Women Empowerment Scheme: మహిళలకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్లలోకి రూ.10 వేలు వచ్చాయా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women Empowerment Scheme: బీహార్ మహిళలకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ సందర్భంగా సీఎం నితీష్ కుమార్ మహిళా సాధికారత వైపు ఒక బలమైన అడుగు వేసి, రాష్ట్రంలోని 2.5 మిలియన్ల మహిళలకు ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనాలను అందించారు. పాట్నాలోని తన అధికారిక నివాసం, 1 అన్నే మార్గ్లో జరిగిన ఒక కార్యక్రమంలో, ముఖ్యమంత్రి DBT (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా ఒకే క్లిక్లో కోట్ల రూపాయలను మహిళల ఖాతాల్లోకి విడుదల చేశారు.
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
ఖాతాల్లోకి బదిలీ అయిన రూ.2500 కోట్లు..
ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద చేపట్టిన ఈ కార్యక్రమం పూర్తి పారదర్శకతను కొనసాగించిందని అధికారులు వెల్లడించారు. ఈ పథకంలో ప్రభుత్వం మధ్యవర్తుల పాత్రను తొలగించి, లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నిధులను బదిలీ చేసింది. సోమవారం ఈ పథకంలో భాగంగా మహిళల ఖాతాల్లోకి మొత్తం రూ.2,500 కోట్లు విడుదలయ్యాయి, ప్రతి లబ్ధిదారు మహిళ అకౌంట్లోకి రూ.10 వేలు వేశారు. చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్న లేదా వారి ప్రస్తుత జీవనోపాధిని మెరుగుపరచుకోవడానికి కష్టపడుతున్న మహిళలకు ఈ మొత్తం ఒక వరంగా చెబుతున్నారు.
గత సంవత్సరం సెప్టెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని బీహార్లో ప్రారంభించారు. అప్పటి నుంచి, ఈ పథకం క్రమంగా విస్తరిస్తోంది. ఈ పథకం కింద దాదాపు 18.1 మిలియన్ల మహిళలు ఒక్కొక్కరికి మొదటి విడత రూ.10,000 అందుకున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ పథకంలో కేవలం రూ.10 వేలతోనే ఆగదు. ఇది కేవలం స్టార్టింగ్లో ఇచ్చేదే అని, ఈ మొత్తాన్ని మహిళలు తమ సొంత వ్యాపారాలు లేదా ఉపాధిని కల్పించుకోడానికి ఉపయోగించుకోవాలని సమాచారం. ఈ మొత్తాన్ని సముచితంగా ఉపయోగించే మహిళలకు ప్రభుత్వం అందించే ప్రత్యేక సహాయం పొందుతారని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అందజేస్తున్న రూ.10 వేలను సద్వినియోగం చేసుకున్న లబ్ధిదారులు త్వరలో అదనంగా రూ.2 లక్షల అందుకుంటారని అధికారులు చెబుతున్నారు. ఎంపిక చేసిన లబ్ధిదారులకు రూ.2 లక్షల వరకు అదనపు ఆర్థిక సహాయం అందించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందని ఇటీవలే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు.
READ ALSO: Hampi Gang Rape Case: హంపి మృగాళ్లకు ఉరిశిక్ష.. సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురికి ఉరి!
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!