Imran khan: జైలులో నాకు నాసిరకం ఆహారం అందిస్తున్నారు.. విడుదల చేయండి
- జైలులో తనకు నాసిరకం ఆహారం ఇస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపణ
- పాకిస్తాన్ లోని పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ ఆదేశాల మేరకే..
- నాకు నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారు- ఇమ్రాన్ ఖాన్
- దీంతో నా ఆరోగ్యం నిరంతరం క్షీణిస్తోంది- ఇమ్రాన్ ఖాన్
- తక్షణమే హెల్త్ చెకప్ చేయాలని డిమాండ్.
జైలులో తనకు నాసిరకం ఆహారం ఇస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. పాకిస్తాన్ లోని పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ ఆదేశాల మేరకే తనకు నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీని కారణంగా తన ఆరోగ్యం నిరంతరం క్షీణిస్తోందని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. తక్షణమే హెల్త్ చెకప్ చేయాలనే డిమాండ్ కూడా ఆయన లేవనెత్తారు. పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ సోమవారం ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా బ్లాక్ డేగా పాటించింది. 190 మిలియన్ పౌండ్ల అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో అరెస్టు చేసింది. ఈ సందర్భంగా పీటీఐ సీనియర్ నాయకుడు మూనిస్ ఎలాహి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో స్పందించారు. ‘పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ ఆదేశాల మేరకు ఇమ్రాన్ ఖాన్కు జైలులో నాసిరకం ఆహారం అందిస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది.’ అని తెలిపారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ మాత్రమే ఇంత నీచ స్థాయికి దిగజారుతుందని ఆయన దుయ్యబట్టారు. పాకిస్థాన్ ప్రజల హక్కుల కోసం ఏడాది పాటు జైలులో ఉండి ఇమ్రాన్ ఖాన్ ధైర్యాన్ని ప్రదర్శించారని మూనిస్ ఇలాహి చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ ధైర్యసాహసాలకు సెల్యూట్ చేస్తున్నాం.. అతనిపై పెట్టిన తప్పుడు కేసుల్లో అతన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
Read Also: Andhra Pradesh: వాలంటీర్ల కొనసాగింపుపై మంత్రి కీలక ప్రకటన
Also Read
మరో పీటీఐ నాయకుడు జుల్ఫీ బుఖారీ మాట్లాడుతూ, ‘జైలులో రిఫ్రిజిరేటర్ లేదని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ఈ కారణంగా ఆహారం పాడవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్ ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డాడు. ఆయన ఆరోగ్యాన్ని పరిశీలించి కూడా అరకొర చర్యలు తీసుకుంటున్నారు.’ ఇది పీటీఐ వ్యవస్థాపకుడి ప్రాణాలకు పెద్ద ముప్పుగా మారుతుందని చెప్పారు. గత ఏడాది మే 9న జరిగిన అల్లర్ల కేసులో ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. అతని అరెస్టు తర్వాత పాకిస్తాన్లో అల్లర్లు చెలరేగాయి. అవినీతికి సంబంధించిన కేసులో హైకోర్టుకు హాజరైన సమయంలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టయ్యారు. అతని అరెస్టు తర్వాత.. పాకిస్తాన్లోని వివిధ ప్రదేశాలలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ ధర్నాలో ప్రభుత్వ ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది.
Read Also: Bangladesh – Indian Trains: బంగ్లాదేశ్కు భారత ట్రైన్స్ బంద్.. ఎల్ఐసీ ఆఫీసు క్లోజ్..!
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?