Vaibhav Sooryavanshi: ‘నేను బంతిని చూస్తాను.. బౌలర్ను కాదు’.. గెలుపు సీక్రెట్ బయటపెట్టిన వైభవ్
- వైభవ్ కేవలం 26 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు
- రాజస్థాన్ విజయంలో కీలకరోల్
- గెలుపు సీక్రెట్ బయటపెట్టిన వైభవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైభవ్ సూర్యవంశీ ఈ పేరు క్రికెట్ హిస్టరీలో ఓ ప్రత్యేకతను సంతరించుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తన బ్యాటింగ్ తో క్రికెట్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. మంచి నీళ్లు తాగినంత ఈజీగా పరుగులు సాధిస్తున్నాడు. బంతి పడడమే ఆలస్యం బౌండరీగానో, సిక్సర్ గానో మలుస్తున్నాడు. క్రీజులో ఉన్నతం సేపు దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. దిగ్గజ బౌలర్లకు సైతం వణుకుపుట్టిస్తున్నాడు. నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో వైభవ్ కేవలం 26 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేసి రాజస్థాన్ విజయంలో కీలకరోల్ ప్లే చేశాడు.
Also Read:Sam Altman Controversy: ChatGPT సీఈవోపై ఉద్యోగుల సంచలన ఆరోపణలు..
Also Read
- IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
- Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
ఈ యువ రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాట్స్మన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 26 బంతుల్లో 78 పరుగులు చేసి, తన జట్టు రెండు ఓవర్లు మిగిలి ఉండగానే 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో సహాయపడ్డాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలి ఇన్నింగ్స్లో 201/8 స్కోరు చేసింది. మ్యాచ్ అనంతరం, సూర్యవంశీ తన విజయ రహస్యాన్ని వెల్లడిస్తూ, తాను బౌలర్ పేరుతో ప్రభావితం కానని పేర్కొన్నాడు. ‘నేను బంతిని చూస్తాను.. బౌలర్ను కాదు’ అని తెలిపాడు. జస్ప్రీత్ బుమ్రా లేదా జోష్ హేజిల్వుడ్ వంటి బౌలర్ను ఎదుర్కోవాలనే ఆలోచన తన మనసులో ఉన్నప్పటికీ, తాను కేవలం బంతిపైనే దృష్టి పెడతానని చెప్పాడు.
ఈ మ్యాచ్లో సూర్యవంశీ ప్రత్యేకంగా హేజిల్వుడ్ను లక్ష్యంగా చేసుకుని, వరుసగా నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి మ్యాచ్ స్థితిని మార్చేశాడు. ఇంత చిన్న వయసులోనే ఇంతటి విజయం సాధించినప్పటికీ, సూర్యవంశీ ఒదిగి ఉంటాడు. తన తండ్రి సంజీవ్, జట్టు సహాయక సిబ్బంది సభ్యుడు రోమీ భిందర్ నిరంతరం తనకు సరైన మార్గంలో మార్గనిర్దేశం చేస్తారని చెప్పాడు. క్రికెట్ ఒక సుదీర్ఘ ప్రయాణమని, దృష్టి అంతా ఆటపైనే ఉండాలని వారిద్దరూ అతనికి గుర్తుచేస్తుంటారు.
Also Read:US-Iran: నేడు ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు.. సర్వత్రా ఉత్కంఠ
అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, సూర్యవంశీ పూర్తిగా సంతృప్తిగా కనిపించలేదు. 78 పరుగుల వద్ద ఔటవ్వడం నిరాశ కలిగించిందని తెలిపాడు. తాను చివరి వరకు క్రీజులో ఉండి ఉంటే, జట్టుకు మరో 20 పరుగులు జోడించి ఉండేవాడినని తెలిపాడు.
తాజావార్తలు
-
IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
-
Anil Ravipudi : నేటి నుండి వెంకీ – కళ్యాణ్ రామ్ – అనిల్ ఆట షురూ
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
-
Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!