Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా జట్టు ప్రకటన మరింత ఆలస్యం!
- ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ వేదికగా ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ
- ట్రోఫీలో పాల్గొనే జట్టు ప్రకటనపై మరింత సమయం కోరనున్న బీసీసీఐ.
- ఇదివరకు జట్టు ప్రకటను జనవరి 12 చివరి తేది.
- ఇప్పటివరకు ఏ దేశం ప్రకటించని టీంసభ్యుల వివరాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champions Trophy 2025: 2025 ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ వేదికగా ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి జట్టును ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 12న గడువు తేది నిర్ణయించింది. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జట్టును ప్రకటించేందుకు మరింత ఆలస్యం కావచ్చు. తాజా సమాచారం ప్రకారం, బీసీసీఐ తన జట్టును సకాలంలో ప్రకటించడానికి ఐసీసీని మరికొంత సమయం డిమాండ్ చేయవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం, ఐసీసీ సూచనలకు అనుగుణంగా, టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టును సమయానికి ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. అయితే, ఓ నివేదిక ప్రకారం.. బీసీసీఐ జట్టు ప్రకటించడంలో వారం రోజుల ఆలస్యం జరగవచ్చని అంచనా వేసింది.
Also Read: Tamim Iqbal Retirement: బంగ్లాదేశ్కు ఎదురుదెబ్బ.. క్రికెట్కు వీడ్కోలు పలికిన సీనియర్ ప్లేయర్
Also Read
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
ఐసీసీ సాధారణంగా అన్ని జట్లను తమ టోర్నమెంట్కు 4 వారాల ముందు తమ తాత్కాలిక జట్టును ప్రకటించమని అడుగుతుంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విషయంలో పాకిస్థాన్, దుబాయ్లో జరిగే ఈ టోర్నీకి 5 వారాల ముందు జట్లను సమర్పించాలని ఐసీసీ కోరింది. జనవరి 12 లోపల జట్టు జాబితాను సమర్పించాలని ఐసీసీ అన్ని 8 జట్లను అభ్యర్థించింది. కాకపోతే, కొన్ని కారణాల వల్ల బీసీసీఐ జట్టు ప్రకటనలో ఆలస్యం అయ్యేలా కనపడుతుంది. ఈ నేపథ్యంలో జట్టు ఆటగాళ్ల పేర్లను జనవరి 18 లేదా 19 నాటికి ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఐసీసీకి ఇంకా ఏ జట్టు కూడా తమ జట్టును ప్రకటించలేదు. కాబట్టి బిసీసీఐ నిర్ణయానికి అనుగుణంగా ఐసీసీ నిర్ణయం మారవచ్చు. ఇక మరోవైపు, ఇంగ్లండ్తో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును మరో రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
ట్రెండింగ్
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!