Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి ఆధునిక జీవనశైలిలో భాగమైన ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి హైదరాబాద్ యువత ఆరోగ్యాన్ని నిలువునా ముంచేస్తోంది. నగరంలోని 18 నుంచి 24 ఏళ్ల లోపు కాలేజీ విద్యార్థులపై ఐసీఎమ్ఆర్ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు తాజాగా నిర్వహించిన పరిశోధనలో నమ్మలేని, భయానక నిజాలు వెలుగులోకి వచ్చాయి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ విపరీతంగా తినడం వల్ల చిన్న వయసులోనే ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. కేవలం రుచి, తక్కువ ధర, సులభంగా దొరుకుతుందనే కారణంతో యువత వీటిని ఎగబడి తింటున్నారు. కానీ.. ఈ అలవాటు వారి జీవితకాల ఆరోగ్యాన్ని, ముఖ్యంగా గుండె పనితీరును ప్రమాదంలోకి నెడుతోందని శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్లేట్లోకి మృత్యువు..
మీరు అమితంగా ఇష్టపడే ప్యాకెట్ స్నాక్స్, చాక్లెట్లు, రంగురంగుల షుగర్ డ్రింక్స్, పిజ్జాలు, బర్గర్లు నేరుగా మీ ప్రాణాల మీదకు తెస్తున్నాయని ఈ స్టడీ హెచ్చరిస్తోంది. ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే యువతలో రక్తపోటు ముప్పు సాధారణం కంటే మూడు రెట్లు అధికంగా పెరుగుతోంది. ఇది అంచనా కాదు.. శాస్త్రవేత్తలు 311 మంది కాలేజీ విద్యార్థులపై క్లినికల్ పరీక్షలు చేసి తేల్చిన నిప్పులాంటి నిజం.
Also Read
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
అధ్యయనంలో ఏం తేలాయంటే..
పరీక్షించిన వారిలో 12.5 శాతం మంది యువతకు ఇప్పటికే హై బీపీ ఉన్నట్లు తేలింది. 20 ఏళ్లు కూడా నిండని వయసులో బీపీ రావడం భవిష్యత్తులో పక్షవాతం, కిడ్నీ వైఫల్యానికి దారితీస్తుంది. ఈ కెమికల్స్, నిల్వ పచ్చళ్లు, ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల రక్తనాళాలు పూడుకుపోయి, చిన్న వయసులోనే గుండెపోటు వచ్చే అవకాశాలు వంద శాతం పెరుగుతున్నాయి. రుచి కోసం వాడే మోనోసోడియం గ్లుటామేట్ (అజినోమోటో), అధిక సోడియం, శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ యువతను వీటికి బానిసలుగా మారుస్తున్నాయి.
ఇకనైనా మారకపోతే ముప్పే..
ఈ ప్రమాదం నుంచి యువతను రక్షించాలంటే కాలేజీల స్థాయిలో ప్రత్యేక ఫుడ్ అవేర్నెస్ కార్యక్రమాలు అత్యవసరమని ICMR-NIN శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇంట్లో వండిన సాంప్రదాయ, ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే.. రాబోయే తరం ముసలితనం రాకముందే మంచాన పడక తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రాణం మీదకు తెచ్చుకునే కంటే.. నాలుక రుచిని నియంత్రించుకోవడం ఈ క్షణం నుంచే అవసరం.
తాజావార్తలు
-
Jailer 2 : జైలర్ 2లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ స్పెషల్ క్యామియో
-
Vaibhav Sooryavanshi: అర్ధరాత్రి 2 గంటలకు గదిలో లేని వైభవ్.. టెన్షన్ పడిపోయిన బుడ్డోడి తల్లి!
-
FIFA World Cup 2026: 16 ఏళ్ల తర్వాత తొలి విజయం.. చెక్ రిపబ్లిక్ పై ‘దక్షిణ కొరియా’ సంచలన విజయం.!
-
Sing Geetham Review : సింగ్ గీతం రివ్యూ.. సింగీతం ప్రయోగం ఎలా ఉందంటే?
-
SPIRIT : ప్రభాస్ కోసం అసలు సిసలైన డ్యూటీ చేస్తున్న సందీప్ రెడ్డి
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!