Wrestling Body Chief: పతకాలు నిమజ్జనం చేస్తే న్యాయం జరగదు.. రుజువు కావాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wrestling Body Chief Brij Bhushan Sharan Singh: మహిళా రెజ్లర్ల నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బుధవారం నాడు తనపై ఒక్క ఆరోపణ రుజువైనా ఉరివేసుకుంటానని అన్నారు. రెజ్లర్లందరూ తన పిల్లలలాంటి వారని, తన రక్తం, చెమట కూడా వారి విజయానికి కారణమైనందున వారిని నిందించనని ఆయన పేర్కొన్నారు. రాంనగర్ ప్రాంతంలోని మహదేవ ఆడిటోరియంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘నాపై ఒక్క ఆరోపణ రుజువైనా ఉరి వేసుకుంటానని మరోసారి చెబుతున్నాను.” అని అన్నారు.
‘‘నన్ను ఉరి తీయాలని వారు (మల్లయోధులు) కోరుతూ నాలుగు నెలలు కావస్తున్నా ప్రభుత్వం నన్ను ఉరి తీయడం లేదు.. అందుకే వారు తమ పతకాలను గంగలో నిమజ్జనం చేసేందుకు వెళ్తున్నారు. బ్రిజ్ భూషణ్ను గంగలో పతకాలు విసిరితే ఉరితీయరు. మీ వద్ద రుజువు ఉంటే కోర్టుకు ఇవ్వండి, కోర్టు నన్ను ఉరితీస్తే నేను దానిని అంగీకరిస్తాను. ఆటగాళ్లంతా నా బిడ్డల్లాం టి వారే.. కొద్ది రోజుల క్రితం వరకు నన్ను రెజ్లింగ్ దేవుడు అని పిలిచేవారు.. నేను రెజ్లింగ్ సమాఖ్య చీఫ్గా బాధ్యతలు చేపట్టాక ప్రపంచంలోనే భారత్కు 20వ ర్యాంక్ వచ్చింది.. ఈరోజు నా కష్టానికి ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ రెజ్లింగ్ జట్లలో భారతదేశం పేరు చేర్చబడింది. నేను పగలు, రాత్రి రెజ్లింగ్లో జీవించాను. ఏడు ఒలింపిక్ పతకాలలో ఐదు (రెజ్లింగ్లో) నా పదవీకాలంలోనే భారత్కు వచ్చాయి. నాపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి. ” అని ఆయన అన్నారు.
Also Read
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
జూన్ 5న అయోధ్యలో నిర్వహించనున్న “జన్ చేతన మహా ర్యాలీ”కి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ను అరెస్టు చేసే వరకు నిరసనలు కొనసాగిస్తామని సోమవారం రెజ్లర్లు చెప్పడంతో బ్రిజ్ భూషణ్ సింగ్ ప్రకటనలు వెలువడ్డాయి.
తాజావార్తలు
-
Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
-
Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!