Delhi Flood: ఇందిరాగాంధీ ఆ నిర్ణయం తీసుకోకుండే నేడు నోయిడా, ఘజియాబాద్ మునిగిపోయేవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Flood: దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజులుగా వర్షాలు కురవకపోయినా యమునా నది నీటిమట్టం రికార్డు స్థాయిలోనే కొనసాగుతోంది. గురువారం పల్లా గ్రామ పరిసర ప్రాంతాల్లో యమునా నీటి మట్టం 212.70 మీటర్లకు చేరుకోగా, ఢిల్లీ రైలు వంతెన వద్ద నీటి మట్టం ఉదయం 208.41 వద్ద నమోదైంది. రాజధానిలో యమునా నది నీటిమట్టం పెరిగిన తీరు, 1978 నాటి వరదల జ్ఞాపకాలను గుర్తకు తెచ్చింది. ఆ సమయంలో యమునా నీటిమట్టం 207.49 మీటర్లకు చేరుకుంది.
1978లో వచ్చిన ప్రమాదకరమైన వరదల తర్వాత ఇందిరాగాంధీ కెనాల్ ప్రాజెక్టు పనులు ఎలా జరిగాయో, దాని ఫలితమే నేడు నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ ముంపునకు గురికాకుండా కాపాడింది. 45 ఏళ్ల క్రితం సంభవించిన వరదల తర్వాత యమునా నదిపై ఆనకట్టను నిర్మించారు. ఇది యమునా నది ఒడ్డున నిర్మించబడింది. దాదాపు 22 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ డ్యామ్ నిర్మాణానికి పెద్ద రాళ్లు, మట్టిని ఉపయోగించారు. యమునా నది వేగవంతమైన ప్రవాహాన్ని ఆపడానికి ఈ ఆనకట్ట రూపొందించబడింది. ఈ రోజు ఈ డ్యామ్ ఢిల్లీలో వరదలను నివారించడంలో సహాయకరంగా ఉంది.
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీ వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
Read Also:Jailer: రజినీ కా హుకుమ్… జారీ అయ్యేది ఎప్పుడు?
1978లో వరదల కారణంగా ఢిల్లీలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ మొత్తం నీటిలో మునిగిపోయింది. టెలిఫోన్ లైన్లు తెగిపోయి విద్యుత్ పూర్తిగా నిలిచిపోయింది. ఢిల్లీలోని మహారాణి బాగ్, ఓఖ్లా, ఆజాద్పూర్, మోడల్ టౌన్ వంటి ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఆ సమయంలో కూడా హత్నికుండ్ బ్యారేజీ నుంచి దాదాపు 7 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
ఇంతకు ముందు కూడా ఢిల్లీలో వరదలు వస్తూనే ఉన్నాయి, కానీ 1978 వరదల వల్ల సంభవించిన విధ్వంసం గురించి ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. ఆ సమయంలో ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయి కంటే 2.66 మీటర్ల ఎత్తులో ఉంది. ఆ సమయంలో యమునా నీటిమట్టం తొలిసారిగా 207.49 మీటర్ల మార్కును తాకింది. అప్పటి నుండి యమునా నీటి మట్టం 207 మీటర్ల మార్కును కేవలం రెండుసార్లు మాత్రమే దాటింది. 2010లో తొలిసారిగా యమునా నీటిమట్టం 207.11 మీటర్లకు చేరుకోగా, 2013లో రెండోసారి 207.32 మీటర్లకు చేరుకుంది. యమునా నదిపై ఉన్న పాత రైలు వంతెన ఎత్తును బట్టి 1866-67లో ఢిల్లీలో డేంజర్ మార్క్ 207.73 మీటర్ల వద్ద ఉంచబడింది.
Read Also:Madhapur DCP Shilpavalli: దుర్గం చెరువు ఘటనలు.. రెండేళ్లలో ఎనిమిది మంది సూసైడ్
తాజావార్తలు
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!