Dum Biryani: హోటల్ రుచితో చికెన్ దమ్ బిర్యానీ.. ఈజీగా కేవలం ఒక గంటలోనే ఇలా చేసేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dum Biryani: బిర్యానీ అనగానే నోరూరని వారుండరు. ముక్క మెత్తగా.. మెతుకు పొడిపొడిగా.. మసాలాల ఘుమఘుమలతో సాగే ఆ రుచే వేరు. అయితే, ఇంట్లో బిర్యానీ చేయాలంటే గంటల తరబడి శ్రమించాలని చాలామంది వెనకాడుతుంటారు. కానీ, కేవలం ఒకే గంటలో, రెస్టారెంట్ స్థాయి రుచితో ‘హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ’ని సిద్ధం చేసుకోవచ్చని మీకు తెలుసా.. ఆ అమోఘమైన రుచి మీ సొంతం కావాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే అంటున్నారు పాకశాస్త్ర నిపుణులు. ఇంతకీ అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: X (Twitter) DOWN.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు..!
Also Read
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
- Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
- Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
కావలసినవి:
బాస్మతి బియ్యం: అర కిలో
చికెన్: ఒక కిలో
ఉల్లిపాయలు: 3 (మీడియం సైజు)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
పెరుగు: పావు కప్పు
టమాటాలు: 3
పుదీనా, కొత్తిమీర: తగినంత
మసాలా దినుసులు, కారం, పసుపు, ధనియాల పొడి, నెయ్యి: రుచికి తగినంత
తయారీ విధానం..
ముందుగా అర కిలో బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా తరిగి, నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో బిర్యానీ దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి ఉంచుకోవాలి. శుభ్రం చేసిన చికెన్ను ఒక కడాయిలో వేసి, కొద్దిగా ఉప్పు, పసుపు కలిపి నీరు పోయకుండానే 50 శాతం వరకు ఉడికించాలి. దీనివల్ల ముక్క మెత్తగా ఉండి, త్వరగా దమ్ అవుతుంది. ఎసరు కోసం నీటిని మరిగించి, అందులో ఉప్పు, నెయ్యి, నిమ్మరసం, కేవరా వాటర్ (మంచి సువాసన కోసం) వేయాలి. ఇందులో నానబెట్టిన బియ్యాన్ని వేసి 75-80 శాతం వరకు ఉడికించి వార్చుకోవాలి.
ఒక మందపాటి గిన్నె తీసుకుని, మొదట సగం ఉడికించిన చికెన్ వేయాలి. దానిపై టమాటా-పుదీనా-కొత్తిమీర-పెరుగు మిశ్రమం, మసాలా పొడులు కలిపి ఒక లేయర్లా సర్దాలి. దానిపైన ఉడికించిన అన్నాన్ని వేసి, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, కుంకుమపువ్వు పాలు చల్లాలి. గిన్నెపై టిష్యూ పేపర్లు పరచి, మూత పెట్టి స్టవ్ మీద పెనం ఉంచి దానిపై గిన్నెను పెట్టి 15-20 నిమిషాల పాటు తక్కువ మంటపై దమ్ చేయాలి. ఈ పద్ధతిలో చేసే బిర్యానీకి విడిగా గ్రేవీ అవసరం లేదు. చికెన్లోని మసాలాలే అన్నానికి అద్భుతమైన రుచిని ఇస్తాయి. వేడివేడి బిర్యానీని రైతాతో వడ్డిస్తే ఆ తృప్తైవేరు. ఇక ఆలస్యమెందుకు? ఈ ఆదివారం మీ ఇంట్లోనూ ఈ ఘుమఘుమలు ప్రయత్నించి చూడండి.
READ ALSO: Women Empowerment Scheme: మహిళలకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్లలోకి రూ.10 వేలు వచ్చాయా!
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..