Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News In A First Indian Navy Inducts 341 Women Sailors Under Agniveer Scheme

Navy Chief: 2047 నాటికి ఆత్మనిర్భర్‌గా భారత నావికాదళం.. తొలిసారిగా నేవీలో మహిళా నావికులు

Published Date :December 3, 2022 , 7:04 pm
By Mahesh Jakki
Navy Chief: 2047 నాటికి ఆత్మనిర్భర్‌గా భారత నావికాదళం.. తొలిసారిగా నేవీలో మహిళా నావికులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Navy Chief: భారత నావికాదళం 2047 నాటికి ఆత్మనిర్భర్‌గా మారుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చిందని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి కుమార్ నేవీ డే సందర్భంగా శనివారం మీడియాతో వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి ఇటీవలి సంఘటనలు మన భద్రతా అవసరాల కోసం ఇతరులపై ఆధారపడలేమని నిరూపించాయని.. ఆత్మనిర్భర్‌గా ఉండటానికి ప్రభుత్వం చాలా స్పష్టమైన మార్గదర్శకాలను అందించిందని నేవీ చీఫ్ చెప్పారు. తమ దృష్టి అంతా 2047 నాటికి భారత నావికాదళాన్ని పూర్తిగా ఆత్మనిర్భర్‌గా మార్చడంపైనే ఉందని.. భారత నావికాదళంలో స్వదేశీకరణను సాధించే ప్రయత్నాలను వివరిస్తూ ఆయన అన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా నౌకల కదలికలు పెరగడంపై నేవీ చీఫ్ స్పందిస్తూ, భారతీయ ప్రయోజనాలను కాపాడేందుకు ఈ ప్రాంతంలో జరిగే అన్ని పరిణామాలను గమనిస్తున్నామని చెప్పారు.

త్రివిధ దళాల్లో నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకం కింద భారత నౌకాదళంలోకి అగ్నివీరులను నియమించారు. వీరిలో మహిళలు ఉన్నట్లు నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌. హరికుమార్‌ తెలిపారు. తొలిసారిగా మహిళలను నావికులుగా విధుల్లోకి తీసుకున్నట్లు తెలిపారు. డిసెంబరు 4న నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఆయన ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు. అగ్నిపథ్‌ కింద దాదాపు 3000 మంది అగ్నివీరులను నేవీలోకి తీసుకున్నామని.. ఇందులో 341 మంది మహిళలు ఉన్నారన్నారు. తొలిసారిగా నేవీలో మహిళా నావికులను నియమించామని ఆయన చెప్పారు. మహిళా నావికులకు కూడా పురుషుల తరహాలోనే శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. శారీరక దారుఢ్యం మొదలైనవాటితో సహా అన్నింటిలో శిక్షణ ఇస్తామన్నారు.

Also Read

  • Astrology: ఏప్రిల్‌ 30, గురువారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని శుభవార్తలు..
  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
  • Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..

ఖతార్‌లో నిర్బంధంలో ఉన్న ఎనిమిది మంది నౌకాదళ అనుభవజ్ఞుల స్థితికి సంబంధించిన ప్రశ్నకు నేవీ చీఫ్ స్పందిస్తూ, ఈ సమస్యను అత్యున్నత స్థాయిలో కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది రక్షణ బడ్జెట్‌లో నేవీ వాటా 17.8 శాతంగా ఉందని, ఇది చాలా సరిపోతుందని నేవీ చీఫ్ చెప్పారు. క్యాపిటల్ టు రెవిన్యూ నిష్పత్తి 32:68గా ఉంది, ఇది చాలా మంచిదని ఆయన తెలిపారు. గత ఏడాది కాలంలో నౌకాదళం అనేక కీలక కార్యక్రమాలు చేపట్టిందని అడ్మిరల్‌ కుమార్‌ అన్నారు. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక విక్రాంత్‌ను ప్రారంభించడం నావికాదళానికి, దేశానికి మైలురాయి అని ఆయన అన్నారు.

Gujarat Assembly Polls: గుజరాత్‌ ఎన్నికలు.. ముగిసిన రెండో దశ ప్రచారం

1971 ఇండో-పాక్ యుద్ధంలో ‘ఆపరేషన్ ట్రైడెంట్’లో భారత నావికాదళం పాత్రను గుర్తించి, సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడానికి డిసెంబర్ 4ని ప్రతి సంవత్సరం నేవీ డేగా జరుపుకుంటారు.ఈ ఏడాది తొలిసారిగా దేశ రాజధాని వెలుపల విశాఖపట్నంలో నేవీ డే వేడుకలు నిర్వహిస్తున్నారు. భారత నౌకాదళ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, తూర్పు, పశ్చిమ, దక్షిణ నౌకాదళ కమాండ్‌కు చెందిన ప్రత్యేక దళాలు ఈ సందర్భంగా భారత నావికాదళ సామర్థ్యాన్ని, బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • agniveer scheme
  • chinese ships
  • Indian Navy
  • Navy Chief
  • Navy Chief Admiral R Hari Kumar

తాజావార్తలు

  • MI vs SRH: వాంఖడేలో హై-స్కోరింగ్ థ్రిల్లర్.. 243 పరుగులు చేసిన ముంబైకి షాకిచ్చిన సన్‌రైజర్స్

  • Astrology: ఏప్రిల్‌ 30, గురువారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని శుభవార్తలు..

  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!

  • Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?

  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions