Lok Sabha Elections 2024: 1951-52 తర్వాత ఇవే సుదీర్ఘ ఎన్నికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections 2024: ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నట్లు ఈసీ వెల్లడించింది. దాదాపుగా 82 రోజుల సుదీర్ఘ కాలం పాటు ఎన్నికల ప్రక్రియ జరగబోతోంది.
స్వతంత్ర భారతదేశంలో 1951-52లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత 2024లో జరగబోతున్న పార్లమెంటరీ ఎన్నికలే సుదీర్ఘకాలం పాటు జరగబోతున్నాయి. ఎన్నికల పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఫలితాల వెల్లడి వరకు 44 రోజులు ఉన్నాయి. ఈసీ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఓట్ల లెక్కింపు వరకు మొత్తం ఎన్నికల ప్రక్రియ 82 రోజులు ఉంది.
Also Read
- Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
Read Also: CM Revanth: తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలుగా అండగా ఉంటాను..
భౌగోళిక పరిస్థితులు, ప్రభుత్వ సెలవులు, పండగలు, పరీక్షలు ఇలా పలు అంశాల ఆధారంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడుతుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం అన్నారు. ఇంత సుదీర్ఘ ప్రక్రియ ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా పనిచేయదా.? అని మీడియా ప్రశ్నించిన నేపథ్యంలో.. దేశ భౌగోళిక పరిస్థితులు, నదులు, పర్వతాలు, మంచు, అడవులు, వేసవి, భద్రతా బలగాల తరలింపు ఇలా పలు కారణాలు ఎన్నికల నిర్వహణ సమయాన్ని నిర్దేశిస్తాయని చెప్పారు. మేము ఎవరికీ అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు, ఇలా ఎవరైన సందేహిస్తే అది తప్పుడు భావన అని రాజీవ్ కుమార్ అన్నారు.
దేవంలో మొదటి సాధారణ ఎన్నికలు అక్టోబర్ 25, 1951 నుంచి ఫిబ్రవరి 21, 1952 మధ్య జరిగాయి. ఇదే ఇప్పటి వరకు సుదీర్ఘ ఎన్నికలు. 1962-1989 మధ్య లోక్ సభ ఎన్నికల వ్యవధి 4 రోజుల నుంచి 10 రోజుల మధ్య ఉంది. 1980లో జనవరి 3 నుంచి జనవరి 6 వరకు ఎన్నికల సమయం ఉంది. ఈ ఎన్నికల్లో ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చారు. 2004లో నాలుగు దశల్లో ఎన్నికలకు 21 రోజుల పట్టింది. 2009లో 5 దశల ఎన్నికలకు ఒక నెల పాటు కొనసాగాయి. 2014లో 9 దశల్లో ఎన్నికల నిర్వహణకు 36 రోజులు పట్టాయి. 2019లో 7 దశల్లో 39 రోజుల్లో ఎన్నికలు నిర్వహించారు.
తాజావార్తలు
-
Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
-
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!