IMF: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) భారీగా నిధులు మంజూరు చేసింది. ఏకంగా 1 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 8,500 కోట్లు) నిధులను విడుదల చేసింది. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్కు మరింత అవకాశం లభించింది. అయితే, ఈ ఆర్థిక సహాయం భారత్కు మరింత ముప్పుగా పరిణమించే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఐఎంఎఫ్ ఈ నిధులను విడుదల చేయడానికి కొన్ని షరతులు విధించినప్పటికీ, ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో ఇది పాకిస్తాన్కు అత్యంత అవసరం. ఈ నిధులతో పాకిస్తాన్ తన ఆర్థిక వ్యవస్థను కొంతవరకు స్థిరీకరించుకునే ప్రయత్నం చేయవచ్చు. అయితే, ఈ డబ్బును పాకిస్తాన్ ఎలా వినియోగిస్తుందనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
India Pak War: శ్రీ నగర్లో మళ్లీ పేలుళ్లు.. దాల్ సరస్సులో మిస్సైల్ కలకలం.!
కొందరు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, పాకిస్తాన్ ఈ నిధులను తన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి, ప్రజల అవసరాలను తీర్చడానికి ఉపయోగిస్తుంది. మరికొందరు మాత్రం, పాకిస్తాన్ ఈ నిధుల్లో కొంత భాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతుగా ఉపయోగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారత్తో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఐఎంఎఫ్ విడుదల చేసిన ఈ నిధులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల కాలంలో భారత్పై పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే. ఈ దాడులకు టర్కీ కూడా సహకరిస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐఎంఎఫ్ భారీగా నిధులు విడుదల చేయడం పాకిస్తాన్కు మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో భారత్కు మరింత ప్రమాదకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.