China On G20 Summit: భాగస్వామ్యాలను బలోపేతం చేసే శిఖరాగ్ర సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China On G20 Summit: ఢిల్లీ వేదికగా జరగనున్న జీ20 సమ్మిట్ ఏకాభిప్రాయాన్ని ఏర్పరుస్తుందని, విశ్వాస సందేశాన్ని పంపుతుందని ఆశిస్తున్నట్లు చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి ఎదుర్కొంటున్న పెద్ద సవాళ్లను అధిగమించడంలో జీ20 దేశాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఈ సమ్మిట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నామన్నారు. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన అభివృద్ధి కోసం ఎన్నో ఒత్తిళ్లతో పాటు సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు.
సోమవారం విలేకరుల సమావేశంలో మావో నింగ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 9-10 వరకు న్యూఢిల్లీలో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశం ఏకాభిప్రాయాన్ని ఏర్పరుస్తుందని, విశ్వాసం సందేశాన్ని పంపుతుందని, భాగస్వామ్య శ్రేయస్సు, అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని చైనా భావిస్తోందన్నారు. G20 సమ్మిట్ కోసం చైనా అంచనాలపై ఒక ప్రశ్నకు సమాధానంగా మావో నింగ్ ఇలా అన్నారు. ” ప్రపంచ స్థిరమైన అభివృద్ధికి సవాళ్లు పెరుగుతున్నందున, జీ20 అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి ప్రధాన వేదికగా ఉండటం చాలా ముఖ్యం. ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, వృద్ధికి, అభివృద్ధి ఎదుర్కొంటున్న పెద్ద సవాళ్లకు భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ఎదగడం చాలా ముఖ్యం.” అని మావో నింగ్ పేర్కొన్నారు. భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి వాంగ్ జియాజియాన్ మావో నింగ్ వ్యాఖ్యలను గతంలో ట్విట్టర్లో కూడా పంచుకున్నారు.
Also Read
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
Also Read: Pakistan: పాకిస్థాన్లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ఇద్దరు ఐఎస్ఐస్ కమాండర్లు సహా 7గురు అరెస్ట్
అదే విలేకరుల సమావేశంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్, భారతదేశంలో జరిగే జీ 20 సమ్మిట్కు ప్రతినిధి బృందానికి ప్రీమియర్ లీ కియాంగ్ నాయకత్వం వహిస్తారని ప్రకటించారు. సమ్మిట్ సందర్భంగా లి కియాంగ్ జీ20 సహకారంపై చైనా అభిప్రాయాలు, ప్రతిపాదనలను పంచుకుంటారన్నారు. జీ20 దేశాల మధ్య మరింత సంఘీభావం, సహకారాన్ని ప్రోత్సహిస్తారని ఆమె చెప్పారు.
సెప్టెంబరు 9-10 తేదీల్లో న్యూఢిల్లీలో జీ20 సమ్మిట్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధమైంది. జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచ నేతలు న్యూఢిల్లీకి రానున్నారు. గత ఏడాది డిసెంబర్ 1న భారతదేశం జీ20 అధ్యక్ష పదవిని చేపట్టింది. జీ20కి సంబంధించిన సుమారు 200 సమావేశాలు దేశవ్యాప్తంగా 60 నగరాల్లో నిర్వహించబడ్డాయి. న్యూఢిల్లీలో జరిగే 18వ జీ20 దేశాధినేతలు, ప్రభుత్వ సమ్మిట్ అన్ని జీ20 ప్రక్రియలు, మంత్రులు, సీనియర్ అధికారులు, సివిల్ సొసైటీల మధ్య ఏడాది పొడవునా జరిగే సమావేశాల ముగింపుగా ఉంటుంది. సంబంధిత మంత్రివర్గ, కార్యవర్గ సమావేశాలలో చర్చించి అంగీకరించిన ప్రాధాన్యతల పట్ల నాయకుల నిబద్ధతను తెలుపుతూ, న్యూఢిల్లీ సమ్మిట్ ముగింపులో జీ20 నాయకుల డిక్లరేషన్ ఆమోదించబడుతుంది.
తాజావార్తలు
-
ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు ESIC గుడ్న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
-
Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
-
Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
-
Hyderabad: పరారీలో “గోల్డ్ మ్యాన్” .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
-
Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..