ICC: ఐసీసీ సంచలన నిర్ణయం.. భారత్- పాకిస్థాన్ సెమీఫైనల్ వెన్యూ ఫిక్స్.. ట్విస్ట్ ఏంటంటే..?
ICC Confirms New T20 World Cup Semi-Final Venues: టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ వెన్యూకి సంబంధించి తాజాగా ఐసీసీ నుంచి కీలక సమాచారం వెలువడింది. ఇప్పటికే కొన్ని ఫీక్స్డ్ వెన్యూలు ఉన్నప్పటికీ.. కొన్ని పరిస్థితుల వల్ల అదనంగా మరిన్ని వేదికలు ఖరారు చేసింది. ఐసీసీ కొత్తగా ప్రకటించిన ప్లేయింగ్ కండిషన్స్ వల్ల శ్రీలంకకు హోమ్ సెమీఫైనల్ ఆడే అవకాశం తెరుచుకుంది. వారు ఒకవేళ సెమీస్కు వెళితే.. అక్కడ ఏ జట్టుతో ఆడాల్సి వస్తుందనే అంశంపై వెన్యూ డిసైడ్ అవుతుంది. సూపర్–8 దశ నుంచి శ్రీలంక చివరి నాలుగులోకి వస్తే, భారతదేశం లేదా పాకిస్థాన్ కాకుండా మరో జట్టును ఎదుర్కొంటే, ఆ మ్యాచ్ కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలోనే జరుగుతుంది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా అన్ని స్టేక్హోల్డర్లకు పంపిన కమ్యూనికేషన్లో స్పష్టం చేసింది. ఒకవేళ పాకిస్థాన్ సెమీఫైనల్కు చేరుకుంటే మాత్రం సెమీఫైనల్–1 కొలంబోలోనే జరుగుతుంది. పాకిస్థాన్ క్వాలిఫై కాకపోయినా, శ్రీలంక క్వాలిఫై అయ్యి భారత్ను తప్ప మరో జట్టుతో ఆడితేనా అదే వేదికలో మ్యాచ్ కొనసాగుతుంది.
READ MORE: Modi Cabinet: కేరళ పేరు మార్పునకు కేబినెట్ గ్రీన్సిగ్నల్! కొత్త పేరు ఇదే!?
Also Read
- Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న 'ఓయాసిస్ జనని' యాత్ర.!
- JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
- Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!
- Grok's Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..
ఇలా కాకుండా పాకిస్థాన్, శ్రీలంక రెండూ సెమీఫైనల్కు చేరుకోలేకపోతే.. ఆ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్కు మారుతుంది. రెండో సెమీఫైనల్ మాత్రం ముంబయిలోని వాంఖడే స్టేడియంలోనే జరుగుతుంది. ఒకవేళ భారత జట్టు సెమీఫైనల్కు వస్తే ప్రత్యర్థి ఎవరు అన్నది సంబంధం లేకుండా వాంఖడే వేదికగా ఉంటుంది. కానీ ఇండియా–పాకిస్థాన్ సెమీఫైనల్ జరిగితే మాత్రం ఆ మ్యాచ్ కొలంబోకు షిఫ్ట్ అవుతుంది. ఒకవేళ భారత్, పాకిస్థాన్, శ్రీలంక.. ఈ మూడు జట్లు సెమీఫైనల్కు చేరుకోలేకపోతే, సూపర్–8 గ్రూప్–1లో టాప్లో నిలిచిన జట్టు గ్రూప్–2లో రెండో స్థానంలో ఉన్న జట్టుతో కోల్కతాలో ఆడుతుంది. గ్రూప్–2 విజేత గ్రూప్–1 రన్నరప్తో ముంబయిలో తలపడుతుంది. సూపర్–8 గ్రూప్ల కాంబినేషన్ సైతం ఈ సారి ఆసక్తికరంగా మారింది. గ్రూప్–1లో భారత్, జింబాబ్వే, వెస్టిండీస్, సౌతాఫ్రికా ఉన్నాయి. గ్రూప్–2లో పాకిస్థాన్, శ్రీలంకతో పాటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఉన్నాయి. ముఖ్యంగా శ్రీలంక, పాకిస్థాన్ ఒకే గ్రూప్లో ఉండటం వల్ల ఈ రెండు జట్లు సెమీఫైనల్లో ఒకదానితో ఒకటి తలపడే అవకాశం లేదు.
తాజావార్తలు
-
Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న ‘ఓయాసిస్ జనని’ యాత్ర.!
-
JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
-
Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!
-
Grok’s Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..
-
Orange Cap Holders: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒక రోజులో పూటకో ఆరెంజ్ క్యాప్ హోల్డర్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!