Maryam Nawaz: ఇమ్రాన్ పార్టీ ఇప్పుడు రిక్షాలో సరిపోతుంది.. మరియం నవాజ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maryam Nawaz: మే 9 హింసాకాండ తర్వాత పాకిస్తాన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరిగిన తర్వాత బహిష్కరించబడిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మొత్తం పార్టీ రిక్షాలో సరిపోతుందని అధికార పీఎంఎల్-ఎన్ సీనియర్ నాయకురాలు మరియం నవాజ్ అన్నారు. పంజాబ్ ప్రావిన్స్లోని షుజాబాద్లో జరిగిన యువజన సదస్సులో మరియం నవాజ్ ప్రసంగించారు. పాకిస్థాన్లో దిగుమతి చేసుకున్న క్వింగ్కీ రిక్షా రకాన్ని ప్రస్తావిస్తూ ఆమె అన్నారు. గత నెలలో పారామిలటరీ రేంజర్లు అవినీతి కేసులో ఖాన్ను అరెస్టు చేసిన తర్వాత పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ కార్యకర్తలు హింసాత్మక నిరసనల సందర్భంగా రావల్పిండిలోని మిలటరీ ప్రధాన కార్యాలయంతో సహా 20 సైనిక స్థావరాలు, ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ బెయిల్పై విడుదలయ్యాడు.
Read Also: Plastic Covers: హృదయం ద్రవించే ఘటన.. ఆవు, దూడను పొట్టన పెట్టుకున్న ప్లాస్టిక్ భూతం
Also Read
- Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..
- ROKO Jodi: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.. ఒక్క నెలలో మళ్లీ బరిలోకి..
- Supreme Court: భర్తల పొట్టకొట్టొద్దు.. భార్యల తీరుపై సుప్రీంకోర్టు కామెంట్స్..
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
ఇమ్రాన్ ఖాన్ తన 26 ఏళ్ల రాజకీయ పోరాటం గురించి మాట్లాడారని మరియం నవాజ్ అన్నారు. “నేను మీకు చెప్తాను… అతని 26 ఏళ్ల పోరాటాన్ని కూల్చివేయడానికి కేవలం 26 నిమిషాలు పట్టింది. ఇప్పుడు అతను జమాన్ పార్క్లో ఒంటరిగా కూర్చుంటాడు. అతనిని విడిచిపెట్టిన నాయకులందరూ వారు అక్కడ నుండి వెళ్లిపోయారు.” అని ఆమె చెప్పింది. .మే 9న పాకిస్థాన్ ఆర్మీ సంస్థలపై దాడి చేయడం ద్వారా ఇమ్రాన్ ఖాన్ తిరుగుబాటు చేశారని ఆమె అన్నారు. గందరగోళం, అరాచకత్వాల అధ్యాయం ముగిసిందని.. ఇప్పుడు పురోగతి ప్రయాణం ప్రారంభమవుతుందని మరియం నవాజ్ పేర్కొన్నారు. మే 9న రక్షణ, పౌర స్థావరాలపై జరిగిన దాడులకు ఇమ్రాన్ఖాన్ సూత్రధారి అని, అయితే ఇప్పుడు చర్చలు, సమావేశాల కోసం అడుక్కుంటున్నాడని ఆమె అన్నారు. ఆ హింసాకాండ తర్వాత దేశంలోని అనేక ప్రాంతాలలో పీటీఐ చీఫ్ అరెస్ట్ తర్వాత ప్రజా, సైనిక స్థావరాలపై దాడులు జరిగాయని, దేశానికి నిజమైన శత్రువు ఎవరో గుర్తించామని ఆమె అన్నారు. ఇమ్రాన్ ఖాన్ దేశానికి నిప్పు పెట్టాడని, అతని మద్దతుదారులు మేలో అమరవీరుల స్మారక చిహ్నాలను అపవిత్రం చేశారని, దీనికి ఆయనను క్షమించలేమని మరియం నవాజ్ అన్నారు.
Also Read: Delhi: కోవిడ్ నుండి భారతదేశంలో విమాన ఛార్జీలు 41% పెరిగాయి.. కారణమేంటంటే..!
పీటీఐపై అణిచివేతలో, 100 మంది పార్టీ నాయకులు, మాజీ చట్టసభ సభ్యులు ఫిరాయించారు. ఇమ్రాన్ ఖాన్ మాజీ సహాయకుడు జహంగీర్ ఖాన్ తరీన్ నేతృత్వంలోని ‘కింగ్స్ పార్టీ’ నేతలు ఇస్తెఖామ్ పాకిస్తాన్ పార్టీ (IPP)లో చేరారు. షిరీన్ మజారీ, ఫవాద్ చౌదరి, అమీర్ మెహమూద్ కియాని, అలీ జైదీ, ఇతరులతో సహా డజన్ల కొద్దీ పిటిఐ నాయకులు పార్టీని విడిచిపెట్టారు, అసద్ ఉమర్, పర్వేజ్ ఖట్టక్ వంటి సీనియర్ నాయకులు పార్టీ పదవుల నుండి వైదొలిగారు. తమ పార్టీకి చెందిన నేతలందరూ రాజీనామా చేసినప్పటికీ తన ఆశయ సాధన కోసం పోరాటం కొనసాగిస్తానని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.
తాజావార్తలు
-
Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
-
Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..
-
ROKO Jodi: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.. ఒక్క నెలలో మళ్లీ బరిలోకి..
-
Supreme Court: భర్తల పొట్టకొట్టొద్దు.. భార్యల తీరుపై సుప్రీంకోర్టు కామెంట్స్..
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
ట్రెండింగ్
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..