China On G20 Summit: భాగస్వామ్యాలను బలోపేతం చేసే శిఖరాగ్ర సమావేశం
China On G20 Summit: ఢిల్లీ వేదికగా జరగనున్న జీ20 సమ్మిట్ ఏకాభిప్రాయాన్ని ఏర్పరుస్తుందని, విశ్వాస సందేశాన్ని పంపుతుందని ఆశిస్తున్నట్లు చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి ఎదుర్కొంటున్న పెద్ద సవాళ్లను అధిగమించడంలో జీ20 దేశాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఈ సమ్మిట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నామన్నారు. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన అభివృద్ధి కోసం ఎన్నో ఒత్తిళ్లతో పాటు సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు.
సోమవారం విలేకరుల సమావేశంలో మావో నింగ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 9-10 వరకు న్యూఢిల్లీలో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశం ఏకాభిప్రాయాన్ని ఏర్పరుస్తుందని, విశ్వాసం సందేశాన్ని పంపుతుందని, భాగస్వామ్య శ్రేయస్సు, అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని చైనా భావిస్తోందన్నారు. G20 సమ్మిట్ కోసం చైనా అంచనాలపై ఒక ప్రశ్నకు సమాధానంగా మావో నింగ్ ఇలా అన్నారు. ” ప్రపంచ స్థిరమైన అభివృద్ధికి సవాళ్లు పెరుగుతున్నందున, జీ20 అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి ప్రధాన వేదికగా ఉండటం చాలా ముఖ్యం. ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, వృద్ధికి, అభివృద్ధి ఎదుర్కొంటున్న పెద్ద సవాళ్లకు భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ఎదగడం చాలా ముఖ్యం.” అని మావో నింగ్ పేర్కొన్నారు. భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి వాంగ్ జియాజియాన్ మావో నింగ్ వ్యాఖ్యలను గతంలో ట్విట్టర్లో కూడా పంచుకున్నారు.
Also Read
Also Read: Pakistan: పాకిస్థాన్లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ఇద్దరు ఐఎస్ఐస్ కమాండర్లు సహా 7గురు అరెస్ట్
అదే విలేకరుల సమావేశంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్, భారతదేశంలో జరిగే జీ 20 సమ్మిట్కు ప్రతినిధి బృందానికి ప్రీమియర్ లీ కియాంగ్ నాయకత్వం వహిస్తారని ప్రకటించారు. సమ్మిట్ సందర్భంగా లి కియాంగ్ జీ20 సహకారంపై చైనా అభిప్రాయాలు, ప్రతిపాదనలను పంచుకుంటారన్నారు. జీ20 దేశాల మధ్య మరింత సంఘీభావం, సహకారాన్ని ప్రోత్సహిస్తారని ఆమె చెప్పారు.
సెప్టెంబరు 9-10 తేదీల్లో న్యూఢిల్లీలో జీ20 సమ్మిట్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధమైంది. జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచ నేతలు న్యూఢిల్లీకి రానున్నారు. గత ఏడాది డిసెంబర్ 1న భారతదేశం జీ20 అధ్యక్ష పదవిని చేపట్టింది. జీ20కి సంబంధించిన సుమారు 200 సమావేశాలు దేశవ్యాప్తంగా 60 నగరాల్లో నిర్వహించబడ్డాయి. న్యూఢిల్లీలో జరిగే 18వ జీ20 దేశాధినేతలు, ప్రభుత్వ సమ్మిట్ అన్ని జీ20 ప్రక్రియలు, మంత్రులు, సీనియర్ అధికారులు, సివిల్ సొసైటీల మధ్య ఏడాది పొడవునా జరిగే సమావేశాల ముగింపుగా ఉంటుంది. సంబంధిత మంత్రివర్గ, కార్యవర్గ సమావేశాలలో చర్చించి అంగీకరించిన ప్రాధాన్యతల పట్ల నాయకుల నిబద్ధతను తెలుపుతూ, న్యూఢిల్లీ సమ్మిట్ ముగింపులో జీ20 నాయకుల డిక్లరేషన్ ఆమోదించబడుతుంది.
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!