Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా జట్టు ప్రకటన మరింత ఆలస్యం!
- ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ వేదికగా ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ
- ట్రోఫీలో పాల్గొనే జట్టు ప్రకటనపై మరింత సమయం కోరనున్న బీసీసీఐ.
- ఇదివరకు జట్టు ప్రకటను జనవరి 12 చివరి తేది.
- ఇప్పటివరకు ఏ దేశం ప్రకటించని టీంసభ్యుల వివరాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champions Trophy 2025: 2025 ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ వేదికగా ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి జట్టును ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 12న గడువు తేది నిర్ణయించింది. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జట్టును ప్రకటించేందుకు మరింత ఆలస్యం కావచ్చు. తాజా సమాచారం ప్రకారం, బీసీసీఐ తన జట్టును సకాలంలో ప్రకటించడానికి ఐసీసీని మరికొంత సమయం డిమాండ్ చేయవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం, ఐసీసీ సూచనలకు అనుగుణంగా, టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టును సమయానికి ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. అయితే, ఓ నివేదిక ప్రకారం.. బీసీసీఐ జట్టు ప్రకటించడంలో వారం రోజుల ఆలస్యం జరగవచ్చని అంచనా వేసింది.
Also Read: Tamim Iqbal Retirement: బంగ్లాదేశ్కు ఎదురుదెబ్బ.. క్రికెట్కు వీడ్కోలు పలికిన సీనియర్ ప్లేయర్
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఐసీసీ సాధారణంగా అన్ని జట్లను తమ టోర్నమెంట్కు 4 వారాల ముందు తమ తాత్కాలిక జట్టును ప్రకటించమని అడుగుతుంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విషయంలో పాకిస్థాన్, దుబాయ్లో జరిగే ఈ టోర్నీకి 5 వారాల ముందు జట్లను సమర్పించాలని ఐసీసీ కోరింది. జనవరి 12 లోపల జట్టు జాబితాను సమర్పించాలని ఐసీసీ అన్ని 8 జట్లను అభ్యర్థించింది. కాకపోతే, కొన్ని కారణాల వల్ల బీసీసీఐ జట్టు ప్రకటనలో ఆలస్యం అయ్యేలా కనపడుతుంది. ఈ నేపథ్యంలో జట్టు ఆటగాళ్ల పేర్లను జనవరి 18 లేదా 19 నాటికి ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఐసీసీకి ఇంకా ఏ జట్టు కూడా తమ జట్టును ప్రకటించలేదు. కాబట్టి బిసీసీఐ నిర్ణయానికి అనుగుణంగా ఐసీసీ నిర్ణయం మారవచ్చు. ఇక మరోవైపు, ఇంగ్లండ్తో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును మరో రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!