AAP: రాష్ట్రపతి పాలన తప్పదంటూ లెఫ్టినెంట్ గవర్నర్ వ్యాఖ్యలపై ఆప్ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వ్యాఖ్యలపై ఆప్ నేతలు మండిపడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని ఆమ్ఆద్మీ పార్టీ పేర్కొంది. జైలు నుంచే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాలన కొనసాగిస్తారని ఆప్ నేతలు చేస్తున్న ప్రకటనలపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. ఢిల్లీ పాలన అలా నడవదని సక్సేనా వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ప్రకటనపై ఢిల్లీ మంత్రి అతిశీ మాట్లాడుతూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎవరైనా చట్టసభ సభ్యుడు /సభ్యురాలు దోషిగా తేలితేనే వారి సభ్యత్వం రద్దవుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: Water Crisis: ఒక్క బెంగళూర్ మాత్రమే కాదు.. హైదరాబాద్తో పాటు 30 నగరాలకు పొంచి ఉన్న ప్రమాదం..
Also Read
- Kapil Dev: "బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి".. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
లెఫ్టినెంట్ గవర్నర్ చెబుతున్న రాజ్యాంగ నిబంధన ఏమిటీ? వీటికి సంబంధించి చట్టంలో స్పష్టంగా ఉందని తెలిపారు. అటువంటప్పుడు ఏ పరిస్థితుల్లో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తారు? అని ప్రశ్నించారు. ఆర్టికల్ 356 అంశం అనేకసార్లు సర్వోన్నత న్యాయస్థానానికి చేరిందని మంత్రి అతిశీ పేర్కొన్నారు. పాలనకు ఏ విధమైన అవకాశాలు లేనప్పుడు మాత్రమే ప్రెసిడెంట్ రూల్ విధించాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఒకవేళ ఇప్పుడు అలా చేస్తే.. అది రాజకీయ ప్రతీకారమేనని తేలిపోతుందన్నారు. మరో కోణంలో చూస్తే.. విపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఇదో ఫార్ములా అని భావించాలన్నారు.
ఇది కూడా చదవండి: Anupama: తన పోస్టర్పై బూతు కామెంట్లు.. టిల్లు స్క్వేర్ ఈవెంట్కి ముఖం చాటేసిన అనుపమ!
ఇదిలా ఉంటే అరెస్ట్, ఈడీ కస్టడీపై కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. బుధవారం న్యాయస్థానం విచారించి ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. గురువారం కస్టడీ ముగిసిన తర్వాత కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు ఇదే కేసులో గోవా ఆప్ లీడర్లకు కూడా ఈడీ తాజాగా సమన్లు అందించింది. గురువారం విచారణకు హాజరుకావాలని తెలిపింది.
ఇది కూడా చదవండి: Maldives: మాల్దీవుల్లో తాగునీటి కష్టాలు.. టిబెట్ సాయం
- Tags
- aaps
- Atishi
- clear case
- Delhi
- imposed
తాజావార్తలు
-
Kapil Dev: “బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి”.. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Anaconda vs Python: అనకొండా, కొండచిలువ ఒకటే అనుకుంటున్నారా? అసలు తేడా ఇదే!
-
Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
-
KTR : స్థానిక యువతకు 95 శాతం ఉద్యోగాలు సాధించింది కేసీఆరే
-
Maheshwara Reddy: రివ్యూలపై ‘ఓ సుకుమారి’ నిర్మాత షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!