Shikhar Dhawan Retirement: అందుకే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికా: ధావన్
- అంతర్జాతీయ క్రికెట్కు ధావన్ వీడ్కోలు
- దేశవాళీ క్రికెట్ ఆడాలనుకోలేదు
- ప్రపంచకప్ గెలిస్తే బాగుండేది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shikhar Dhawan About Retirement: శిఖర్ ధావన్ కంటే ముందు అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు భారత జట్టులో కొనాగుతున్నారు. ఇషాంత్ శర్మ, ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే వంటి వారు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. రిటైర్డ్ భారత క్రికెటర్స్ ఎంఎస్ ధోనీ, పీయూష్ చావ్లా, అమిత్ మిశ్రా వంటి ఆటగాళ్లు ఐపీఎల్లో ఇంకా ఆడుతున్నారు. ఫిట్గా, మంచి ఫామ్లో ఉన్న ధావన్ మాత్రం.. అంతర్జాతీయ క్రికెట్తో పాటు దేశవాళీ క్రికెట్కు వీడ్కోలు పలికి అందరిని ఆశ్చర్యపరిచాడు. తాజాగా తాను అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు ఎందుకు పలకాల్సి వచ్చిందో చెప్పాడు.
భారత జట్టులో స్థానం కోసం దేశవాళీ క్రికెట్లో ఆడే ఆసక్తి లేకపోవడం వల్లే రిటైరయ్యానని శిఖర్ ధావన్ తెలిపాడు. ఓ జాతీయ మీడియాతో గబ్బర్ మాట్లాడుతూ… ‘నేను దేశవాళీ క్రికెట్ ఆడాలనుకోలేదు. అందులో ఆడాలనే ఉత్తేజం, ఆసక్తి నాలో లేదు. నా కెరీర్ చివరి రెండేళ్లలో పెద్దగా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఐపీఎల్లో మాత్రమే ఆడాను. చివరి రెండేళ్లలో నేను క్రికెట్ ఆడింది తక్కువే. చాలా క్రికెట్ ఆడాననుకున్నా. నాకు విరామం కావాలనిపించింది. ఎక్కువగా క్రికెట్ ఆడకపోవడంతో అంతగా ఫామ్లో కూడా లేను. నేను సంతోషంగా ఉన్నా. కెరీర్లో సాధించిన దాని పట్ల సంతృప్తి చెందా. ప్రపంచకప్ గెలిస్తే బాగుండేది’ అని అన్నాడు.
Also Read
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
Also Read: IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. ముంబై ఇండియన్స్కు భారీ ప్రయోజనం!
టీమిండియా ఓపెనర్గా శిఖర్ ధావన్ ధనాధన్ మెరుపులు మెరిపించాడు. కెరీర్లో భారత్ తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో 2315, వన్డేల్లో 6793, టీ20ల్లో 1759 పరుగులు చేశాడు. టెస్టుల్లో 7, వన్డేల్లో 17 సెంచరీలు బాదాడు. ఐపీఎల్లోనూ గబ్బర్ రాణించాడు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పంజాబ్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో 222 మ్యాచ్లు ఆడి 6769 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలు, 51 అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ ఏడాది పంజాబ్కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ)లో ఆడుతున్నాడు.
తాజావార్తలు
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!