావికులకు కూడా పురుషుల తరహాలోనే శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. శారీరక దారుఢ్యం మొదలైనవాటితో సహా అన్నింటిలో శిక్షణ ఇస్తామన్నారు.
Also Read
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
ఖతార్లో నిర్బంధంలో ఉన్న ఎనిమిది మంది నౌకాదళ అనుభవజ్ఞుల స్థితికి సంబంధించిన ప్రశ్నకు నేవీ చీఫ్ స్పందిస్తూ, ఈ సమస్యను అత్యున్నత స్థాయిలో కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది రక్షణ బడ్జెట్లో నేవీ వాటా 17.8 శాతంగా ఉందని, ఇది చాలా సరిపోతుందని నేవీ చీఫ్ చెప్పారు. క్యాపిటల్ టు రెవిన్యూ నిష్పత్తి 32:68గా ఉంది, ఇది చాలా మంచిదని ఆయన తెలిపారు. గత ఏడాది కాలంలో నౌకాదళం అనేక కీలక కార్యక్రమాలు చేపట్టిందని అడ్మిరల్ కుమార్ అన్నారు. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక విక్రాంత్ను ప్రారంభించడం నావికాదళానికి, దేశానికి మైలురాయి అని ఆయన అన్నారు.
Gujarat Assembly Polls: గుజరాత్ ఎన్నికలు.. ముగిసిన రెండో దశ ప్రచారం
1971 ఇండో-పాక్ యుద్ధంలో ‘ఆపరేషన్ ట్రైడెంట్’లో భారత నావికాదళం పాత్రను గుర్తించి, సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడానికి డిసెంబర్ 4ని ప్రతి సంవత్సరం నేవీ డేగా జరుపుకుంటారు.ఈ ఏడాది తొలిసారిగా దేశ రాజధాని వెలుపల విశాఖపట్నంలో నేవీ డే వేడుకలు నిర్వహిస్తున్నారు. భారత నౌకాదళ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, తూర్పు, పశ్చిమ, దక్షిణ నౌకాదళ కమాండ్కు చెందిన ప్రత్యేక దళాలు ఈ సందర్భంగా భారత నావికాదళ సామర్థ్యాన్ని, బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తాయి.
తాజావార్తలు
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్లో రిలీజ్ కు రెడీ..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!