Women Empowerment Scheme: మహిళలకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్లలోకి రూ.10 వేలు వచ్చాయా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women Empowerment Scheme: బీహార్ మహిళలకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ సందర్భంగా సీఎం నితీష్ కుమార్ మహిళా సాధికారత వైపు ఒక బలమైన అడుగు వేసి, రాష్ట్రంలోని 2.5 మిలియన్ల మహిళలకు ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనాలను అందించారు. పాట్నాలోని తన అధికారిక నివాసం, 1 అన్నే మార్గ్లో జరిగిన ఒక కార్యక్రమంలో, ముఖ్యమంత్రి DBT (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా ఒకే క్లిక్లో కోట్ల రూపాయలను మహిళల ఖాతాల్లోకి విడుదల చేశారు.
Also Read
- Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా!
- Madanapalle Lady Don: మదనపల్లె ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు.. 50 రకాల ఆస్తి, 15 ఫోర్జరీ పత్రాలు స్వాధీనం!
- Petrol Attack: ఆదోనిలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇద్దరు మహిళలు!
- India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
ఖాతాల్లోకి బదిలీ అయిన రూ.2500 కోట్లు..
ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద చేపట్టిన ఈ కార్యక్రమం పూర్తి పారదర్శకతను కొనసాగించిందని అధికారులు వెల్లడించారు. ఈ పథకంలో ప్రభుత్వం మధ్యవర్తుల పాత్రను తొలగించి, లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నిధులను బదిలీ చేసింది. సోమవారం ఈ పథకంలో భాగంగా మహిళల ఖాతాల్లోకి మొత్తం రూ.2,500 కోట్లు విడుదలయ్యాయి, ప్రతి లబ్ధిదారు మహిళ అకౌంట్లోకి రూ.10 వేలు వేశారు. చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్న లేదా వారి ప్రస్తుత జీవనోపాధిని మెరుగుపరచుకోవడానికి కష్టపడుతున్న మహిళలకు ఈ మొత్తం ఒక వరంగా చెబుతున్నారు.
గత సంవత్సరం సెప్టెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని బీహార్లో ప్రారంభించారు. అప్పటి నుంచి, ఈ పథకం క్రమంగా విస్తరిస్తోంది. ఈ పథకం కింద దాదాపు 18.1 మిలియన్ల మహిళలు ఒక్కొక్కరికి మొదటి విడత రూ.10,000 అందుకున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ పథకంలో కేవలం రూ.10 వేలతోనే ఆగదు. ఇది కేవలం స్టార్టింగ్లో ఇచ్చేదే అని, ఈ మొత్తాన్ని మహిళలు తమ సొంత వ్యాపారాలు లేదా ఉపాధిని కల్పించుకోడానికి ఉపయోగించుకోవాలని సమాచారం. ఈ మొత్తాన్ని సముచితంగా ఉపయోగించే మహిళలకు ప్రభుత్వం అందించే ప్రత్యేక సహాయం పొందుతారని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అందజేస్తున్న రూ.10 వేలను సద్వినియోగం చేసుకున్న లబ్ధిదారులు త్వరలో అదనంగా రూ.2 లక్షల అందుకుంటారని అధికారులు చెబుతున్నారు. ఎంపిక చేసిన లబ్ధిదారులకు రూ.2 లక్షల వరకు అదనపు ఆర్థిక సహాయం అందించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందని ఇటీవలే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు.
READ ALSO: Hampi Gang Rape Case: హంపి మృగాళ్లకు ఉరిశిక్ష.. సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురికి ఉరి!
తాజావార్తలు
-
The Emraan Era: 20 ఏళ్ల తర్వాత స్టేజ్పైకి ఇమ్రాన్ హష్మీ.. హైదరాబాద్లో డీజే బూత్నే ఊపేసిన సీరియల్ కిస్సర్..
-
Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా!
-
Madanapalle Lady Don: మదనపల్లె ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు.. 50 రకాల ఆస్తి, 15 ఫోర్జరీ పత్రాలు స్వాధీనం!
-
Spurious Liquor Tragedy: కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మృతి.. 25 మందికి పైగా ఆసుపత్రికి తరలింపు
-
SJ Suryah: భైరవుడిని మించిన విలనిజం.. సర్దార్ 2 లో SJ సూర్య ‘బ్లాక్ డాగర్’పై భారీ హైప్!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!